loader

రేవంత్‌ రెడ్డికి మందకృష్ణ మాదిగ డెడ్‌లైన్‌

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగులు, చేయూత ఫించన్లు పెంచుతామని హామీ ఇచ్చారు. 20 నెలలు గడిచిపోయాయి. రూపాయి పింఛను పడలేదని ఆరోపించారు. ఆగస్టు మొదటి వారంలోపు పింఛన్లు చెల్లించాలని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి డెడ్‌లైన్‌ పెడుతున్నామన్నారు. ఆలోగా వారి పింఛన్‌ బకాయిలు డబ్బులు ఇవ్వకుంటే ఎమ్మార్పీఎస్‌, వీహెచ్‌పీఎస్‌ ఆధ్వర్యంలో ఆగస్టు 13న ఎల్బీ స్టేడియంలో లక్షలాది మందితో దివ్యాంగులు, చేయూత పింఛన్‌దారుల గర్జన కార్యక్రమాన్ని చేపడుతామని హెచ్చరించారు.

బిహార్‌లో 52 ల‌క్ష‌ల ఓట‌ర్ల తొల‌గింపు..

బిహార్ రాష్ట్రంలోని ఓట‌ర్ల సంఖ్య‌ను వెల్ల‌డించానికి రెండు రోజుల ముందే కేంద్ర ఎన్నిక‌ల సంఘం వ‌డ‌బోత‌ను వేగ‌వంతం చేసింది. ప్ర‌ధానంగా రెండు అంశాల‌ను ప్ర‌మాణికంగా తీసుకొని 52 ల‌క్ష‌ల ఓట‌ర్ల‌ను తొల‌గించింది. చ‌నిపోయిన‌, ఇత‌ర నియోజ‌క వ‌ర్గాల‌కు వ‌ల‌స వెళ్లిన వాళ్ల పేర్ల‌ను మాత్ర‌మే జాబితా నుంచి త‌ప్పించామ‌ని సీఈసీ వెల్ల‌డించింది. ర‌ద్దు చేసిన‌ 52 ల‌క్ష‌ల మంది ఓట‌ర్ల‌లో 18 ల‌క్ష‌ల మంది చ‌నిపోయిన‌వాళ్లు కాగా.. 26 ల‌క్ష‌ల మంది ఇత‌ర నియ‌జ‌క‌వ‌ర్గాల‌కు వ‌ల‌స వెళ్లిన […]

యూపీఐ పేమెంట్లకు కర్ణాటక చిన్న వ్యాపారుల గుడ్ బై

కర్ణాటకలో చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులు యూపీఐ (UPI) చెల్లింపులను అంగీకరించడం మానేశారు. నగదు లావాదేవీలకు తిరిగి మారుతున్నారు. దీనికి కారణం కర్ణాటక వాణిజ్య పన్నుల శాఖ జీఎస్టీ నోటీసులు పంపుతూండటమే. లక్షల రూపాయల పన్ను బకాయిలుఉన్నాయని కట్టాలని ఈ నోటీసులు జారీ చేస్తున్నారు. బెంగళూరు, మైసూరు, తర ప్రాంతాలలో చాలా మంది వ్యాపారులు యూపీఐ క్యూఆర్ కోడ్‌లను తొలగించారు. నగదు మాత్రమే అని బోర్డులు ఏర్పాటు చేశారు.

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం

2022లో కాకినాడలో దళిత డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్యకు గురయ్యాడు. ఈ హత్యలో వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ అనంత బాబు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. సుబ్రహ్మణ్యం శవాన్ని అతని ఇంటి వద్ద “డోర్ డెలివరీ” చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎస్సీ, ఎస్టీ కోర్టు ఈ కేసు పునర్విచారణకు అనుమతి ఇచ్చింది. ఈ కేసును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) ద్వారా తదుపరి విచారణ కొనసాగించేందుకు అవకాశం కల్పించింది. ఈ విచారణలో గత వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో […]

ఏపీలో జిల్లాల సరిహద్దులు, పేర్లు మారనున్నాయ్ .. మంత్రుల కమిటీ ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు, గ్రామాల పేర్లు, సరిహద్దుల్లో మార్పులు, చేర్పులు చేయడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందుకోసం ఏడుగురు మంత్రులతో ఒక కేబినెట్ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ నిర్ణయం స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధుల అభ్యర్థనల నేపథ్యంలో తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. ప్రజల అభిప్రాయాలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని సమగ్రంగా అధ్యయనం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఎయిర్ ఇండియా విమానంలో చెలరేగిన మంటలు..

దేశ రాజధాని ఢిల్లీలో మరో విమాన ప్రమాదం ప్రయాణికుల్ని బెంబెలెత్తేలా చేసింది. విమానం ల్యాండింగ్ అయిన తర్వాత ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. హాంకాంగ్ నుండి ఢిల్లీకి వచ్చిన విమానం AI 315 ల్యాండ్ అయిన కొద్దిసేపటికే ఆక్సిలరీ పవర్ యూనిట్ (APU)లో మంటలు వ్యాపించాయి. అప్పటికే ప్రయాణికులు దిగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మంటలకు విమానం బాగా కాలిపోయింది. భారీగా నష్టంవాటిల్లింది. మరోవైపు.. ప్రయాణీకులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నారని ఎయిర్ ఇండియా ప్రకటించింది.

ఏపీలో జైలర్‌తో పాటు మరో నలుగురు సస్పెన్సన్‌

కడప జిల్లా జైలులో ఎర్రచంద్రనం స్మగ్లర్లకు సెల్‌ఫోన్ల అందజేసిన కేసులో ఐదుగురు జైలు అధికారులు, సిబ్బంది సస్పెన్షన్‌కు గురయ్యారు. సెల్‌ఫోన్ల ఆరోపణలపై ఫిర్యాదులు రావడంతో డీఐజీ రవికిరణ్‌ కడపై జైల్లో నాలుగురోజుల పాటు విచారణ జరిపి ఉన్నతాధికారులకు ప్రాథమిక నివేదికను అందజేశారు. ఈ నివేదిక ప్రకారం జైలర్‌ అప్పారావు, డిప్యూటీ సూరింటెండెంట్‌ కమలాకర్‌తో పాటు మరో ముగ్గురు జైలు వార్డర్లను సస్పెన్షన్‌ చేస్తూ జైళ్లశాఖ డీజీ ఉత్తర్వులు జారీ చేశారు.

హ్యాకర్ల దెబ్బకు కంపెనీయే మూతపడింది

యూకేలోని కేఎన్పీ లాజిస్టిక్స్ అనే కంపెనీ గత 158 ఏళ్ల నుంచి రవాణారంగంలో వ్యాపారం చేస్తోంది. ఈ సంస్థకు దాదాపు 500 లారీలు ఉన్నాయి. ఆకిర గ్యాంగ్ హ్యాకర్త రాన్సమ్వర్ సైబర్ అటాక్కు గురైంది. ఈ ముఠా కేఎన్పీ సిస్టమ్స్ లోని అనధికారికంగా ప్రవేశించింది. మళ్లీ తిరిగి డేటాను పొందాలంటే 58కోట్లు డిమాండ్ చేసింది. కేఎన్పీ అంత సొమ్ము చెల్లించలేని స్థితిలో చివరికీ కంపెనీ పూర్తిగా మూతబడింది. దీంతో ఈ కంపెనీ 700 మంది ఉద్యోగులు రోడ్డున […]

రోజా ఆడదో.. మగదో కూడా తెలియదు.. జనసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి గురించి ప్రజలే చెప్పాలని అన్నారు. ఎమ్మెల్యే నా కొడుకులు అని రోజా అంటున్నారని.. అసలు అది ఆడదో.. మగదో తెలియదని బొలిశెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది కాపులను ఉసిగొల్పి ఇష్టమొచ్చినట్లు మాట్లాడిస్తున్నారని బొలిశెట్టి అన్నారు. అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి పనికిమాలినోళ్లంతా బయటకొచ్చి.. దమ్ముంటే అరెస్టు చేసుకోమని అంటున్నారని విమర్శించారు.

ఆడబిడ్డకు నెలకు 1500 ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మాలి: నోరు జారిన అచ్చెన్నాయుడు

రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పథకాలు అన్నీ అమలు చేశామని.. ఇంకా ఒక్కటే మిగిలి ఉందన్నారు. ఆడబిడ్డ కు నెలకు 1500 ఇచ్చే పథకం అమలు చేయాల్సి ఉందన్నారు. ఈ పథకం అమలు చేయాలంటే ఏపీ ను అమ్మాలని వ్యాఖ్యానించారు. అయినా కూడా చంద్రబాబు గారు ఈ పథకం అమలుపై ఆలోచన చేస్తున్నారన్నారు. సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో అచ్చెన్నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. దీంతో వైసీపీ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON