loader

ఏకంగా 12సార్లు శ్రీశైలం హుండీ సొమ్ము కాజేసిన ఉద్యోగి..

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మల్లికార్జున స్వామి గర్భాలయంలో కాంట్రాక్ట్ బేసిక్ విధానంలో పరిచారకుడిగా విధులు నిర్వహిస్తున్న విద్యాధర్ గత 18 నెలల నుండి డ్యూటీ సమయం కంటే అరగంట ముందే హారతికి సంబంధించిన పనులు చూడాలంటూ గర్భాలయంలోకి వెళ్లేవాడని ఆ సమయంలో క్లాత్ హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను దొంగలించేవాడని సుమారు 12 సార్లు దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడన్నారు. దొంగలించిన రూ.1,24,200 నగదుతో పాటు కొనుగోలు చేసిన బుల్లెట్ బైక్ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ప్రసాదరావు తెలిపారు.

మెగా డీఎస్సీ ఫైనల్ కీ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన మెగా డీఎస్సీ కి రాష్ట్రవ్యాప్తంగా 16,347 టీచర్ పోస్టుల భర్తీ కోసం పరీక్షలు నిర్వహించబడ్డాయి. పరీక్షల అనంతరం విడుదల చేసిన ప్రాథమిక కీపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు ఆహ్వానించారు. ఈ అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం చివరికి ఫైనల్ కీ ను విడుదల చేసినట్లు ఫైనల్ కీని ఒకసారి విడుదల చేసిన తర్వాత దానిపై ఏమైనా అభ్యంతరాలను స్వీకరించే అవకాశం లేదని అందుకే ఈ ఫైనల్ కీ ఆధారంగానే పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నారు.

ఇంగ్లాండ్‌ గడ్డపై భారత్ కొత్త‌ చరిత్ర

2025 టెస్ట్ సిరీస్‌లో భారత జ‌ట్టు క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభించింది. ఇంగ్లాండ్ వేదికగా ఆడుతున్న ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భారత జట్టు 3393 పరుగులు చేసి ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. ఒక టెస్టు సిరీస్ లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన జ‌ట్టుగా టీమిండియా నిలిచింది. ఇదివరకూ ఈ ఘనత దక్షిణాఫ్రికా జట్టుతో పేరుతో ఉంది. 2003లో సౌతాఫ్రికా జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో మొత్తం 3088 పరుగులు చేసింది. ఈ రికార్డుతో భార‌త జ‌ట్టుపై […]

71వ జాతీయ సినీ అవార్డులు

32 ఏళ్ల తర్వాత మొట్టమొదటి నేషనల్ బెస్ట్ యాక్టర్ అందుకోబోతున్న షారుక్ ఖాన్.. ‘జవాన్’ మూవీలో నటనకి గాను జాతీయ ఉత్తమ నటుడిగా గుర్తింపు.. ‘10th Fail’ మూవీ నటుడు విక్రాంత్ మాస్సేతో కలిసి సంయుక్తంగా ఉత్తమ జాతీయ నటుడు అవార్డు అందుకోబోతున్న షారుక్ ఖాన్.. ‘మిసెస్ ఛటర్జీ vs నార్వే’ చిత్రంలో నటనకి బాలీవుడ్ సీనియర్ నటి రాణీ ముఖర్జీకి జాతీయ ఉత్తమ నటి అవార్డు దక్కింది.

ఓట్ల దొంగతనం-రాహుల్ ఆరోపణలు-ఈసీ స్పందన

రాహుల్ గాంధీ, ఎన్నికల సంఘం భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ” ఓట్ల దొంగతనం”లో పాలు పంచుకుందని ఆరోపించారు. ఈ ఆరోపణలకు సంబంధించి విపక్షాలు నిర్వహించిన స్వతంత్ర దర్యాప్తులో “పక్కా సాక్ష్యాలు” లభించాయన్నారు. ఇవి బయట పెడితే “అణుబాంబు” స్థాయిలో రియాక్షన్ వస్తుందని, ఈ సాక్ష్యాలు బహిర్గతమైతే ECIకి దాక్కునే అవకాశం ఉండదని హెచ్చరించారు. ECI, రాహుల్ గాంధీ ఆరోపణలను “ఆధారరహితం” , “బాధ్యతారహితం” అని తీవ్రంగా ఖండించింది. “రోజువారీ ఆధార రహిత ఆరోపణలను” ECI పట్టించుకోదన్నారు.

జనాలు మీ తోకలు కట్‌ చేయకుండా చూసుకోండి..అంబటి రాంబాబు

164 సీట్లు తెచ్చుకుని మంచి పాలన చేయాల్సిన మీరు.. ఇంకా జగన్‌ నామ జపం చేస్తున్నారని విమర్శించారు. జగన్‌ పర్యటనల సమయంలో జనం వచ్చిన విజువల్స్‌ చూపించాల్సిన అవసరం లేదని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. జనం రాకపోతే అసలు లాఠీచార్జ్‌ ఎందుకు చేశారో హోం మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. వాళ్లు ఎంత కట్టడి చేస్తే అంత జనం వస్తున్నారని తెలిపారు. చంద్రబాబు మా తోకలు కట్‌ చేయడం కాదు.. మా తోకలు జనం […]

ఏపీలో చేనేతలకు గుడ్ న్యూస్…ఆగస్టు 7న కొత్త పథకం ప్రారంభం

చేనేతల ఆర్థిక వృద్ధికి మరో కీలక పథకం ఉచిత విద్యుత్ పథకానికి సీఎం చంద్రబాబునాయుడు పచ్చజెండా ఊపారు. రాష్ట్రంలో మగ్గాల మీద 50 వేల నేతన్నలు, మర మగ్గాలపై 11,500ల మంది ఆదారపడి జీవిస్తున్నారు. వారందరికీ ఉచిత విద్యుత్ పథకం వర్తింపజేసేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500ల ఉచితంగా అందజేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వంపై ఏటా రూ.125 కోట్ల మేర భారం పడనుంది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు కూటమి […]

71వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్.. ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి

భారతీయ సినీ రంగంలో ప్రతిష్టాత్మక 71వ ‘నేషనల్ ఫిలిం అవార్డ్స్’ 2023వ సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉత్తమ తెలుగు చిత్రం’గా నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ సినిమా ఎంపికైంది. ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ విభాగంలో ‘హనుమాన్’ చిత్రాన్ని ఎంపిక చేయగా.. ఉత్తమ గేయ రచయితగా ‘బలగం’ సినిమాలో ‘ఊరు పల్లెటూరు’ పాటకు గానూ లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్‌ ‘బేబీ’ సినిమాకి బెస్ట్ స్క్రీన్ ప్లే సాయి రాజేష్, బెస్ట్ మేల్ సింగర్ అవార్డు పీవీఎన్ఎస్ […]

న‌ల్ల‌గొండ జిల్లాలో 106 మంది బాల కార్మికుల రెస్క్యూ : ఎస్పీ శ‌ర‌త్ చంద్ర ప‌వార్‌

ఆప‌రేష‌న్ ముస్కాన్‌ కార్యక్రమం ద్వారా నల్లగొండ జిల్లాలో రికార్డు స్థాయిలో బాల కార్మికులకు విముక్తి కల్పించినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. బాల కార్మికులను రెస్క్యూ చేసి కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించామ‌న్నారు. ఎస్పీ నేతృత్వంలో పోలీస్ శాఖ,ఇత‌ర విభాగాల  సమన్వయం ఒక్క జూలై నెలలోనే 106 మంది పిల్లలను రెస్యూ చేశారు. వీరిలో 94 మంది బాలలు, 12 మంది బాలికలు ఉన్నారు. వీరంతా ఎక్కువగా బీహార్, చత్తీస్‌గ‌ఢ్‌, ఒరిస్సా, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన […]

భారత్‌ కొంటున్న చమురుతోనే పుతిన్‌.. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు

రష్యాతో భారత్‌ చమురు బంధమే.. న్యూఢిల్లీతో చర్చల్లో తమకు చికాకు తెప్పించే అంశమని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో అన్నారు. రష్యాపై పలు దేశాల ఆంక్షల వల్ల అక్కడ భారత్‌కు చమురు చౌకగా లభిస్తోంది. దీంతో న్యూఢిల్లీ తమ అవసరాల దృష్ట్యా రష్యా నుంచి చమురును తక్కువ ధరకు కొనుగోలు చేస్తోంది. దురదృష్టవశాత్తూ భారత్‌ చమురు కొనుగోలు వల్లే రష్యాకు నిధులు సమకూరుతున్నాయి. ‘రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోళ్లే ఉక్రెయిన్‌లో మాస్కో యుద్ధ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON