loader

కేసీఆర్ ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు.. సీఎం రేవంత్ రెడ్డి

సాగునీటి ప్రాజెక్టులపై చట్టసభల్లో చర్చిద్దామని తాను సూచన చేశానని, క్లబ్బుల్లో, పబ్బుల్లో కాకుండా చట్టసభల్లో చర్చించుకుందామని కోరినప్పటికీ, కేసీఆర్ సడన్ గా వచ్చి ఏదేదో మాట్లాడారని సీఎం అన్నారు. అధికారం కోల్పోయి, డిపాజిట్లు కూడా కోల్పోయి, అభ్యర్థులు దొరకక ఫ్రస్ట్రేషన్‌లో ఉన్న కొందరు విచిత్రమైన వాదనలు చేస్తున్నారని, ఏడాదిలోనే సర్వం నాశనమైందని.. మళ్లీ వాళ్లు వస్తేనే బాగుపడుతుందన్నట్టు వితండవాదన తీసుకొస్తున్నారని ఆయన పరోక్షంగా కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు.

ఎన్నికలకు ముందు బీహార్‌లో ఓటర్ లిస్ట్ గోల్ మాల్ వివాదం

బీహార్‌లో రాజకీయ పార్టీలన్నీ ఇప్పుడు ఓటర్ లిస్ట్ వివాదంపైనే మాట్లాడుతున్నాయి. స్వయంగా రాహుల్ గాంధీ కూడా నిరసనల్లో పాల్గొన్నారు. దీనికి కారణం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ECI) చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. కొత్త ఓటర్ల సవరణ ద్వారా దళితులు, మహాదళితులు, ముస్లింలు, వలస కార్మికులు, పేదల ఓటు హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఈ ప్రక్రియ చేపట్టడంపై అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.

సిలికాన్ వ్యాలీలో మరో ఇండియన్ జెండా

ప్రపంచ దిగ్గజ టెక్ సంస్థ యాపిల్ చీఫ్ ఆఫరేటింగ్ ఆఫీసర్‌గా సబీ ఖాన్ నియమితులయ్యారు. ఆయన ఈ నెలాఖరులో ఈ పదవిని స్వీకరిస్తారు.జెఫ్ విలియమ్స్ స్థానంలో బాధ్యతలు స్వీకరిస్తారు. సబీఖాన్ భారత సంతతి వ్యక్తి. సబీ ఖాన్ 1966లో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో జన్మించారు. ఆయన ఐదో తరగతిలో ఉన్నప్పుడు ఆయన కుటుంబం సింగపూర్‌కు వలస వెళ్లింది, ఆ తర్వాత వారు యునైటెడ్ స్టేట్స్‌లో స్థిరపడ్డారు

రూ.4 వేల విలువైన సైకిల్ ఉచితం

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ 10వ తరగతి చదివే విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లను అందించారు. కొన్ని కార్పొరేట్ సంస్థల కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ద్వారా ఈ సైకిళ్లను కొనుగోలు చేశారు. ఈ సైకిళ్ల పంపిణీ ప్రారంభ కార్యక్రమానికి కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం వేదిక అయినది. తొలుత కరీంనగర్ టౌన్‌లో టెన్త్ చదువుతున్న విద్యార్థినులకు బండి సంజయ్ ఈరోజు తన చేతుల మీదుగా సైకిళ్లను అందజేశారు.

IPL టికెట్ స్కామ్: HCA అధ్యక్షుడు అరెస్ట్!

సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) మధ్య నెలకొన్న టిక్కెట్ల వివాదం, బెదిరింపుల ఆరోపణల నేపథ్యంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు ఏ. జగన్మోహన్ రావును CID అధికారులు అరెస్ట్ చేశారు. ఐపీఎల్ మ్యాచ్‌లకు సంబంధించిన కాంప్లిమెంటరీ టిక్కెట్లు, పాస్‌ల కేటాయింపులో జరిగిన అక్రమాలు, బ్లాక్‌మెయిలింగ్‌పై ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై తెలంగాణ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అమరావతిలో క్వాంటం వ్యాలీ

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ బుధవారం జరిగిన సమావేశంలో పలు కీలక అభివృద్ధి నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఆధునిక సాంకేతికత దిశగా పెద్ద అడుగులుగా భావిస్తున్న అమరావతి నగరంలో ‘క్వాంటం కంప్యూటింగ్ సెంటర్’ స్థాపనకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైద్యరంగంలో రాష్ట్రానికి ముందంజ వేయించేందుకు నక్కపల్లిలో ఏర్పాటు చేసిన బల్క్ డ్రగ్ పార్క్‌కు అదనంగా 790 ఎకరాల భూమిను సమీకరించేందుకు క్యాబినెట్ ఆమోదించింది.

నమీబియాలో అడుగుపెట్టిన మోడీ..

ప్రధాని మోడీ విదేశీ పర్యటన కొనసాగుతోంది. 8 రోజుల పాటు ఐదు దేశాల టూర్‌కు వెళ్లిన మోడీ ఇప్పటికే నాలుగు దేశాల్లో పర్యటించారు. ప్రస్తుతం చివరి దేశమైన నమీబియాలో పర్యటిస్తున్నారు. నమీబియాలో ఆయనకు గ్రాండ్ వెల్‌కమ్ లభించింది. ఆ దేశ ప్రెసిడెంట్ నెటుంబో నంది స్వయంగా ఎయిర్ పోర్టుకు వెళ్లి మోడీని రిసీవ్ చేసుకున్నారు. 21 గన్స్‌తో కూడిన గౌరవ వందనాన్ని మోడీ అందుకున్నారు.

రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా మారింది?: జగన్

ఆర్‌బీకేలు రైతుల బాగుకోసం పని చేశాయని అన్నారు. వాటిని నిర్వీర్యం చేసిన చంద్రబాబు రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. రైతుల సమస్యలపై మాట్లాడితే ప్రభుత్వానికి భయమెందుకని ప్రశ్నించారు. ఏ పంటకీ గిట్టుబాటు ధరలేకుండా పోయిందని వాపోయారు. కర్ణాటకలో కేంద్రమే కేజీ మామిడి రూ.16 కొనుగోలు చేస్తుంటే చంద్రబాబు ఇక్కడ గాడిదలు కాస్తున్నారా? రాష్ట్రంలో కిలో మామిడికి కనీసం 12 రూపాయలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు.” అని అన్నారు.

గాడ్సే శిబిరం మార్గంలో ఎప్పుడూ వెళ్లవద్దు : స్టాలిన్

విభజన సిద్ధాంతాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బుధవారం విద్యార్థులకు పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పెరియార్ వంటి నాయకులు చూపిన సమ్మిళిత, సంస్కరణవాద మార్గాలు అనుసరించాలని సూచించారు. తిరుచిరాపల్లిలోని జమాల్ మొహమ్మద్ కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న స్టాలిన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. యువతలో రాజకీయ అవగాహన, ఐక్యత ప్రాముఖ్యతను స్టాలిన్ నొక్కి చెప్పారు.’గాడ్సే శిబిరం మార్గంలో ఎప్పుడూ వెళ్లవద్దు

ఉధృతంగా ప్రవహిస్తున్న నది, తల్లి ప్రేమ అంటే ఇదే.

పరుగురాతిపాలెం గ్రామానికి చెందిన చిన్నారికి తీవ్రజ్వరం రావడంతో పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్లే ప్రయత్నంలో తల్లి లారీకి సంబంధించిన టైర్ ట్యూబుతో ప్రాణాలకు తెగించి దాటించింది. దేవుడు ఆశీస్సులు ఏమోగానీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అంత ఫ్లోటింగ్ లో కూడా దాదాపు మునిగిపోయినప్పటికీ ఒడ్డుకు చేరుకుంది. తూర్పు ఏజెన్సీ అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం పత్రిపాలెం, పింజరకొండ వంటి ప్రాంతాల మధ్యలో పెద్దవాగు అత్యధికంగా నీరు ఉన్నా లేకపోయినా ఈ వాగు దాటితే తప్ప గత్యంతరం లేని పరిస్థితులు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON