loader

యూరియా కోటాను పెంచండి.. నడ్డాకు సిఎం రేవంత్ వినతి

దేశీయంగా ఉత్పత్తి అయిన యూరియా కోటాను పెంచండి.. రాష్ట్రానికి కేటాయించిన యూరియాను సకాలంలో సరఫరా చేయండి కేంద్ర మంత్రి నడ్డాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి మనతెలంగాణ/హైదరాబాద్ రాష్ట్ర అవసరాలకు కేటాయించిన యూరియాను సకాలంలో సరఫరా చేయాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జెపి నడ్డాకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్రమంత్రిని ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం కలిశారు.

టీటీడీ ఏఈఓ రాజశేఖర్ బాబు సస్పెన్షన్

టీటీడీలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏ.రాజశేఖర్ బాబు పుత్తూరులోని స్వగ్రామంలో ప్రతీ ఆదివారం స్థానిక చర్చి ప్రార్థనల్లో పాల్గొంటున్నారని సమాచారం . హిందూ ధార్మిక సంస్థకు ప్రాతినిధ్యం వహించే ఉద్యోగి అయివుండి భాద్యతారహితంగా వ్యవహరించడం జరిగింది. మరోవైపు టీటీడీ విజిలెన్స్ విచారణలోనూ ఏఈవో రాజశేఖర్ బాబు చర్చికి వెళ్తున్నట్లు నిర్ధారించడంతో ఆయనపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించడంతోపాటు సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది అని టీటీడీ తెలిపింది.

ఆ భూములను కబ్జా చేస్తే పిడి యాక్టు పెడతాం: మంత్రి కొండా

దేవుడి భూములు రక్షించే దేవాదాయ శాఖ అధికారులపై దాడులు చేస్తే ఊరుకోమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. మంగళవారం భద్రాచలం ఈఓ రమాదేవిపై జరిగిన దాడిని మంత్రి కొండా సురేఖ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా దేవాదాయ శాఖ భూములను కబ్జా చేస్తే పిడి యాక్టు పెడతామని మంత్రి కొండా హెచ్చరించారు.  రామాలయ భూములు పురుషోత్తపట్నం (ఎపి)లో కబ్జాకు గురవుతుండడాన్ని అడ్డుకున్న ఈ రమాదేవిపై దాడి చేయడం సహేతుకం కాదని […]

డీకేను సీఎం చేయాల్సిందే.. కర్ణాటకలో మళ్లీ రచ్చ రచ్చ

కన్నడనాట రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. పైకి అంతా బాగానే ఉన్నట్లు నటిస్తున్నా.. సీఎం వర్సెస్ డిప్యూటీ సీఎంగా పరిస్థితి సాగతుంది. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు డీకే శివకుమార్ సీఎం కావాలని అంటున్నారు. మెజార్టీ ఎమ్మెల్యేలు ఆయనకే మద్ధతుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అటు డీకే.. నాయకత్వం మార్పు ఏమి ఉండదని తొలుత వ్యాఖ్యానించి.. తాజాగా సీఎం కావాలనే ఆశ ఎవరికి ఉండదని వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.

కొట్టుకుపోయిన మైత్రి వంతెన.. 18 మంది గల్లంతు

రుతుపవనాల కారణంగా కురుస్తున్న భారీ వర్షాలతో నేపాల్‌లో వరదలు బీభత్సం సృష్టించాయి. నేపాల్ చైనా మధ్య ఉన్న మైత్రి వంతెన భోటేకోషి నది వరదలో కొట్టుకుపోయింది. ఈ వరదల కారణంగా 12 మంది నేపాలీలు, 6 మంది చైనా పౌరులు గల్లంతయ్యారు. ఖాట్మండు నుండి 120 కి.మీ దూరంలో ఉన్న ఈ వంతెన కూలిపోవడంతో సరిహద్దులో ట్రాఫిక్ దెబ్బతింది. తప్పిపోయిన వారి కోసం ముమ్మర గాలింపు కొనసాగుతోంది.

మా అనుభవం ముందు కేటీఆర్ ఒక జీరో: జగ్గారెడ్డి

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తమ సుదీర్ఘ రాజకీయ అనుభవం ముందు కేటీఆర్ ఒక జీరో అని, ఆయన ఒక చిన్న పిల్లాడిలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చర్చకు పిలిచే స్థాయి కేటీఆర్‌కు లేదని అన్నారు. మేమంతా ఎన్నో వ్యయప్రయాసలకోర్చి క్షేత్రస్థాయి నుంచి నాయకులుగా ఎదిగాం. కేటీఆర్ తన తండ్రి సీటిస్తే నేరుగా ఎమ్మెల్యే అయ్యారు. ఆయనెప్పుడైనా సర్పంచ్‌గా గెలిచారా? జడ్పీటీసీగా గెలిచారా? […]

దేవుడి భూమల కబ్జాకు యత్నం- అడ్డుకున్న ఈవోపై దాడి

భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమాదేవి పై పురుషోత్తపట్నంలో దాడి జరిగింది. ఆలయానికి చెందిన 889.5 ఎకరాల భూములను ఆక్రమణ నుండి కాపాడేందుకు రమాదేవి ఆలయ సిబ్బందితో కలిసి వెళ్లిన సమయంలో జరిగింది. ఆలయ భూముల్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను, ఆక్రమణలను తొలగించేందుకు ప్రయత్నించారు. ఆక్రమణదారులు వారితో వాగ్వాదానికి దిగారు. ఈ వాగ్వాదం తీవ్రమై, ఆక్రమణదారులు రమాదేవిపై దాడికి పాల్పడ్డారు.

సిగాచీ యాజమాన్యంపై ఎన్‌డిఎంఎ బృందం ఆగ్రహం

పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఆ పరిశ్రమని నేషనల్ డిజాస్టర్ మేనేజ‌్‌మెంట్ అథారిటీ(ఎన్‌డిఎంఎ) బృందం పరిశీలిచింది. అనంతరం నిర్వహణ లోపాలపై సిగాచీ యాజమాన్యంపై ఎన్‌డిఎంఎ ప్రశ్నల వర్షం కురిపించింది. యాజమాన్యం సరిగ్గా సమాధానం ఇవ్వకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సంస్థ అధికారుల స్పందనపై బృందం అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రమాదానికి యాజమాన్య నిర్లక్ష్యమే కారణమని ప్రాథమికంగా అంచనా వేసింది. సిగాచీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో ఇప్పటివరకూ 44 మంది ప్రాణాలు […]

అద్భుత ప్రతిభతో అదరగొట్టిన నల్గొండ నేతన్నలు

కేంద్రం ప్రతిఏటా అందించే జాతీయ చేనేత అవార్డులు యాదాద్రి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలం పుట్టపాకకు చెందిన ఇద్దరు చేనేత కార్మికులను వరించాయి. యంగ్ వీవర్ విభాగంలో గూడ పవన్ కుమార్, మార్కెటింగ్ విభాగంలో గజం నర్మదా నరేందర్‌లు ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా 19 మంది ఎంపికవ్వగా.. రాష్ట్రం నుంచి ఇద్దరికి పురస్కారాలు దక్కడం విశేషం. వీరికి ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పురస్కారాలు ప్రదానం చేయనున్నారు.

అగ్నిమాపక శాఖలో వయస్సు మళ్లిన ఫైరింజన్లు

ఆంధ్రప్రదేశ్‌ అగ్నిమాపక శాఖ పరిస్థితి అట్టడుగు స్థాయికి దిగజారిందనడానికి తాజా ఉదంతమే నిదర్శనం. రాష్ట్రంలోని చాలా ఫైరింజన్లు వయస్సు మళ్లిన వాహనాలే. ఇప్పటి వరకు ఉన్న 230 ఫైరింజన్లలో 60 శాతానికి పైగా పాతవే. రవాణా శాఖ సూచనల మేరకు వాటికి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇవ్వడం నిలిపేశారు. కేంద్రం రూ.58 కోట్లు విడుదల చేయగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.17 కోట్లు చెల్లించింది. మొత్తం రూ.75 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. కానీ ఇప్పటికీ టెండర్ల ప్రక్రియ ప్రారంభించలేదు. […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON