loader

ఐఎస్ఎస్ లో అడుగుపెట్టిన శుభాంశు.. తొలి భారతీయుడిగా రికార్డు

ISRO(భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) వ్యోమగామి శుభాంశు శుక్లా.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)కు చేరుకుని చరిత్ర సృష్టించాడు. భారత అంతరిక్ష చరిత్రలో గర్వించదగ్గ మైలురాయిని నమోదు చేశాడు. ఐఎస్‌ఎస్‌లోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా శుభాంశు శుక్లా నిలిచాడు. వీరు ప్రయాణించిన క్రూ డ్రాగన్ క్యాప్సూల్ ఇవాళ సాయంత్రం 4.03 గంటలకు ISSతో విజయవంతంగా డాక్ చేసింది.

భారతీయుడిపై ట్రంప్ నోటి దురుసు

న్యూయార్క్ మేయర్ పదవి కోసం పోటీపడుతున్న వారిలోభారత సంతతికి చెందిన వామపక్ష సోషలిస్ట్ జోహ్రాన్ మమ్దానీ ఉన్నారు. దీంతో ట్రంప్ ఆయనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జోహ్రాన్ మమ్దానీ పై ట్రంప్ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. మమ్దానీ “భయంకరంగా కనిపిస్తున్నాడు, అతని గొంతు గజిబిజిగా ఉంది, అతను అంత తెలివైనవాడు కాదు, డమ్మీస్ అందరూ అతనికి మద్దతు ఇస్తున్నారు. ఇది మన దేశ చరిత్రలో ఒక గొప్ప క్షణం!” అని సెటైరిక్‌గా వ్యాఖ్యలుచేస్తున్నారు.

యాంటీ నార్కొటిక్స్‌ డేలో సీఎం చంద్రబాబు

గుంటూరులో యాంటీ నార్కొటిక్స్‌ డేలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీని ముఖ్యమంత్రి ప్రారంభించారు. గంజాయి సాగుతో దేశాన్ని, ఏపీని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. మద్యం ఆదాయంలో రెండు శాతాన్ని గంజాయి నిర్మూలనకు ఖర్చు చేస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గంజాయి, డ్రగ్స్ అమ్మేవారి ఆస్తులు కూడా జప్తు చేస్తామని హెచ్చరించారు. డ్రగ్స్ నిర్మూలన కోసం సినీ సెలబ్రిటీలు ముందుకురావాలని కోరారు. గంజాయి వేరే ప్రాంతాలనుంచి తీసుకువచ్చి ఏపీలో అమ్మినా వదిలేది లేదని సీఎం చంద్రబాబు […]

డ్రగ్స్‌ అరికట్టడానికి ఈగల్ వ్యవస్థ ఏర్పాటు..

పోరాటాల తెలంగాణ గడ్డను డ్రగ్స్‌కి అడ్డాగా మారడానికి వీల్లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నో పోరాటల స్పూర్తితో ముందుకు పోవాల్సిన రాష్ట్రం డ్రగ్స్, గంజాయి బారినపడటం చాలా బాధకరమని సీఎం విచారం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో గంజాయి, డ్రగ్స్ ఏ స్కూల్, కాలేజీలో పట్టుబడిన ఆ యాజమాన్యంపై కేసు బుక్ చేసి సీజ్ చేస్తామన్నారు. డ్రగ్స్ నియంత్రణకు ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లుగా సీఎం తెలిపారు. ఈసందర్భంగా లోగోని రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.

పిల్లలకు చాక్లెట్లు కొనివ్వాలంటే భయపడే పరిస్థితి: రామ్ చరణ్

డ్రగ్స్ దుర్వినియోగం, అక్రమ రవాణాపై అంతర్జాతీయ వ్యతిరేక దినోత్సవ కార్యక్రమంలో రామ్ చరణ్ మాట్లాడుతూ.. ప్రజెంట్ జనరేషన్ లో పిల్లలకు చాక్లెట్లు, ఐస్‌క్రీమ్‌లు కొనివ్వాలంటే భయపడే పరిస్థితి ఉందని అన్నారు. ఒక తండ్రిగా రాష్ట్రం గురించి, సిటీ గురించి, స్కూల్స్ గురించి ఆలోచించాల్సి వస్తుందని.. రేపు మా పిల్లలను బయటకు పంపించాలంటే ఇవన్నీ ఆలోచించాల్సి ఉంటదని చెప్పారు. వ్యవస్థలోని చెత్తను శుభ్రం చేసేందుకు ప్రభుత్వానికి అందరూ సహకరించాలని రామ్ చరణ్‌ అన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల బిల్లులు ఒకేసారి క్లియర్

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న 180.38 కోట్ల మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు ఒకేసారి క్లియర్ ప్రభుత్వం క్లియర్ చేసింది. 26,519 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట లభించినట్లు అయ్యింది. ఈనెల 13న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు డీఏలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఉద్యోగులకు సంబంధించిన పలు సమస్యల పరిష్కారానికి ఉద్యోగుల సంక్షేమ మంత్రుల సబ్ కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 15 రోజుల వ్యవధిలోనే పరిష్కరించడం […]

ఇజ్రాయెల్‌పై మేమే గెలిచాం: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ

ఇజ్రాయెల్‌పై ఇరాన్ ‘విజయం’ సాధించిందని, అమెరికాను కూడా చావుదెబ్బ తీశామని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌ను నేరుగా ప్రస్తావించకుండా, “మోసపూరిత జియోనిస్ట్ పాలన” అంటూ సంబోధించారు. ఈ మేరకు ఆయన అధికారిక ‘ఎక్స్’ ఖాతా ద్వారా స్పందించారు.

సోషల్ మీడియా ఖాతాలు ప్రైవేట్‌లో పెడితే వీసాలు ఇవ్వం

అమెరికా వీసా దరఖాస్తుదారులకు అమెరికా దౌత్య కార్యాలయం ఒక కీలక హెచ్చరిక జారీ చేసింది. DS-160 ఫారంలో గత ఐదేళ్ల సోషల్ మీడియా వివరాలు పూర్తిగా వెల్లడించకపోతే వీసా తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉందని చెప్పింది. అంతేకాకుండా భవిష్యత్తులో అమెరికా వీసాలకు కూడా అనర్హులు కావచ్చని వివరించింది. విద్యార్థి, ఉద్యోగ వీసాదారులు తమ ఖాతాలను పబ్లిక్‌గా ఉంచాలని సూచించింది.

ఆ సభలో ఎమ్మెల్యేలకు అవమానం..డిప్యూటీ స్పీకర్‌

సుపరిపాలన తొలి అడుగు సభలో ఎమ్మెల్యేలకు జరిగిన అవమానంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాస్తానని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామ కృష్ణమరాజు తెలిపారు. ప్రభుత్వం నిర్వహించిన ఈ సభలో ప్రోటోకాల్ నిబంధనలను ఎందుకు పాటించలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యక్రమానికి స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లను కూడా ఆహ్వానించాలని రఘురామ కోరారు.

బైక్‌లపై టోల్ ఫీజు…కేంద్రం క్లారిటీ ఇదే !

బైక్‌లపై టోల్ ఫీజు వసూలు చేయాలనే ప్రతిపాదనలతో 15జూలై 2025 నుండి ద్విచక్ర వాహనాలు హైవే ఎంట్రీ పాయింట్ల వద్ద టోల్ ఫ్రీ ఉండదు అని వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. టోల్ ఫీజు వసూలు దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై ఎన్‌హెచ్ఏఐ స్పందించింది. ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించింది. టూ వీలర్స్‌పై టోల్ ఫీజు వసూలు చేసే ఆలోచన కానీ… ఎలాంటి ప్రతిపాదన కానీ ప్రభుత్వం వద్ద లేదు అని […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON