loader

రామోజీ ఫిలిం సిటీ ప్రపంచంలోనే అత్యంత భ‌యాన‌క ప్ర‌దేశం.. కాజోల్ షాకింగ్ కామెంట్స్

నేను షూటింగ్ చేసిన ప్రదేశాల్లో చాలా భయానక ప్రదేశాలు ఉన్నాయి. భయంతో రాత్రుల్లో నిద్ర పట్టేది కాదు.  తిరిగి ఎప్పుడూ అక్కడికి రాకూడదని అనుకునేదాన్ని. హైదరాబాద్ లోని రామోజీరావు స్టూడియోని ప్రధాన ఉదాహరణగా చెప్పొచ్చు. ఇది వరల్డ్ లోనే అత్యంత భయంకరమైన ప్రదేశమని బాలీవుడ్ నటి కాజోల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. పాన్ ఇండియా సినిమాల షూటింగ్ జరిగే చోటును ఆమె అలా ఎలా అంటారని ప్రశ్నిస్తున్నారు.

ఇరాన్ లొంగిపోయే ప్రసక్తి లేదు

ఇరాన్ లొంగిపోయే ప్రసక్తే లేదని సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ నిర్ద్వంద్వంగా స్పష్టం చేశారు. అమెరికా సైనిక జోక్యం చేసుకునేపక్షంలో కోలుకోలేని విధంగా నష్టం కలిగించి తీరతామని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కు తీవ్ర హెచ్చరిక చేశారు. ఇజ్రాయెల్ తో వివాదం మధ్య ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలని ట్రంప్ జారీచేసిన బెదిరింపు తర్వాత బుధవారం సుప్రీంలీడర్ ఖుమేనీ టెలివిజన్ లో జవాబిచ్చారు. ఇరాన్ బలవంతంగా రుద్దిన యుద్ధాన్ని ధైర్యంగా ఎదుర్కొని ఇరాన్ నిలబడుతుందని ఆయన స్పష్టం […]

కెసిఆర్ చేసిన సంతకం.. ఇప్పుడు పెద్ద ప్రతిబంధకంగా మారింది: సిఎం

రాయలసీమకు గోదావరి జలాల తరలింపుపై చర్చించుకున్నామని ఆనాడు తెలంగాణ, ఎపి మంత్రులు మీడియాకు చెప్పారని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆనాడు సిఎం కెసిఆర్ చెప్పిన అంశాలే నేడు తెలంగాణకు గుదిబండగా మారాయని మండిపడ్డారు. గోదావరి-బనకచర్ల అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తాలని నిర్ణయించినట్లు తెలిపారు. 2019 అక్టోబర్‌లో కెసిఆర్, జగన్ కలిసి గోదావరి జలాలను రాయలసీమకు తరలించటంపై చర్చించుకున్నారని ఎద్దేవా చేశారు.

వైఎస్ జగన్ పల్నాడు పర్యటనలో అపశ్రుతి..కీలక వివరాలు వెల్లడించిన గుంటూరు ఎస్పీ

ఏటుకూరు బైపాస్ వద్ద వైఎస్ జగన్ కాన్వాయ్ ముందు వెళ్తున్న ప్రైవేటు వాహనం ఢీకొని ఓ వ్యక్తి చనిపోయారు. చనిపోయిన వ్యక్తిని చీలి సింగయ్య అనే వ్యక్తిగా గుర్తించారు. సింగయ్యను ఓ ప్రైవేట్ వాహనం ఢీకొనటంతో చీలి సింగయ్య రోడ్డుపై పడిపోయారని.. కారు టైరు అతని భుజం మీదుగా వెళ్లిందన్నారు. హైవే పోలీసులు సింగయ్యను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే సింగయ్య చనిపోయారని వైద్యులు ధ్రువీకరించినట్లు ఎస్పీ వెల్లడించారు.

పాపం ఆ విద్యార్థినులు.. పరువు కాపాడండి సారూ!

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని గిరిజన బాలికల కళాశాల హాస్టల్‌లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. 200 మంది విద్యార్థినులకు కేవలం 8 బాత్రూమ్‌లు మాత్రమే ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శిథిలావస్థకు చేరిన బాత్రూమ్‌లకు తలుపులు కూడా లేకపోవడంతో చున్నీలతో స్నానాలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఈ సమస్యపై స్పందించి తక్షణమే హాస్టల్‌లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని విద్యార్థినులు, స్థానికులు కోరుతున్నారు..

దేశంలోనే తొలి గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ప్రారంభం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ (GSEC) ప్రారంభించారు. ఇది భారతదేశంలో మొదటి సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో టోక్యో తర్వాత రెండవ సెంటర్ కావడం విశేషం. ఈ సేఫ్టీ సెంటర్ సైబర్‌ సెక్యూరిటీ, ఆన్‌లైన్ భద్రత, AI-ఆధారిత భద్రతా పరిష్కారాలపై పరిశోధన చేస్తుంది. ఈ కేంద్రం భారతదేశానికి సంబంధించిన సైబర్‌ సెక్యూరిటీ సవాళ్లకు పరిష్కారాలను అందిస్తుంది. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి భద్రతా హబ్‌గా తీర్చిదిద్దుతుందని తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తోంది.

నటుడు ఆర్యకు షాక్ ఇచ్చిన ఐటి అధికారులు

ప్రముఖ తమిళ నటుడు ఆర్యకు ఐటి శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. ఆయన నివాసంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు నిర్వహించినట్లు సమాచారం చెన్నైలోని అన్నానగర్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న ‘‘సీ షెల్’’ రెస్టారెంట్లపై సోదాలు చేపట్టారు. గతంలో ఈ రెస్టారెంట్ చైన్‌తో సంబంధం ఉండటంతో ఆర్య నివాసంలోనూ తనిఖీలు జరిపారు.

అది నిజమే.. నేను కూడా బాధితురాలినే: వైఎస్ షర్మిల

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ పై ఎపి కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక కామెంట్స్ చేశారు. “బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్తున్నా… ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నది వాస్తవమే. నా ఫోన్, నా భర్త ఫోన్, నా దగ్గర వాళ్ల ఫోన్‌లు ట్యాప్ చేశారు. ఫోన్ ట్యాప్ జరిగినట్లు స్వయంగా వైవీ సుబ్బారెడ్డి నిర్ధారించారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు ఎక్కడికి రమ్మని చెప్పినా వస్తా. ఫోన్‌ ట్యాపింగ్‌పై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్‌ […]

బాంబుల వర్షం..ప్రాణభయంతో తెలుగు వారు..బంకర్లలలో జీవనం

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. బాంబు దాడులతో ఇరు దేశాల జనజీవనం అతలాకుతలం అవుతోంది. ఇజ్రాయెల్ లో పని చేస్తున్న ఉమ్మడి ఆదిలాబాద్ బాదితులు. విరుచుకు పడుతున్న మిస్సైల్లతో ఎప్పుడేం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం గడుపుతున్నామంటున్నారు జిల్లా వాసులు. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ లో జీవనం సాగిస్తున్న నిర్మల్ జిల్లా సారంగ పూర్ మండలానికి‌ చెందిన ఓ కుటుంబం తమను కాపాడాలంటూ ఇండియన్ ఎంబసీని ఆశ్రయించింది.

రూ.3 వేలు కడితే చాలు…ఏడాది టోల్ గేటు పాస్

రెగ్యులర్ గా హైవేల పై ప్రయాణించే వారికి, అలాగే ట్రాన్స్ పోర్ట్ వాహనాల కోసం FASTag annual pass అందుబాటులోకి తెచ్చింది. ఏడాది మొత్తం టోల్ గేట్ వద్ద టోల్ ఫీజు చెల్లించకుండా వెళ్ళవచ్చు. ఈ పాసు ధర 3000 రూపాయలుగా నిర్ణయించారు. లేదా 200 ట్రిప్పులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో ఏది ముందుగా పూర్తయితే అది వర్తిస్తుంది. ఫాస్ట్ ట్యాగ్ వల్ల టోల్ ఫీజు అత్యధికంగా చెల్లిస్తున్న వారికి ఇది ఒక రకంగా […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON