loader

హైదరాబాద్ లో దంచికొట్టిన వాన

హైదరాబాద్ నగరంలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని పూర్తిగా స్తంభింపజేసింది. కేవలం గంట వ్యవధిలోనే పలు ప్రాంతాల్లో 7 నుంచి 12 సెం.మీ.లకు పైగా వర్షపాతం నమోదైంది. అత్యధికంగా శేరిలింగంపల్లిలో 12.3 సెం.మీ, ఖైరతాబాద్‌లో 11.13 సెం.మీ, సరూర్‌నగర్‌లో 10.6 సెం.మీ వర్షం కురిసింది. దీంతో నగరం మొత్తం జలమయం అయింది. బస్తీలు, కాలనీల్లోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పంజాగుట్ట, గచ్చిబౌలి, ఖైరతాబాద్, బేగంపేట్, మెహిదీపట్నం, గచ్చిబౌలి వరకు […]

చేనేత కుటుంబానికి.. నేతన్న భరోసా కింద రూ.25 వేలు

రాష్ట్రంలోని చేనేత కళాకారుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నేతన్న భరోసా కింద ఏడాదికి ఒక్కో చేనేత కుటుంబానికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తామని ప్రకటించారు. గురువారం గుంటూరు జిల్లా, మంగళగిరిలో నిర్వహించిన 11వ జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు… విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సహకారంతో గతంలో ఏర్పాటైన వీవర్‌శాలను సందర్శించారు.

ఏపీ చరిత్రలోనే తొలిసారి.. భారీ అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది.

ఓ పనికి రూ.5 కోట్లు డిమాండ్ చేసిన అధికారి..నోట్ల కట్టలతో అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు.. భారీగా నగదుతో ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ చీఫ్ ఇంజనీర్ ఏసీబీకి చిక్కడం కలకలం రేపింది. ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్లో చీఫ్ ఇంజనీర్ గా పని చేస్తున్న సబ్బవరం శ్రీనివాస్ పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు 5 కోట్ల రూపాయల లంచం డిమాండ్ చేశారు. రూ.5 కోట్ల లంచం డిమాండ్ చేసి మొదటి విడతలో25 లక్షలు తీసుకుంటూ ఎసిబికి దొరికిపోయాడు.

ఏంటీ కుండపోత వర్షం… నగరంలో క్లౌడ్ బరస్ట్ జరుగుతోందా?

రాజధాని నగరం హైదరాబాద్ లో ఒక్కసారిగా కుండపోత వర్షం మొదలయ్యింది. గురువారం ఉదయంనుండి ఉక్కపోత వాతావరణం ఉండగా సాయంత్రం సడన్ గా వర్షం మొదలయ్యింది. ఒక్కసారిగా ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్లుగా వర్షం కురవడంతో నగరవాసులు ఆందోళనకు గురవుతున్నారు. సరిగ్గా కార్యాలయాల నుండి ఉద్యోగులు ఇళ్లకు బయలుదేరే సమయంలో వర్షం మొదలవడంతో ఎక్కడిక్కడ ట్రాఫిక్ జామ్స్ మొదలయ్యాయి. పోలీసులు, జిహెచ్ఎంసి, హైడ్రా సిబ్బంది రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.

హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ చెరువునే కబ్జా చేయాలని ప్లాన్ వేశారు

హైటెక్ సిటీ సమీపంలోని భరత్‌నగర్ – ఖైతలాపూర్‌ మార్గంలో ఉన్న వరద కాలువను ఆక్రమించిన వాసవి కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థపై హైడ్రా ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు చేపడుతున్నారన్న స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ముల్లకత్వ చెరువు, కాముని చెరువు, మైసమ్మ చెరువులను కలిపే వరద కాలువలో నిర్మాణ సంస్థ మట్టి పోసినట్లు విచారణలో తేలింది. నిర్మాణ సంస్థపై […]

విశాఖలో ఘోర ప్రమాదం.. గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి

విశాఖలో గురువారం సాయంత్రం ఘోర ప్రమాదం సంభవించింది. గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతిచెందగా..మరో నలుగురు గాయపడ్డారు. ఫిషింగ్ హార్బర్ సమీపంలో హిమాలయ బార్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. వెల్డింగ్ షాప్‌లో ఆక్సిజన్ సిలెండర్ లీక్ అయి.. భారీ శబ్దంతో పేలిపోయింది. దీంతో పేలుడు ధాటికి షాపులోని ఉన్న వ్యక్తులు తునాతునకలయ్యారు. స్పాట్‌లోనే ముగ్గురు చనిపోగా.. గాయపడినవారిని చికిత్స కోసం కేజీహెచ్‌కు తరలించారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

ఎన్నికల కమిషన్ పనిచేస్తోందా?.. గత ఎన్నికల్లో భారీగా ఓటర్ల తారుమారు

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం మరోసారి ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేశారు. మహారాష్ట్రలో ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్‌ ఒకలా ఉండగా, ఫలితాలు మరోలా వచ్చాయని, దీనివల్ల ఎన్నికల్లో మోసం జరిగిందన్న అనుమానాలకు బలమొచ్చిందన్నారు. మహారాష్ట్రలో 40 లక్షలకుపైగా అనుమానాస్పద ఓటర్లు ఉన్నారని “ఈ అనుమానాస్పద ఓటర్లను ఎన్నికల సంఘం ఎందుకు కాపాడుతోంది? ఇది ఎన్నికల సంఘం, బీజేపీ కలిసి చేసిన కుట్ర. ఎన్నికల డేటాను ఎలక్ట్రానిక్‌గా ఎందుకు ఇవ్వడం లేదు?” అన్నారు.

హైకోర్టు జడ్జిగా బీజేపీ మాజీ అధికార ప్రతినిధి

బీజేపీ మాజీ అధికార ప్రతినిధిని బాంబే హైకోర్టు జడ్జీగా నియమించడం మహారాష్ట్రలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఒక రాజకీయ నేతను న్యాయమూర్తిగా నియమిస్తే సామాన్యుడికి న్యాయం ఎక్కడ లభిస్తుందని విపక్ష నేతలు విమర్శిస్తుండగా, గతంలో కాంగ్రెస్‌ హయాంలోనూ ఇటువంటి నియామకం జరిగిందని, అప్పుడు అది ఒప్పయినప్పుడు ఇప్పుడెలా తప్పవుతుందని బీజేపీ ప్రశ్నిస్తున్నది. బీజేపీ అధికార ప్రతినిధిగా పనిచేసిన లాయర్‌ ఆర్తీ సాథేను కొలీజియం ఇటీవల బాంబే హైకోర్టు జడ్జీగా నియమించింది. దీనిపై ఎన్సీపీ (ఎస్పీ) ఎంఎల్‌ఏ రోహిత్‌ […]

ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్….రీపోస్టింగ్ బటన్

ప్రముఖ సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్ కొత్తగా ఒక ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. రీపోస్ట్ అనే ఫీచర్ సహాయంతో యూజర్స్ వారికి నచ్చిన పోస్ట్ , రీల్‌ను రీపోస్ట్ చేయవచ్చు. ఇది వారి ఫాలోవ్స్ ఫీడ్‌లో కనిపిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్ ఇంటరాక్షన్ పెంచేందుకు, ఫ్రెండ్స్‌ ఫీడ్‌లో కంటెంట్ డిస్కవరీ ఫీచర్‌ను మెరగుపర్చేందకు ఈ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీనితో పాటు మరో 2 ఫీచర్లను ఇన్‌స్టాగ్రామ్ ప్రవేశపెట్టింది. ఇన్‌స్టాగ్రామ్ మ్యాప్(Instagram Map), రీల్స్‌లో ఫ్రెండ్స్ ట్యాబ్‌ను అందుబాటులోకి తెచ్చింది.

నేతన్నలకు కూటమి ప్రభుత్వం కానుక

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చేనేతలకు గుడ్ న్యూస్ తెలిపింది. నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం కింద మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల అందజేయనుంది. ఈ మేరకు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ పథకం నేటి నుంచే అమలు కానుంది అని తెలిపారు. రాష్ట్రంలో మగ్గాల మీద 50 వేల నేతన్నలు, మర మగ్గాలపై 11,500ల మంది ఆధారపడి జీవిస్తున్నారని వారందరికీ ఉచిత […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON