loader

తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి ఎంత సమయమంటే?

వారాంతపు సెలవులు, వరుస హాలీడేస్‌తో కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. తిరుమలలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలిరావడంతో కంపార్ట్‌మెంట్‌లన్నీ కిటకిటలాడుతున్నాయి. భక్తుల క్యూ లైన్లు శిలాతోరణం వరకు కొనసాగుతున్నాయి. శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్లు లేని భక్తులకు 30 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్సు, నారాయణగిరి షెడ్లు నిండిపోవడంతో భక్తులను ఆక్టోపస్ భవనం నుంచి క్యూ లైన్‌లోకి అనుమతిస్తున్నారు.

అమెరికా నుంచి భారీగా చమురు కొంటున్న భారత్

ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితులను గమనిస్తూ, భారత్‌ తన ఇంధన వ్యూహంలో కీలక మార్పులు చేస్తోంది. ముఖ్యంగా, అమెరికా నుంచి ముడి చమురు దిగుమతులు పెద్దగా పెంచుతోంది.భారతదేశంలో అతిపెద్ద చమురు సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఈ ఆగస్టులో 20 లక్షల బ్యారెళ్ల ముడి చమురు కోసం అమెరికాకు ఆర్డర్ వేసింది. ఈ చమురు అక్టోబర్ నాటికి భారత్‌కు చేరనుంది.భారత ప్రభుత్వం ఇప్పటివరకు ఇరాక్, సౌదీ అరేబియా వంటి దేశాలపైనే ఆధారపడింది.

నాగాలాండ్ గవర్నర్ గణేశన్ కన్నుమూత

నాగాలాండ్ గవర్నర్ గణేశన్(80) కన్నుమూశారు. ఈ నెల 8న తన నివాసంలో ప్రమాదవశాత్తు జారిపడటంతో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినా, ఫలితం లేకపోయింది. ఈరోజు ఆయన తుదిశ్వాస విడిచినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. గణేశన్ ఒక నిష్ఠమైన రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా, బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీగా వంటి పలు కీలక పదవులను నిర్వర్తించారు.

కుప్పలు తెప్పలుగా బయటపడుతున్న శవాలు… ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయిన భక్తులు!

అందాల కాశ్మీరం.. కన్నీటి సంద్రమైంది. కిష్వార్‌లోని చండీ మాతా మచైల్‌ యాత్రకు వెళ్లిన భక్తులు ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయారు. ఒక్కసారిగా కురిసిన కుండపోతతో.. అక్కడి కొండల నుంచి పెద్ద పెద్ద బండరాలు.. భక్తులు బసచేస్తున్న గుడారాలు, క్యాంపులపై పడ్డాయి. కొండలపై నుంచి వరద తన్నుకొచ్చింది వందల మంది కొట్టుకుపోయారు. బండరాళ్లు మీదపడి చాలామంది చిక్కుకుపోయారు. బయటకు తీస్తుంటే శవాలు బయటపడుతున్నాయి కాని.. ఎవరూ సజీవంగా రావడంలేదు. శిథిలాల కింద 500మందికి పైగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

సీనియర్ టెర్రరిస్ట్ ను లేపేశాం: ఇజ్రాయెల్

గాజా స్ట్రిప్‌లో హమాస్‌కు మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. Israel భద్రతా దళాలు దక్షిణ గాజాలో వైమానిక దాడి జరిపాయి. ఖాన్ యూనిస్ ప్రాంతంలో జరిగిన ఈ దాడిలో హమాస్‌కు చెందిన సీనియర్ నేత నాసెర్ మౌస్సా హతమయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజీని కూడా ఇజ్రాయెల్ విడుదల చేసింది.ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకారం, నాసెర్ మౌస్సా హమాస్ రఫా బ్రిగేడ్‌కు అత్యంత కీలకమైన నేత. అతను ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చే బాధ్యత తీసుకున్నాడు. పైగా, ఇజ్రాయెల్‌పై దాడుల […]

ఢిల్లీలో కుప్పకూలిన హుమాయున్ దర్గా పైకప్పు… 5 మంది మృతి, పలువురికి గాయాలు

స్వాతంత్ర్య దినోత్సవం మధ్య దేశ రాజధాని ఢిల్లీలో విషాదం చోటు చేసుకుంది. హజ్రత్‌ నిజాముద్దీన్‌ ఏరియాలోని హుమాయున్ సమాధి ప్రాంగణంలో ప్రమాదం జరిగింది. దర్గా పైకప్పు ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. ఈ ప్రమాదంలో 5 మంది మరణించారు. 12 మందికి గాయాలయ్యాయి. మరో 11 మందిని సురక్షితంగా బయటపడ్డారు. గాయాలైన వారిని హుటాహుటిని ఆస్పత్రికి తరలించారు. నిజాముద్దీన్ ప్రాంతంలోని హుమాయున్ సమాధి వెనుక ఉన్న పట్టేషా దర్గా 2 గదులు కూలిపోయాయి. NDRF సహాయక చర్యలు చేపట్టాయి.

బీజేపీలో చేరిన ఫైర్ బ్రాండ్ కస్తూరి.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ!

ప్రముఖ తమిళ నటి కస్తూరి బీజేపీలో చేరారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ఆధ్వర్యంలో ఆమె కండువా కప్పుకున్నారు. ఆమెతో పాటు ట్రాన్స్‌జెండర్ కార్యకర్త, నామిస్‌ సౌత్‌ క్వీన్‌ ఇండియా అధ్యక్షురాలు నమిత మారిముత్తు కూడా బీజేపీలో చేరారు. తమిళ సినిమా ఇండస్ట్రీలో ఫైర్ బ్రాండ్ గా పేరున్న కస్తూరి గత కొన్ని రోజులుగా బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు.

పాఠశాలలో టాయిలెట్లు నిర్మించిన ఫ్రెంచ్‌ విద్యార్థులు

ఫ్రాన్స్‌కు చెందిన విద్యార్థుల బృందం రెండు నెలల ఇంటర్న్‌షిప్‌ కోసం ఉడిపి జిల్లాలోని కన్యాణ గ్రామం కుద్లు తండాకు వచ్చింది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు పాఠాలు చెప్పడం, సృజన్మాత్మక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఊరికి కేవలం ఒక జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోకూడదని ఆ బృందం భావించింది. ఈ క్రమంలోనే పాఠశాలకు అత్యవసరమైన సదుపాయాలను కల్పించాలని నిర్ణయించుకుంది. విద్యార్థుల కోసం పూర్తిస్థాయి మరుగుదొడ్ల సౌకర్యాన్ని సొంతంగా నిర్మించి పాఠశాలకు అందజేశారు.

తెలంగాణలో మార్వాడీ గో బ్యాక్ ప్రచారం.. బండి సంజయ్ ఫస్ట్ రియాక్షన్.

ెలంగాణలో మర్వాడీ గో బ్యాక్, గుజరాతీ గో బ్యాక్ ప్రచారం.. హిందూ సమాజాన్ని చీల్చే మహా కుట్ర అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు. మీరు మర్యాడీ గో బ్యాక్ ఉద్యమాలు చేస్తే… తాము హిందూ కుల వృత్తులను కాపాడుకునే ఉద్యమం చేస్తామన్నారు. ఈ ఉద్యమం కమ్యూనిస్టుల ముసుగులో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం చేస్తున్న డ్రామాలివంటూ ఫైర్ అయ్యారు. మార్వాడీలు హిందూ మతానికి అనుకూలంగా ఉంటున్నారనే కారణంతో.. ఒక పద్దతి ప్రకారం కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

డ్రైవర్‌గా హిందూపురం ఎమ్మెల్యే

నందమూరి బాలకృష్ణ.. సినిమా, రాజకీయాలు రెండింటినూ సమయం, సందర్భం దొరికినప్పుడల్లా తన ప్రత్యేకను చాటుకుంటూనే ఉన్నారు. మరోసారి ఆయన వార్తల్లో నిలిచారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా హిందూపురం బస్టాండ్ నుంచి బాలయ్య క్యాంప్ ఆఫీస్ వరకూ ఆర్టీసీ బస్సును డ్రైవింగ్ చేశారు. బస్సులో మహిళా ప్యాసింజర్లను కూర్చోబెట్టుకుని ఏకంగా రెండు కిలోమీటర్ల మేర బస్సు నడిపిన బాలయ్య.. తన ట్యాలెంట్‌ను చాటుకున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON