loader

ప్రశాంతంగా బిబికా ఆలం ఊరేగింపు

మొహర్రం సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన ఊరేగింపులు ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఊరేగింపు సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. బీబీ కా ఆలం భారీ ఊరేగింపు దబీర్‌పురా(దారుల్ షిఫా)లోని ఆషుర్‌ఖానా నుండి ప్రారంభమైంది. కర్ణాటక రాష్ట్రం నుండి తీసుకువచ్చిన లక్ష్మి ఏనుగుపై ‘ఆలం‘ను ఉంచి ఈ యాత్ర కొనసాగింది. అనంతరం ఊరేగింపు మూసీ నది ఒడ్డున ఉన్న మసీద్ -ఎ- ఇలాహీ, చాదర్‌ఘాట్ వద్ద ముగిసింది.

ఐక్యరాజ్యసమితి, WTOలో సంస్కరణలు రావాలి: ప్రధాని మోదీ

బ్రిక్స్ సమ్మిట్‌లో శాంతి, భద్రత, గ్లోబల్ గవర్నెన్స్ సంస్కరణలపై ప్లీనరీ సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గ్లోబల్ సౌత్ ఎదుర్కొంటున్న నిర్లక్ష్యాన్ని హైలైట్ చేశారు. “గ్లోబల్ సౌత్ తరచుగా డబుల్ స్టాండర్డ్స్ కు గురైంది. అభివృద్ధి, వనరుల పంపిణీ లేదా భద్రత సంబంధిత సమస్యల గురించి గ్లోబల్ సౌత్ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. వాతావరణ ఆర్థిక సహాయం, స్థిరమైన అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం వంటి సమస్యలపై, గ్లోబల్ సౌత్ తరచుగా కేవలం […]

ఇంగ్లండ్‌పై టీమిండియా చరిత్రాత్మక విజయం

బర్మింగ్‌హమ్‌లో భారత జట్టు చరిత్ర సృష్టించింది. బజ్ బాల్ ఆటతో ప్రత్యర్థుల భరతం పట్టే ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(269, 161) విధ్వంసక బ్యాటింగ్‌కు..ఆకాశ్ దీప్(6-99), సిరాజ్() అద్భత బౌలింగ్ తోడవ్వగా చరిత్రలో నిలిపోయే విక్టరీ సాధించింది. ఆల్‌రౌండ్ షోతో ఆతథ్య జట్టును వణికించిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో స్టోక్స్ బృందంపై 366 పరుగులతో చిరస్మరణీయ విజయం సాధించింది. ఐదు టెస్టుల అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో బోణీ కొట్టింది.

మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్..

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ ప్రపంచ కప్‌కు ఇంగ్లాండ్ ఆతిథ్యం ఇవ్వనుంది. జూన్ 12 నుండి జూలై 5 వరకు ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ఈ టోర్నమెంట్‌లో మొత్తం 12 జట్లు పాల్గొంటాయి,33 మ్యాచ్‌లు జరుగుతాయి. టోర్నమెంట్‌లో మొదటి మ్యాచ్ జూన్ 12న ఆతిథ్య ఇంగ్లాండ్, శ్రీలంక మధ్య జరుగుతుంది. ఇక భారత జట్టు తమ మొదటి మ్యాచ్‌ను జూన్ 14న పాకిస్తాన్ తో […]

ఆ బోర్డును ఏపీకి తరలించండి.. కేంద్రానికి చంద్రబాబు లేఖ

తెలంగాణలోని హైదరాబాద్‌లో ఉన్న జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు (NFDB) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలించాలని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్‌రంజన్ సింగ్‌కు చంద్రబాబు లేఖ రాశారు. దేశ ఆక్వారంగానికి ఆంధ్రప్రదేశ్ నాయకత్వం వహిస్తోందని.. ఏపీలో సుదీర్ఘ తీరప్రాంతం ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ఏపీలోని 16.50 లక్షల మంది ఉపాధి పొందుతున్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. భారతదేశ సముద్ర ఉత్పత్తుల ఎగుమతులలో ఏపీ వాటా 32 శాతంగా ఉందని…దీని విలువ రూ.19,420 కోట్లుగా వివరించారు.

హాయిగా రాత్రంతా నిద్రపోయిన UPSC అభ్యర్ధి.. అంతే రూ.9 లక్షలు వచ్చిపడ్డాయి!

బెంగళూరులో జరిగిన 60 రోజుల స్లీప్ ఇంటర్న్‌షిప్‌లో భాగంగా పూణేకు చెందిన యూపీఎస్సీ ఐపీఎస్ అభ్యర్థి పూజా మాధవ్ వావల్ ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రతి రాత్రి సగటున తొమ్మిది గంటలు నిద్రపోయిన 14 మంది ఫైనలిస్టులను అధిగమించి అగ్రస్థానాన్ని అధిరోహించింది. దీంతో రూ. 9.1 లక్షల నగదు బహుమతితోపాటు ‘స్లీప్ ఛాంపియన్ ఆఫ్ ది ఇయర్’ టైటిల్ కూడా గెలుచుకుంది. స్లీప్ ఇంటర్న్‌షిప్ దేశంలో పెరుగుతున్న నిద్ర లేమిపై అవగాహన పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది.

విజయానికి చేరువలో భారత్.. కష్టాల్లో ఇంగ్లండ్

ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీం ఇండియా విజయానికి మరింత చేరువైంది. ఐదు రోజు వర్షం కారణంగా ఆట కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. ఆకాశ్‌దీప్ 80 పరుగుల జట్టు స్కోర్ వద్ద పోప్(24)ని, బ్రూక్(23)ని ఎల్‌బిడబ్ల్యూ రూపంలో పెవిలియన్ చేర్చాడు. లంచ్‌ బ్రేక్ సమయానికి 40.3 ఓవర్లలో ఇంగ్లండ్ 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో విజయానికి ఇంగ్లండ్‌కు ఇంకా 455 పరుగులు అవసరం […]

వైఎస్ జగన్ చిత్తూరు పర్యటనలో హెలిప్యాడ్‌కు పోలీసుల అనుమతి

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్తూరు పర్యటనలో హెలిప్యాడ్‌కు పోలీసులు అనుమతి ఇచ్చారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలి వెంకటగిరి సమీపంలో తగ్గువారిపల్లి దగ్గర వైసీపీ అధినేత జగన్ హెలిప్యాడ్‌కు పోలీసులు నుంచి అనుమతి లభించింది. ఇటీవల ఆయన నెల్లూరు పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కానీ హెలిప్యాడ్ కు అనుమతి రానందున జగన్ తన పర్యటనను వాయిదా వేసుకున్నారు.ైఎస్ జగన్ జులై 9న చిత్తూరు జిల్లా బంగారుపాళెంలో పర్యటించనున్నారు.

ఐఎస్ఎస్‌ ఐకానిక్ ప్రదేశంలోకి శుభాన్షు శుక్లా

భారత వైమానిక దళ గ్రూప్ కెప్టెన్, వింగ్ కమాండర్ శుభాన్షు శుక్లా.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) లోని ప్రసిద్ధ కుపోలా విండోలోకి ప్రవేశించారు. అందులో నుంచి బయటకు చూస్తూ శుక్లా చిరునవ్వుతో మెరిసిపోతూ కనిపిస్తున్నాడు. ప్రస్తుతం 14 రోజుల అంతరిక్ష యాత్ర చివరి దశలో శాస్త్రీయ ప్రయోగాల్లో శుక్లా నిమగ్నమయ్యారు. రాకేశ్ శర్మ తర్వాత రోదసీలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా.. ఐఎస్ఎస్‌లో ప్రవేశించిన మొదటి ఇండియన్‌గా శుక్లా చరిత్ర సృష్టించారు.

లోకేష్‌తో కేటీఆర్ సీక్రెట్ మీటింగ్… ఎందుకోసం

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్ర వాటాను పక్క రాష్ట్రాలకు దోచిపెట్టిన తెలంగాణ ద్రోహ్రం చేసిందని ఆరోపించారు. ఏపీ మంత్రి లోకేష్‌తో కేటీఆర్ సీక్రెట మంతనాలు జరుపుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. లోకేష్‌ను కేటీఆర్‌ కలిసింది నిజం కాదా? అని ప్రశ్నించారు. లోకేష్‌ను ఎందుకు కలుస్తున్నారనేది సమాధానం చెప్పాలని కేటీఆర్‌ను డిమాండ్ చేశారు. లోకేష్‌ను కలవలేదని కేటీఆర్ అంటే తాను మళ్లీ స్పందిస్తానని… అబద్దం అని బుకాయిస్తే వివరాలు అన్నీ బయటా పెడతానని రామ్మోహన్ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON