loader

తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్లే ఇండిగో విమానంలో సాంకేతిక లోపం

తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.విమానం టెకాఫ్ అయిన వెంటనే పైలట్లు ప్రాబ్లమ్ గుర్తించారు.సుమారు 45 నిమిషాల పాటు ఫ్లైట్ గాలిలోనే చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత తిరిగి తిరుపతి ఎయిర్ పోర్టులోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది.ఈ సమయంలో విమానంలో 180 మంది ప్రయాణికులు ఉన్నారు. టెక్నికల్ ప్రాబ్లమ్ తలెత్తడంతో వారంతా భయాందోళన చెందారు.

బీహార్‌లో ఎన్నిక‌ల ఓట‌ర్ల స‌వ‌ర‌ణ‌పై తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు : కేటీఆర్

బీహార్‌లో జరుగుతున్న ఎన్నికల ఓటర్ల సవరణ ఇది మొదటిసారి కాదు. అయితే ఈసారి మాత్రం తీవ్రమైన విమర్శలు వినిపిస్తున్నాయని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. భారత ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది? అని ప్ర‌శ్నించారు. బీహార్‌లో జరుగుతున్న పరిణామాల పట్ల మాకు చాలా అభ్యంతరాలు ఉన్నాయి. దేశంలోని మిగతా రాష్ట్రాలపై దీని ప్రభావం ఉంటుందని కేటీఆర్ పేర్కొన్నారు.

హీరో అజిత్ కారుకు ప్రమాదం

ఇటలీలోని మిసానోలో జరుగుతున్న GT4 యూరోపియన్ సిరీస్‌లో పాల్గొంటున్న సమయంలో, రేస్ 2లో అజిత్ కారుకు ప్రమాదం జరిగింది. రేసింగ్ ట్రాక్ మధ్యలో ఆగి ఉన్న ఓ వాహనాన్ని అజిత్ డ్రైవ్ చేస్తున్న కారు ఢీకొంది. ఈ సంఘటనలో అతనికి ఎలాంటి గాయాలు కాకపోవడం ఒక ఊరట కలిగించిన విషయం. ప్రమాదం తర్వాత జాగ్రత్తగా వ్యవహరించిన అజిత్‌ ఎలాంటి ఉద్వేగం చూపకుండా రేసింగ్ నుంచి వైదొలిగారు. ప్రొఫెషనల్ వైఖరిని చూపించిన ఆయనపై రేసింగ్ కమ్యూనిటీ హర్షం వ్యక్తం […]

మిథున్ రెడ్డి అరెస్ట్‌పై YS జగన్ రియాక్షన్..

ఏపీ లిక్కర్ స్కాం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్‌ని తీవ్రంగా ఖండించారు ఆపార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్. రాజకీయ కుట్రతోనే ప్రజల పక్షాన నిలబడే వారి నోరు మూయించడానికి చేసిన అక్రమ అరెస్ట్‌గా భావిస్తున్నానని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఇది కేవలం టీడీపీ ప్రభుత్వం తమ మోసాలు, వైఫల్యాలను కప్పిపుచ్చడానికి చేసిన రాజకీయ ప్రతీకారచర్యగా చూస్తున్నామని సోషల్ మీడియా వేదికగా మిథున్ రెడ్డికి తన మద్దతు తెలిపారు వైఎస్ జగన్

కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..పాతబస్తీలోని గల్లీ గల్లీకి ఆలయాలు నిర్మిస్తాం

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్.. ప్రముఖ లాల్ దర్వాజ సింహవాహిని మహాకాళి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే పాతబస్తీలోని గల్లీ గల్లీకి ఆలయాలు నిర్మిస్తామని సంచలన ప్రకటన చేశారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం అందరూ కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో హిందువుల పండుగలు వచ్చినప్పుడు కూడా ఆలయాలకు నిధులు అడుక్కోవాల్సిన పరిస్థితి ఉందని బండి సంజయ్ అసహనం వ్యక్తం […]

కేజిన్నర పులస వేలంలో రికార్డ్ బ్రేక్

మరో జాలరికి లక్ తగిలింది. అతని వలలో అచ్చమైన పులస పడింది. యానాం ప్రాంతానికి చెందిన మత్స్యకారుడు మల్లాడి ప్రసాద్ మాత్రం ఏటా ఒకసారి లక్కీగా మారిపోతున్నాడు! ఈసారి కూడా ఆయన వలలో పడిన చేప వేలంలో భారీ రేటు పలికింది. శనివారం యానాం రాజీవ్ బీచ్ వద్ద నిర్వహించిన చేపల వేలంలో.. కేజీన్నర బరువున్న పులస చేప ఏకంగా రూ.22 వేలకు అమ్ముడైంది. పొన్నమండ రత్నం అనే మహిళ ఈ చేపను వేలంలో కొనుగోలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్.. మిథున్‌ రెడ్డికి రిమాండ్

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో వైసిపి ఎపి మిథున్ రెడ్డికి విజయవాడ ఎసిబి కోర్టు రిమాండ్ విధించింది. ఆగస్టు 1 వరకూ రిమాండ్ విధిస్తూ.. ఆదేశాలు జారీ చేసింది. దీంతో మిథున్ రెడ్డిని పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు. ఎపి లిక్కర్ స్కామ్‌లో ఎ4గా ఉన్న మిథున్ రెడ్డిని శనివారం సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదివారం ఉదయం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి.. విజయవాడ ఎసిబి కోర్టు ఎదుట హాజరుపరిచారు.

తెలంగాణలో రానున్న 4 రోజులు భారీ వర్షాలు… రేపు ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్…

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో రానున్న నాలుగు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం (జూలై 21) రోజున ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, కామారెడ్డి, మెదక్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లలకు ఎల్లో అలర్ట్ జారీ […]

రీల్స్ చూసి, చూసి వేళ్లు నొప్పులు పెడుతున్నాయా.? ఆటో స్క్రోల్ ఫీచ‌ర్ వ‌చ్చేస్తోంది

ఇన్‌స్టాగ్రామ్ విజ‌య‌వంతంలో రీల్స్ ఒక కార‌ణ‌మ‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఒక రీల్ పూర్తికాగానే మ‌రో రీల్ చూడాలంటే స్క్రీన్‌పై స్క్రోల్ చేయాల‌నే విష‌యం తెలిసిందే. ఆటో స్క్రోల్ పేరుతో తీసుకొస్తున్న ఈ ఫీచ‌ర్ స‌హాయంతో ఇక‌పై స్క్రోల్ చేయాల్సిన అవస‌రం ఉండ‌దు. ఒక వీడియో పూర్తవగానే దానంత‌ట‌దే తదుపరి వీడియోకి జంప్ అవుతుంది. ఇన్‌స్టాగ్రామ్ ఈ ఫీచర్‌ను ఇప్పుడు కొంత‌మంది ఎంపిక చేసిన యూజర్లతో ప‌రీక్షిస్తోంది. ఆటో స్క్రోల్ వ‌ల్ల డిజిటల్ అడిక్షన్ పెరిగే ప్రమాదం […]

టైగర్ జోన్‌లో మళ్లీ ఉద్రిక్తతలు!

ఆదిలాబాద్ జిల్లా కేశవపట్నంలో అటవిశాఖపై పోడు రైతులు తిరగబడ్డారు. పోడు వ్యవసాయం చేస్తున్న భూముల్లో అటవిశాఖ అధికారులు మొక్కలు నాటేందుకు ప్రయత్నించడంతో ముల్తానీ పోడు రైతులు దాడులకు దిగారు. మా భూములను లాక్కొని మొక్కలు నాటుతామంటే ఊరుకునేది లేదంటూ ముల్తానీ పోడు రైతులు రాళ్లు, కర్రలతో అటవిశాఖ అదికారులు, సిబ్బందిపై దాడికి దిగారు. అడ్డొచ్చిన పోలీస్ సిబ్బంది పై సైతం దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 11 మందికి గాయాలవగా.. అటవిశాఖ, పోలీస్ శాఖకు చెందిన ప్రభుత్వ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON