loader

జడ్జిపై ట్రోల్స్‌.. ధర్మాసనంపై ఏపీ హైకోర్టు జడ్జి ఆసక్తికర వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. శ్రీనివాస్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసులో తీర్పు విషయమై సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోల్స్ గురించి ఆయన స్పందించారు. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేస్తున్నారని జస్టిస్ అన్నారు. ‘‘నన్ను గత రెండు రోజులు నుంచి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. సారీ స్టేట్ ఆఫ్ అఫ్ఫైర్స్’ అని ఆయన వ్యాఖ్యానించారు.

హీరోయిన్ల కోసం ఫేక్ కాస్టింగ్ కాల్స్‌.. విశ్వంభర నిర్మాతల కీలక ప్రకటన

UV క్రియేషన్స్‌ పేరుతో గుర్తు తెలియని వ్యక్తి ఒకరు మోసపూరిత ఆఫర్‌లతో నటీమణులను, వారి ప్రతినిధులను సంప్రదిస్తున్నాడని మా దృష్టికి వచ్చింది. యూవీ క్రియేషన్స్‌కు ఆ వ్యక్తితో లేదా వారి కార్యకలాపాలతో ఎటువంటి సంబంధం లేదని మేము స్పష్టం చేయాలనుకుంటున్నాము. మా నుండి ఏదైనా అఫిషియల్ కమ్యూనికేషన్ లేదా కాస్టింగ్ అధికారిక ఛానెల్‌ల ద్వారా మాత్రమే జరుగుతాయి ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, అటువంటి ఆఫర్స్ గురించి నిజా నిజాలు తెలుసుకొని ముందుకు వెళ్ళాలని ఓ […]

జూనియర్​ కాలేజీల్లో 273 పోస్టుల భర్తీ: రేవంత్ రెడ్డి

తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2023 వరకు ఏర్పాటైన 18 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 273 బోధన, బోధనేతర పోస్టుల మంజూరుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పచ్చజెండా ఊపారు. ఇంటర్ విద్యాశాఖ పంపిన ప్రతిపాదనలకు ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. సీఎం తాజాగా పోస్టుల మంజూరు దస్త్రంపై సంతకం చేశారు. త్వరలో దీనిపై జీవో జారీ కానుంది. ఆ తర్వాత టీజీపీఎస్సీ ద్వారా వాటిని భర్తీ చేస్తారు.

బాలాజీ జోడీ ముందంజ.. తొలి రౌండ్‌లోనే బోపన్న నిష్క్రమణ..!

వింబుల్డన్‌లో భారత స్టార్స్ ఆశలు రేకెత్తిస్తున్నారు. పురుషుల డబుల్స్‌లో శ్రీరామ్ బాలాజీ ముందంజ వేశాడు. గురువారం జరిగిన తొలి రౌండ్‌లో శ్రీరామ్- మిగెల్ రెయ్స్(మెక్సికో) ద్వయం అమెరికా జంటను చిత్తు చేసింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన పోరులో లెర్నర్ థియెన్, అలెగ్జాండర్ కొవసెవిక్ ద్వయంపై 6-4, 6-4తో జయకేతనం ఎగురవేసింది. దాంతో, ఈ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో రెండో రౌండ్‌కు దూసుకెళ్లిన మూడో భారత ఆటగాడిగా నిలిచాడు శ్రీరామ్.

యశోద ఆస్పత్రికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

బీఆర్ఎస్ అధినేత, మాజీసీఎం కేసీఆర్ సోమాజిగూడ యశోద ఆస్పత్రికి రావడంతో ఒక్కసారిగా కలకలం రేపింది. ఫాం హౌస్ నుంచి నేరుగా నందినగర్‌లోని ఇంటికి కేసీఆర్ వచ్చారు. నందినగర్‌ నివాసంలో కేసీఆర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే మరిన్ని మెరుగైన వైద్య పరీక్షల నిమిత్తం కేసీఆర్‌ను వైద్యులు సోమాజీగూడ యశోద ఆస్పత్రికి తరలించారు. సోమాజీగూడ యశోద ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రిలో కేసీఆర్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్య పరీక్షల పూర్తి అయిన తర్వాత కేసీఆర్‌ నందినగర్‌లోని నివాసానికి వెళ్లనున్నట్లు […]

స్కూల్‌కు వెళ్లేందుకు.. ప్రవహించే నదిని ప్రమాదకరంగా దాటుతున్న చిన్నారులు

స్కూల్‌కు వెళ్లేందుకు చిన్నారులు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఉధృతంగా ప్రవహించే నదిని ప్రమాదకరంగా దాడుతున్నారు. మహారాష్ట్రలోని పాల్గఢ్‌ జిల్లాలో ఈ దుస్థితి నెలకొన్నది. వాల్డా గ్రామ విద్యార్థులు చదువుల కోసం ఐదు కిలోమీటర్ల దూరం నడిచి స్కూల్‌కు వెళ్లాల్సి ఉంటుంది. అయితే రఖాడీ నదిపై నిర్మించిన ఆనకట్టపై నడిచి వెళ్తే మూడు కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. రఖాడీ నదిపై వంతెన నిర్మించాలన్న గ్రామస్తుల డిమాండ్‌ను పాలకులు చాలాకాలంగా పట్టించుకోవడంలేదు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో […]

కాంట్రాక్ట్ ఉద్యోగులకు టీటీడీ వార్నింగ్..!

తిరుమల తిరుపతి దేవస్థానం కాంట్రాక్టు ఉద్యోగులు విధులను బహిష్కరించి భక్తులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఉద్యోగుల సమస్యలు చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని, భక్తుల సేవలకు ఆటంకం కలిగించే ప్రయత్నాలను ఎస్మా చట్టంతో అడ్డుకుంటామని స్పష్టం చేసింది.తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కాంట్రాక్టుల ఆందోళనపై తన వైఖరిని తేల్చేసింది. తాజాగా కాంట్రాక్టు ఉద్యోగులు విధులను బహిష్కరించి నిరసనలకు దిగే సూచనలు కనిపించడంతో టీటీడీ ఈ హెచ్చరిక చేసింది.

పూణేలో యువతిపై డెలీవరీ బాయ్ ఘాతుకం

మహారాష్ట్ర పుణెలో పూణెలోని కొంధ్వాలో.. ఒక మహిళ అపార్ట్ మెంట్ లో డెలీవరీ బాయ్ పార్సీల్ ఇవ్వడానికి వచ్చినట్లు నటించాడు. మహిళను పెన్ కావాలని అడిగాడు. ఆమె పెన్ కోసం లోపలికి వెళ్ళగా .. ఆమె వెనకాలే వెళ్లాడు, ఆమె ముఖంపై ఒక్కసారిగా పెప్పర్ స్ప్రై వేశాడు. ఆమె కళ్లు తిరిగిపడిపోయింది. వెంటనే ఆమెపై అత్యాచారంకు పాల్పడ్డాడు. ఘటన ఫోటోలు, సెల్ఫీలు తన ఫోన్ లో తీసుకున్నాడు. యువతి ఫోన్ లో సైతం.. సెల్ఫీ దిగి.. బైటకు […]

రూ.400కు హాఫ్ లీటర్ పెట్రోల్.. నెల్లూరులో

ెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని ఓ పెట్రోల్ బంక్‌లో వాహనదారుడు 400 రూపాయలకు పెట్రోల్ కొట్టించాడు. కానీ ఎక్కువగా పెట్రోల్ వచ్చినట్లు అనిపించలేదు. బైక్‌ను అటుఇటు ఊపి చూశాడు. పెట్రోల్ తక్కువగా ఉన్నట్లు అనుమానం రావడంతో బైక్‌ను పక్కకు ఆపి.. బకెట్లో పెట్రోల్‌ను తీయడంతో బంక్ నిర్వాహకుల బాగోతం బయటపడింది. బకెట్‌లోకి కనీసం అర లీటర్ పెట్రోల్ కూడా రాలేదు. దీనిపై సిబ్బందిని ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వలేదు మీటర్లను మ్యానిపులేట్ చేస్తూ ప్రజలను పెట్రోల్ బంక్ నిర్వాహకులు మోసం […]

అంగన్‌వాడి హెల్పర్లకు వయోపరిమితి పెంచుతూ ఉత్తర్వులు

తెలంగాణలో ఇప్పటి వరకు పని చేస్తున్న అంగన్‌వాడి హెల్పర్లకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.రాష్ట్రంలో గ్రామాల నుంచి పట్టణాలు, నగరాల్లో కూడా పిల్లలకు మధ్యాహ్నం భోజనం పెట్టి అక్షరాలు నేర్పించే అంగన్వాడి హెల్పర్లకు వయోపరిమితిని ఐదేళ్లు పెంచింది ప్రభుత్వం. దీనికి సంబంధించిన అధికారిక ఫైలుపై మంత్రి సీతక్క సంతకం చేశారు. రాష్ట్రంలో ఉన్న నాలుగు వేల మందికిపైగా అంగన్వాడీ హెల్పర్లకు ప్రయోజనం చేకూరనుంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON