loader

విమాన ప్రమాద ఘటన..బాల్కనీ నుంచి దూకేశారు..

జూన్ 12వ తేదీన అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదంలో బిజె మెడికల్ కాలేజీ హాస్టల్ భవనాన్ని ఢీకొట్టిన విషయం తెలిసిందే. బిజె మెడికల్ కాలేజీ భవనాన్ని విమానం ఢీకొన్న వెంటనే భారీగా శబ్ధం వచ్చింది. దీంతో భయపడిపోయిన విద్యార్థులు మూడో అంతస్థు బాల్కనీకి బెడ్‌షీట్లను కట్టి.. తమ ప్రాణాలు కాపాడుకొనేందుకు కిందకు దూకేశారు. వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.

రేపటిలోగా సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌ అప్పగించాలి.. కెటిఆర్‌కు ఎసిబి ఆర్డర్స్

ఫార్ములా ఈ కార్‌ రేసు కేసులో ఎసిబి దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి కెటిఆర్ సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌ లను స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమైంది. నిన్న ఫార్ములా ఈ కేసులో ఎసిబి విచారణకు కెటిఆర్ హాజరైన సంగతి తెలిసిందే. ఈ విచారణ అనంతరం కెటిఆర్ వాడిన సెల్‌ఫోన్‌, మ్యాక్‌బుక్‌, ట్యాబ్‌లో కీలక సమాచారం ఉందని ఎసిబి అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఎలక్ట్రానిక్‌ పరికరాల నుంచే కెటిఆర్‌, అధికారులకు ఆదేశాలు ఇచ్చారని అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది.

ఏపీ ప్రభుత్వం మరోకీలక నిర్ణయం…

రాష్ట్రంలో వ్యర్ధాల నిర్వహణ వ్యవస్థను పటిష్టపరిచేలా… రెండు నెలల్లో సర్క్యులర్ ఎకానమీకి సంబంధించి తుది పాలసీని తీసుకురావాలని, అక్టోబర్ 2 కల్లా రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండి… 4 నగరాలతో పాటు మరో 17 కార్పొరేషన్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పూర్తిగా అరికట్టాలని, 90 రోజుల్లోగా రీసైక్లింగ్, చెత్తను వేరు చేయడంపై కార్యాచరణ ప్రణాళిక ఇవ్వాలన్నారు. మంగళవారం సచివాలయంలో సర్క్యులర్ ఎకానమీపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.

ఉప్పల్ భారత్ పెట్రోల్ పంపులో ఘరానా మోసం

వాహనదారులను పెట్రోల్ పంపుల యజమానులు మోసాలకు పాల్పడుతుండడంతో వారు తీవ్రంగా నష్టపోతున్నారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఉప్పల్ మండలం పరిదిలో నల్ల చెరువుకట్ట భారత్ పెట్రోల్ పంపులో మీటర్ రిసెట్ చేయకపోవడంతో పాటు ఎలక్ట్రానిక్ చిప్‌లు పెట్టి మోసం చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. భారత్ పెట్రోల్ పంపులో పెట్రోల్ బాటిల్ లో నింపించుకోవడంతో మోసం వెలుగులోకి వచ్చింది. వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెట్రోల్ బంకు యాజమానిపై చర్యలు తీసుకోవాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.

జాక్‌పాట్ కొట్టిన భారత్.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

అండమాన్ అండ్ నికోబార్ సముద్రంలో గయానా తరహా చమురు నిక్షేపాలను ఉన్నాయని భారత్ కనుగొంది. సుమారు 184,440 కోట్ల లీటర్ల ముడి చమురు నిల్వలు ఉండవచ్చని, ప్రభుత్వ రంగ సంస్థలైన ఆయిల్ ఇండియా, ఓఎన్జీసీ అక్కడ చమురు, సహజవాయువు కోసం ఆ సముద్రంలో తవ్వకాలు జరుపుతున్నాయి. ఒక్కో బావి తవ్వడానికి దాదాపు రూ.850 కోట్లు ఖర్చవుతుందని దానికోసం అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించారన్నారు భారత పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి.

బనకచర్లపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారు: నిమ్మల

నిమ్మల మీడియాతో మాట్లాడుతూ.. వరదల వల్ల నష్టపోతున్న ఎపికి.. నీళ్లు ఉపయోగించుకునే హక్కుఉంది అని చెప్పారు. గోదావరి నీళ్లు నిరుపయోగంగా సముద్రంలో కలుస్తున్నాయని, ఎగువ నీటి అవసరాలు తీరిన తర్వాతే బనకచర్లకు నీళ్లు వృథాగా పోతున్నాయని ఆ నీళ్లనే బనకచర్లకు వాడుకుంటాం అని తెలియజేశారు. రాజకీయ లబ్ధి కోసమే బనకచర్లపై వైసిపి విమర్శలు చేస్తుందని మండిపడ్డారు.

ట్రంప్ మొబైల్! సెప్టెంబర్‌లో T1 ఫోన్‌ రిలీజ్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంస్థ “ట్రంప్ మొబైల్”ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ట్రంప్ సంస్థ కింద ఈ మొబైల్ సేవ, వైర్‌లెస్ సేవతో సంప్రదాయవాద వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఈ సెల్ఫ్-బ్రాండెడ్ మొబైల్ సర్వీస్ ప్రధాన టెలికాం ప్రొవైడర్లకు ప్రత్యామ్నాయంగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఆ సంస్థ నుంచి స్మార్ట్‌ఫోన్ T1 ఫోన్ సెప్టెంబర్ 2025లో విడుదల అవుతుంది.

సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యం, హైకోర్టు సీరియస్

శాంతిభద్రతల పరిరక్షణ కంటే సివిల్ వివాదాల్లోనే పోలీసులు అధిక ఆసక్తి చూపిస్తున్నారని తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్‌లోని బార్కాస్ ప్రాంతానికి చెందిన మొహిసిన్ బఫానా అనే వ్యక్తి తన ఇంటి స్థలంపై సివిల్ కోర్టులో వేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని పోలీసులు బెదిరించారని హైకోర్టును ఆశ్రయించగా.. ఈ కేసులో విచారణ జరిపిన న్యాయస్థానం పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడింది. పోలీసులు ప్రజల్లో విశ్వాసం నింపడంలో విఫలమవుతున్నారని, తమ పరిధిని దాటి వ్యవహరిస్తున్నారని హైకోర్టు […]

మహిళను చెట్టు కట్టి దాడి- కుప్పం ఘటనపై చంద్రబాబు ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా కుప్పం ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. మహిళపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అప్పు తీర్చలేదని మహిళను చెట్టుకు కట్టేసి మునికన్నప్ప అనే వ్యక్తి ఆమెపై దాడి చేశాడు. సిఎం చంద్రబాబు ఎస్పితో ఫోన్‌లో ఈ ఘటనపై ఆరా తీశారు. నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేశామని చంద్రబాబుకు ఎస్ పి తెలిపారు. ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సిఎం పేర్కొన్నారు.

వైసీపీ కార్యకర్త విగ్రహావిష్కరణకి జగన్ సహా కేవలం వంద మందికే అనుమతి

పల్నాడు జిల్లా సత్తెనపల్లి రూరల్ మండలం రెంటపాల గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) సీనియర్ కార్యకర్త నాగ మల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ కార్యక్రమం రేపు ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హాజరుకానుండటంతో జిల్లా రాజకీయ వేడి పెరిగింది. భద్రతా కారణాలతో పోలీసులు జగన్‌తో పాటు కేవలం వంద మందికే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అనుమతి ఇచ్చారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON