loader

బాబ్లీ గేట్లు ఎత్తివేత

దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మహారాష్ట్రలోని ధర్మాబాద్ సమీపంలో గోదావరి నదిపై గల బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తి మంగళవారం నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం 1,064 అడుగుల వద్ద 15,567 టిఎంసిల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. బాబ్లీ గేట్లు తెరుచుకోవడంతో ఎస్‌ఆర్‌ఎస్‌పిలో నీరు చేరనుంది. బాబ్లీ గేట్లు ఎత్తివేయడంతో నిజామాబాద్ జిల్లా, కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి గలగలా పారుతూ పరవళ్ళు తొక్కుతోంది.

భోజనంలో బొద్దింక వచ్చిందా?… హోం మంత్రి క్లారిటీ

ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత బీసీ బాలికల హాస్టల్‌లో అనిత చేసిన భోజనంలో బొద్దింక వచ్చిందని జరుగుతున్న ప్రచారంపై ఆమె స్పందించారు. తనపై జరుగుతున్న ప్రచారానికి అడ్డుకట్ట వేయకుంటే, అది నిజమని ప్రజలు భావించే అవకాశం ఉందని అన్నారు. తాను చేస్తున్న భోజనంలో నాణ్యత తగ్గిందని, తల వెంట్రుక కనిపించిందని తెలిపారు. దానిని తీసి పడేశానని చెప్పారు. అయితే దానికి రకరకాల కథలు అల్లుతున్నారని వైసీపీపై విమర్శించారు.

ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ..

ఒక్కో రాష్ట్రంలో పాగా వేస్తూ దేశంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన బీజేపీ.. నేడు తన కీర్తికిరీటంలో మరో కలికి తురాయిని చేర్చుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. చైనాకు చెందిన సీపీసీ ఇప్పటివరకూ ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా ఉండగా.. కమలం పార్టీ దాన్ని అధిగమించింది. 14 కోట్ల సభ్యత్వాలతో కొత్త చరిత్ర లిఖించింది. శత వసంతాల కాంగ్రెస్ పార్టీతో సాధ్యంకానిది బీజేపీ సాధ్యంచేసింది.

ఇంకోసారి అలా మాట్లాడావో ఖబడ్డార్… శిరీష్‌కి మెగా ఫ్యాన్స్ వార్నింగ్

ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ ‘గేమ్ ఛేంజర్’పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. “ప్లాప్ అయ్యాక రామ్ చరణ్ ఫోన్ అయినా చేశారా?” అన్న అతని వ్యాఖ్యలపై మెగా అభిమానులు తీవ్రంగా స్పందించారు. శిరీష్‌కి వార్నింగ్ ఇచ్చే లేఖ విడుదల చేశారు. “మీరు ప్రతిసారీ హీరోపై, సినిమాపై విషం చిమ్మడం మాకు మానసికంగా బాధ కలిగిస్తోంది. ఇక ఒక్కసారి గానీ తప్పుగా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయి” అంటూ హెచ్చరించారు.

సత్యసాయి గ్రామంలో మ్యూజిక్‌ మాస్ట్రో AR రెహమాన్ సందడి..

ఆస్కార్ విజేత ఏఆర్‌ రెహమాన్ సత్యసాయి గ్రామాన్ని సందర్శించారు. గ్లోబల్ హ్యుమానిటేరియన్, ఆధ్యాత్మికవేత్త మధుసూదన్ సాయి నేతృత్వంలోని వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్ వివిధ మానవతా కార్యక్రమాలను పర్యవేక్షించారు. మధుసూదన్ సాయి మార్గదర్శకత్వంలో 2014లో సాయి సింఫనీ ఆర్కెస్ట్రా ప్రారంభమైంది. ఇందులో గ్రామీణ, పేద నేపథ్యాల నుంచి వచ్చిన 170 మందికిపైగా విద్యార్థులు ఉన్నారు. ఇది భారతదేశంలోనే అతిపెద్ద స్వదేశీ ఆర్కెస్ట్రా.

5,208 ఉద్యోగాలతో ఐబీపీఎస్‌ నోటీఫికేషన్!

స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ సహా ఆరు విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు IBPS ‌ నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పెషలిల్స్ ఆఫీసర్స్‌, అనలిస్ట్‌ ప్రోగ్రామర్‌- పైథాన్, ప్రొబిషనరీ ఆఫీసర్‌, హిందీ ఆఫీసర్‌, డివిజన్ హెడ్‌తోపాటు బ్యాంకర్ ఫాకల్టీ పోస్టులు ఈ నోటిఫికేష్ ద్వారా ఫిల్ చేయనుంది. అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసిన ఐబీపీఎస్‌ దరఖాస్తు స్వీకరణ కూడా ప్రారంభించింది. అర్హత ఉండి ఆసక్తి ఉన్న వాళ్లు ఇప్పుడే దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్ ibps.in

డా.బి.వి పట్టాభిరామ్ కన్నుమూత

ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు, సైకియాట్రిస్ట్, రచయిత, మాంత్రికుడు అయిన డా. బి.వి. పట్టాభిరామ్(75) హైదరాబాద్లో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. తన జీవితాన్ని వ్యక్తిత్వ వికాసం, మానసిక ఆరోగ్య పరిష్కారాల కోసం అంకితమిచ్చిన ఆయన, వేలాది మందికి మార్గదర్శకుడిగా నిలిచారు. విద్యార్థులు, ఉద్యోగార్థులు, కుటుంబ సలహాల కోసం ఆయన తీసిన శిక్షణా తరగతులు ప్రజాదరణ పొందాయి. ఆయన్ను విశేషంగా గుర్తించే అంశాల్లో ఒకటి హిప్నాటిజం. ఈ రంగంలో ఎన్నో అధ్యయనాలు చేసి, ప్రజల్లోని భయాలను తగ్గించేందుకు అనేక […]

దుకాణం మూసేయాల్సిందే- ట్రంప్‌ కౌంటర్‌

ట్రంప్ ఎలాన్‌ మస్క్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర ఆరోపణలు చేశారు. మస్క్ కంపెనీలు టెస్లా, స్పేస్‌ఎక్స్ గవర్నమెంట్‌ సబ్సిడీలపై ఎక్కువగా ఆధారపడుతున్నాయని చెప్పారు. ఈ సబ్సిడీలు లేకపోతే, మస్క్ ‘దుకాణాన్ని మూసివేసి దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది’ అన్నారు. టెస్లా ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిని, స్పేస్‌ఎక్స్ రాకెట్ ప్రయోగాలకు ముగింపు పలకాల్సిందేనని వార్నింగ్ ఇచ్చారు.

పాకీజా దీన స్థితికి చలించిన పవన్ కల్యాణ్..

తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సినీ నటి వాసుకి (పాకీజా)కి ఆమె దీన స్థితి తెలిసి చలించిన పవర్ స్టార్ రూ. 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. జనసేన కేంద్ర కార్యాలయంలో ఈ మొత్తాన్ని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పి. హరిప్రసాద్ , పి.గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ పాకీజాకు ఈ ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన సాయానికి పాకీజా కృతజ్ఞతలు తెలిపారు. చిన్నవాడైనా ఎదురుగా ఉంటే […]

ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ వచ్చేసింది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గానూ ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ జులై 17 నుంచి ఆగస్టు 2 వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం మూడు విడతల్లో కౌన్సెలింగ్‌ జరగనుంది. అయితే మొదటి రెండు విడతల కౌన్సెలింగ్‌ పూర్తయ్యాక మూడో విడత కౌన్సెలింగ్‌పై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అకడమిక్‌ కేలండర్‌ ప్రకారం ఇంజనీరింగ్‌ మొదటి సెమిస్టర్‌ తరగతులు ఆగస్టు 4వ తేదీ నుంచి […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON