loader

రాజ్యాంగ పీఠిక నుంచి లౌకికవాదం, సామ్యవాదం తీసేయాలన్న దత్తాత్రేయ- మండిపడ్డ రాహుల్ గాంధీ

రాజ్యాంగం నుంచి లౌకిక, సోషలిస్ట్ అనే పదాలను తొలగించడం గురించి ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు దత్తాత్రేయ హోసబాలే ఒక ప్రకటన చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ ముసుగు మళ్ళీ తొలగిపోయిందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. “రాజ్యాంగం వంటి శక్తివంతమైన ఆయుధాన్ని లాక్కోవడమే వారి నిజమైన ఎజెండా. బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌కు రాజ్యాంగం వద్దు, వారికి మనుస్మృతి కావాలి. బహుజనులు,పేదల హక్కులను లాక్కోవడం ద్వారా వారిని మళ్ళీ బానిసలుగా చేయాలనుకుంటున్నారు” అని ఆయన అన్నారు.

భార్య, పిల్లలతో బయట కనిపించిన ఉత్తరకొరియా కిమ్

టూరిస్ట్ జోన్‌ను ప్రారంభించడానికి ఉత్తర కొరియా నియంత కిమ్ తన భార్యా, పిల్లలతో వచ్చారు. వారు ఇంటర్నేషనల్ లగ్జరీ బ్రాండ్స్ వినియోగిస్తూ కెమెరాలకు చిక్కారు. వోన్సన్ కల్మా కోస్టల్ టూరిస్ట్ జోన్, ఉత్తర కొరియా యొక్క తూర్పు తీరంలో ఉన్న వోన్సన్‌లో ఉంది. కిమ్ జాంగ్ ఉన్ ఈ రిసార్ట్‌ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ రిసార్ట్ ను జూలై 1 నుండి దేశీయ సందర్శకుల కోసం తెరుస్తారు. విదేశీ పర్యాటకులకు అనుమతిపై ఇంకా ఎలాంటి […]

11,908 సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్‌కు నోటిఫికేషన్ విడుదల

ిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గుడ్ న్యూస్ తెలిపింది. ఒకేసారి ఏకంగా 11,908 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి అర్హత ఉన్న వాళ్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈనోటిఫికేషన్ ద్వారా మెుత్తం 11,908 మల్టీ టాస్కింగ్ స్టాఫ్(MTS),హవల్దార్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూలై 24లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే ఆన్‌లైన్‌లో దరఖాస్తు స్వీకరణ ప్రారంభం అయిన నేపథ్యంలో అధికారిక వెబ్ సైట్ https://ssc.gov.in/ నుంచి దరఖాస్తు చేసుకోండి.

జీవో 49 అమలు కాకుండా చూస్తాం- మంత్రి జూపల్లి హామీ

తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 49ను అమలు కాకుండా చూస్తామని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఉట్నూర్ లోని ఐటీడీఏ మీటింగ్ హాల్ లో గిరిజన పెద్దలు, అధికారులతో మంత్రి జూపల్లి శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా గిరిజనులను ఇబ్బందులకు గురిచేసే జీవో 49ను పూర్తిగా రద్దు చేయాలని ఎమ్మెల్యే లు, గిరిజన పెద్దలు డిమాండ్ చేశారు. గిరిజనులకు అన్యాయం చేసే ఏ పని ప్రభుత్వం చేయదని చెప్పారు. గిరిజనుల హక్కులు […]

సిబిల్ స్కోర్ లేదని… గవర్నమెంట్ జాబ్ ఇవ్వలేదు

ఎస్‌బీఐ సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నియామకాలు చేపట్టింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న ఓ అభ్యర్థి అన్నింటిలో పాస్ అయ్యాడు.16మార్చి 2021న నియామక పత్రం కూడా అందుకున్నాడు. ఇంతలో ఎస్‌బీఐ అతడికి షాక్ ఇచ్చింది. సిబిల్ స్కోర్ పేలవంగా ఉండటంతో ఉద్యోగం ఇచ్చేది లేదు అని స్పష్టం చేసింది. ఎస్‌బీఐ తీసుకున్న నిర్ణయంతో కంగుతిన్న అతగాడు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే ఎస్‌బీఐ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించడంతో అతడు ఉద్యోగాన్ని కోల్పోయాడు.

ఈ నెల 30 నుంచి జూనియ‌ర్ డాక్ట‌ర్‌ల ధర్నా..

తమ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం, వైద్యారోగ్య శాఖ మంత్రి స్పందించకపోవడంతో ఈ నెల 30 నుంచి ధర్నా చేపట్టనున్నట్టు తెలంగాణ జూనియర్‌ డాక్టర్ల అసోసియేషన్‌ వెల్లడించారు. స్టైఫండ్‌ చెల్లింపులో జాప్యం, మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం, బోధనా సిబ్బంది కొరత, స్కాలర్‌షిప్‌, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌‍ చెల్లింపులో ఆలస్యంపై ప్రభుత్వానికి పలుమార్లు వినతి పత్రం అందజేసిన ఫలితం లేదన్నారు. టీ జూడాల అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఇసాక్‌ న్యూటన్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.

హైకోర్టు లైవ్ స్ట్రీమ్‌ విచారణకు టాయిలెట్ నుంచి హాజరైన వ్యక్తి..

హైకోర్టులో జరిగిన లైవ్ స్ట్రీమ్‌ విచారణకు ఒక వ్యక్తి టాయిలెట్‌ నుంచి హాజరయ్యాడు. టాయిలెట్‌ సీటుపై కూర్చొన్న అతడు జూమ్ ద్వారా కోర్టు విచారణలో పాల్గొన్నాడు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. జూన్‌ 20న గుజరాత్‌ హైకోర్టులో చెక్ బౌన్స్ కేసుపై విచారణ జరిగింది. ప్రతివాది అయిన వ్యక్తి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వర్చువల్‌గా కోర్టు విచారణలో పాల్గొన్నాడు. అయితే టాయిలెట్‌లో ఉన్న అతడు అక్కడి నుంచే ‘సమద్ బ్యాటరీ’ పేరుతో జూమ్‌ […]

మైక్రోసాఫ్ట్‌లో 5 నెలల్లో 7లక్షల జాబ్స్ కట్..

ఇప్పటికే పలు దఫాలుగా ఉద్యోగాల్లో కోతలు విధించిన టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మళ్లీ లేఆఫ్స్ చేపట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ పరిణామాలు భారతీయ ఐటీ పరిశ్రమపై ప్రభావం చూపనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. లాభదాయకతను పెంచుకోవడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా సెంటర్లలో భారీగా పెట్టుబడులు పెట్టడం వంటి వ్యూహాత్మక మార్పుల కారణంగా.. మైక్రోసాఫ్ట్ ఉద్యోగులను తొలగిస్తోంది.

ఏపీ టూరిజం సలహాదారుగా బాబా రామ్‌దేవ్‌

ఏపీ ప్రభుత్వం విజయవాడలో టూరిజం కాన్‌క్లేవ్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి కందుల దుర్గేశ్, యోగా గురువు బాబా రాందేవ్ లు పాల్గొని ప్రసంగించారు. ఏపీ పర్యాటక శాఖకు సలహాదారుగా ఉండాలని ఆధ్యాత్మిక వేత్త, యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. ఆయన సమాజానికి చేస్తున్న సేవల్ని కొనియాడారు. ఏపీలో వెల్‌నెస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని బాబా రాందేవ్‌ను కోరారు.

పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు

తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలను విద్యాశాఖ విడుదల చేసింది. జూన్ 3 నుంచి జూన్ 13 వరకు జరిగిన పదో తరగతి సప్లీమెంటరి పరీక్షలకు 42,834 మంది దరఖాస్తు చేసుకోగా.. 38,741 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 28,415 మంది ఉత్తీర్ణలయ్యారు. పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాల్లో 73.35 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలురు 71.05 శాతం, బాలికలు 77 శాతం ఉత్తీర్ణత సాధించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON