loader

బీ అల‌ర్ట్.. హైద‌రాబాద్‌లో ఉరుములు, మెరుపుల‌తో కూడిన భారీ వ‌ర్షం

హైద‌రాబాద్ న‌గ‌రంలో శ‌నివారం రాత్రి 9.30 గంట‌ల స‌య‌మంలో ఉరుములు, మెరుపుల‌తో కూడిన భారీ వ‌ర్షం కురిసింది. న‌గ‌ర వ్యాప్తంగా వాన బీభ‌త్సం సృష్టించింది. శుక్ర‌వారం అక్క‌డ‌క్క‌డ తేలిక‌పాటి వ‌ర్షాలు కురిసిన‌ప్ప‌టికీ.. శ‌నివారం రాత్రి మాత్రం ఆకాశానికి చిల్లు ప‌డిందా అనే రేంజ్‌లో వ‌ర్షం కురిసింది. ఈ భారీ వ‌ర్షానికి హైద‌రాబాద్ – విజ‌య‌వాడ హైవేపై వ‌ర్ష‌పు నీరు భారీగా నిలిచిపోయింది. పెద్ద అంబ‌ర్‌పేట్ నుంచి హైద‌రాబాద్ సిటీలోకి వెళ్లే రోడ్ల‌పై భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్ప‌డింది.

వారికి రక్షా బంధన్ కానుక పంపిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ రక్షాబంధన్ సందర్భంగా తాను ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని వితంతు మహిళలకు చీరలు పంపించారు. పిఠాపురం నియోజకవర్గంలోని 1,500 మంది వితంతు మహిళలకు పవన్ కల్యాణ్ రాఖీ కానుక పంపారు. పిఠాపురం నియోజకవర్గానికి చెందిన జనసైనికుల ద్వారా ఈ కానుకలను పంపించారు. పిఠాపురం శాసనసభ్యుడిగా మాత్రమే కాకుండా, ఒక సోదరుడిగా, కుటుంబ సభ్యుడిగా పవన్ కల్యాణ్ ఈ కానుకలు పంపినట్టుగా తెలిపారు.

ఫలించని చర్చలు.. పర్సంటేజ్ విధానానికి ఒప్పుకోని ఫెడరేషన్

సినీ కార్మికుల వేతనాలపై నిర్మాతల కీలక ప్రతిపాదనలు జరిగాయి. రోజు వేతనం 2 వేల లోపు ఉన్నవారికి పెంచాలని నిర్ణయం తీసుకున్నారు నిర్మాతలు. 3 విడతల్లో వేతనాల పెంపునకు నిర్మాతల అంగీకారం తెలిపారు. కాగా ఈ చర్చలు విఫలం అయ్యాయి. నిర్మాతల ప్రతిపాదనలను అంగీకరించలేదు కార్మిక ఫెడరేషన్. పర్సంటేజ్ విధానాన్ని ఫెడరేషన్ ఒప్పుకోలేదు. 30శాతం వేతనాలు పెంచితేనే షూటింగ్స్‌కు వెళ్తాం, నిర్మాతల షరతులను అంగీకరిస్తాం కానీ.. అన్ని యూనియన్ల కార్మికులకు సమానంగా వేతనం పెంచాలి. యూనియన్లను విడగొట్టేలా […]

తెలంగాణలో మరో భారీ పెట్టుబడి…

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) కూడా రెడీ అయింది. రాష్ట్రంలో రూ.80వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఎన్టీపీసీ సంసిద్ధత వ్యక్తం చేసింది. న్టీపీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గురుదీప్ సింగ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం శనివారం రోజున హైదరాబాద్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లింది. సీఎం రేవంత్ రెడ్డితో గురుదీప్ సింగ్ నేతృత్వంలోని బృందం మర్యాదపూర్వకంగా భేటీ అయింది.

న్యూయార్క్‌ నగరంలో కాల్పుల కలకలం

అమెరికా న్యూయార్క్‌ నగరంలోని ప్రఖ్యాత టైమ్స్‌ స్క్వేర్‌ వద్ద కాల్పుల కలకలం రేపాయి. ఈ సంఘటన శనివారం తెల్లవారుజామున 1:20 గంటలకు జరిగినట్లు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో ముగ్గురు గాయపడ్డారు. రద్దీగా టైమ్స్ స్క్వేర్ వద్ద కాల్పులు జరగడంతో అక్కడున్న జనాలు భయంతో పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

గిరిపుత్రులే రాష్ట్రాభివృద్ధి పునాది.. అభివృద్ధి హామీల వర్షం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాడేరు మండలంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు ప్రారంభించారు. ఆదివాసీలు అన్ని విధాలా అభివృద్ధి చెందితేనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని, గిరి పుత్రుల్లో మరింత చైతన్యం తీసుకురాగలిగితే అభివృద్ధికి ఢోకా ఉండదని ముఖ్యమంత్రి అన్నారు. వంజంగిలో వనదేవత మోదకొండమ్మ ఆలయాన్ని ముఖ్యమంత్రి దర్శించుకున్నారు. అనంతరం గ్రామ సమీపంలో కాఫీ తోటలను పరిశీలించి, గిరిజన సంప్రదాయ వేడుకలను తిలకించారు.

ఢిల్లీలో గోడకూలి 8 మంది మృతి

దేశ రాజధాని ఢిల్లీలో పండగ సంతోషాలను చెరిపేసేలా ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. ఎడతెరిపి లేకుండా కురవడంతో, హరినగర్‌లోని పాత ఆలయానికి ఆనుకుని ఉన్న ఒక భారీ గోడ అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ గోడ కూలిన దుర్ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.

మంత్రి లోకేశ్, బీటెక్ రవిల నుంచి ప్రాణహాని…వైసీపీ నేత సతీష్ రెడ్డి

పులివెందులలో పోలీసులు పచ్చ కండువా వేసుకొని తిరుగుతున్నారన్నారు. తనకు మంత్రి నారా లోకేశ్, బీటెక్ రవిల నుంచి ప్రమాదం ఉందనే విషయం కొంతమంది టీడీపి వర్గీయుల ద్వారానే సమాచారం అందిందన్నారు. తనకు ప్రాణహాని జరగబోతోంది సమాచారం ఉంది అని ఆరోపించారు. తనను రక్షించాల్సిన బాధ్యత పోలీసులదేనని అలా కాకుండా ఏదైనా జరిగితే.. దానికి బాధ్యులు మంత్రి లోకేష్.. మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి మాత్రమే నని వైసీపీ నేత సతీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

నేను ఎవరికీ హామీ ఇవ్వలేదు, ఫేక్ న్యూస్ పై మెగాస్టార్ చిరంజీవి క్లారిటీ

చిరంజీవి ప్రకటనలో ఈ విధంగా అన్నారు. “నా దృష్టికి వచ్చిన విషయం ఏమిటంటే — ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులమని చెప్పుకుంటున్న కొంతమంది వ్యక్తులు మీడియాలోకి వెళ్లి, నేను వారిని కలసి, 30% వేతన పెంపు వంటి వారి డిమాండ్లను అంగీకరించానని తప్పుడు ప్రకటనలు చేశారు. నేను ఫెడరేషన్‌కి చెందిన ఎవరినీ కలవలేదు.” ఇది పరిశ్రమ మొత్తానికి సంబంధించిన సమస్య అని, వ్యక్తిగతంగా ఏ ఒక్కరు అయినా ఈ విషయంపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదని చిరంజీవి […]

అరకు కాఫీ…. బ్రాండింగ్ కోసం టాటా సంస్థతో ఎంఓయూ

రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అరకు కాఫీ కియోస్క్ ను మెప్మా ద్వారా ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదిరింది. ఇక గిరిజన సహకార కార్పోరేషన్ ఉత్పత్తులను అమెరికా లాంటి దేశాల్లో విక్రయించేందుకుగానూ హాతీ సర్వీసెస్ ఎల్ఎల్ సీ కంపెనీతోనూ జీసీసీ ఒప్పందం చేసుకుంది. షోరూముల వద్ద అరకు కాఫీ కియోస్క్ లను ఏర్పాటు చేయాలని కూడా ఒప్పందంలో అవగాహన కుదిరింది. ప్రముఖ కార్పోరేట్ దిగ్గజం టాటా కన్స్యూమర్స్ సంస్థ కూడా ఆర్గానిక్ అరకు కాఫీని బ్రాండ్ చేసేందుకు, మార్కెట్ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON