బనకచర్లపై కేంద్రానికి ఫిర్యాదు..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య జలవివాదం మళ్లీ మొదలైంది. ఏపీ సర్కారు ప్రతిపాదిత బనకచర్ల నీటి ప్రాజెక్టు ఇప్పుడు ఈ వివాదానికి కేంద్రంగా మారింది. ఈ క్రమంలోనే బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ సర్కారు ఫిర్యాదు చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ను కలిశారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తున్న బనకచర్ల ప్రాజెక్టుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు.