శరణమా… న్యాయ సమరమా?… నారా లోకేశ్ సవాల్
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్…రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ల మధ్య ట్విటర్ వార్ నడుస్తోంది. మరోసారి వైఎస్ జగన్పై లోకేశ్ ధ్వజమెత్తారు. ‘సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్!’అంటూ జగన్ను ఉద్దేశించి మంత్రి లోకేశ్ సెటైర్లు వేశారు. తల్లికి వందనం డబ్బులు నా జేబులోకి వెళ్ళాయి అంటూ చేసిన ఆరోపణలు 24 గంటల్లో నిరూపించాలని ఛాలెంజ్ చేసాను. సమయం ముగిసింది, రుజువు చెయ్యలేదు, క్షమాపణ కోరలేదు. లీగల్ యాక్షన్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి.