ఏపీ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా నలుగురు ప్రమాణం
ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా నలుగురు బుధవారం ప్రమాణం చేశారు. ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు మేరకు రాష్ట్ర హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా పనిచేస్తున్న జస్టిస్ నూనెపల్లి హరినాథ్, మండవ కిరణ్మయి, జగడం సుమతి, న్యాపతి విజయ్ శాశ్వత న్యాయమూర్తులుగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం చేయించారు. వీరి నియామకంతో ఏపీ హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తుల సంఖ్య 24కు చేరుకుంది.