loader

శరణమా… న్యాయ సమరమా?… నారా లోకేశ్ సవాల్

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్…రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ల మధ్య ట్విటర్ వార్ నడుస్తోంది. మరోసారి వైఎస్ జగన్‌పై లోకేశ్ ధ్వజమెత్తారు. ‘సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్!’అంటూ జగన్‌ను ఉద్దేశించి మంత్రి లోకేశ్ సెటైర్లు వేశారు. తల్లికి వందనం డబ్బులు నా జేబులోకి వెళ్ళాయి అంటూ చేసిన ఆరోపణలు 24 గంటల్లో నిరూపించాలని ఛాలెంజ్ చేసాను. సమయం ముగిసింది, రుజువు చెయ్యలేదు, క్షమాపణ కోరలేదు. లీగల్ యాక్షన్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి.

ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు అందుకున్న బాలకృష్ణ

గద్దర్ ఫిల్మ్ అవార్డుల్లో భాగంగా ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ స్పెషల్ జ్యూరీ అవార్డును బాలకృష్ణ అందుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ‘ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు’ అందుకున్నారు బాలకృష్ణ. మెమొంటోతో పాటు రూ.10 లక్షల ప్రైజ్ మనీ, ప్రత్యేక ప్రశంసా పత్రం బాలయ్యకు అందజేశారు. ఈ ప్రైజ్ మనీ బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి రీసెర్చ్ సెంటర్‌కు అందిస్తామని బాలకృష్ణ తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా అవార్డ్ అందుకున్న అల్లు అర్జున్..

పుష్ప 2 సినిమాలో నటనకుగానూ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ కు గద్దర్ అవార్డ్ ప్రకటించింది తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అల్లు అర్జున్ గద్దర్ అవార్డ్ అందుకున్నారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ..“ఈ అవార్డ్ నాకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే పుష్ప 2 సినిమాకు నేను గెలిచిన మొదటి అవార్డ్ అది. ఈ అవార్డును నేను నా అభిమానులకు అంకితం చేస్తున్నాను. మీ ప్రేమ, సపోర్ట్ కు ధన్యవాదాలు.

కూర్మ గ్రామంలో అగ్నిప్రమాదం…విచారణకు పవన్ ఆదేశం

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా హిర మండలంలోని కూర్మ గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఆధునిక హంగులు లేకుండా అధ్యాత్మిక చింతనతో జీవించేలా తీర్చిదిద్దుకున్న కూర్మ గ్రామం అగ్నికి ఆహుతి కావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. కూర్మ గ్రామంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంపై పోలీసులు లోతుగా విచారణ చేయాలని సంబంధిత యంత్రాంగాన్ని ఆదేశించారు.

ఏపీ డీఎస్సీ బిగ్ అప్డేట్…ఆ రెండు పరీక్షలు వాయిదా

జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవ నేపథ్యంలో ఈనెల 20,21 తేదీల్లో పరీక్ష రాయాల్సిన అభ్యర్థులకు జూలై 1, 2 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తామని మెగా డీఎస్సీ కన్వీనర్ ఎం.వి.కృష్ణా రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి పరీక్షా కేంద్రాలు, పరీక్ష తేదీలను మార్చిన హాల్ టిక్కెట్లు https://apdsc.apcfss.in లో 25.06.2025 అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు.

ఘనంగా గద్దర్ ఫిల్మ్ అవార్డుల వేడుక

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక ఘనంగా ప్రారంభమైంది. హైదరాబాద్ హైటెక్స్‌ వేదికగా జరుగుతున్న ఈవెంట్‌కు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి, ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు సహా ఇతర రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దిల్ రాజు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

విమానంలో సీట్ నంబర్ 11A మిస్టరీ..

అహ్మదాబాద్ విమానం కూలిన ఘటనలో ఒక్కరు తప్ప అందరూ చనిపోయిన విషయం తెలిసిందే. ఆ బతికిన ఒకే ఒక్క వ్యక్తి కూర్చున్న సీట్ నంబర్ 11A. 1998లో థాయ్ యాక్టర్ జేమ్స్ లోయ్‌చుసాక్ థాయ్ ఎయిర్‌వేస్ ఫ్లైట్ ల్యాండింగ్ ప్రయత్నంలో  క్రాష్ అయింది. ఈ ప్రమాదంలో 101 మంది చనిపోయారు. కానీ సీటు నంబర్ 11Aలో కూర్చున్న లోయ్‌చుసాక్ ప్రాణాలతో బయటపడ్డాడు. కొందరు దీన్ని కేవలం లక్ అంటుంటే, మరికొందరు కోఇన్సిడెన్స్ అంటున్నారు. ఇంకొందరైతే దీనిని ఒక […]

ఉద్యోగులకు బహుమతిగా కార్లు

చెన్నైలో టెక్ సర్వీసెస్ సంస్థ అజిలిసియం తన 10 ఏళ్ల ప్రస్థానంలో తమతో కలిసి ప్రయాణించిన ఉద్యోగులకు 25 కొత్త హ్యుందాయ్ క్రెటా SUVలను బహుమతిగా ఇచ్చింది. సంస్థలోని ప్రతి స్థాయిలో వ్యక్తిగత పనితీరు ఆధారంగా వేతన పెంపును కూడా ప్రకటించింది. చెన్నై కంపెనీ ఉద్యోగుల పట్ల చూపించిన ఉదారత సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రయత్నం ఆలోచనాత్మక కార్పొరేట్ కృతజ్ఞతకు ఒక బెంచ్‌మార్క్‌గా నిలిచిందని పలువురు ప్రశంసించారు.

నీట్ 2025 ఫలితాల్లో టాప్‌ మహేష్ కుమార్

మహేష్ కుమార్ – ర్యాంక్ 1 (రాజస్థాన్), నీట్‌ ఫలితాలు 2025లో 12 లక్షల మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీళ్లంతా MCC, రాష్ట్ర స్థాయి కౌన్సెలింగ్ రౌండ్లలో పాల్గొనడానికి వీలు కలుగుతుంది. టాప్‌ ర్యాంకులు సాధించిన వారి జాబితా చూస్తే టాప్ టెన్ ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కరు కూడా లేరు. ఇందులో 9 మంది అబ్బాయిలే. ఒక్కరే అమ్మాయి ఉన్నారు.

తల్లికి వందనం డబ్బులు రాలేదా?…

తల్లికి వందనం పథకం అమలుకు గురువారం శ్రీకారం చుట్టింది. నిధులు బ్యాంకు ఖాతాల్లో పడుతున్నాయి. సోమవారం వరకు కూడా డబ్బులు జమ కాకపోతే… జూన్ 26 వరకు వారికి సమయం ఇస్తున్నాం. మనమిత్ర వాట్సప్‌ ద్వారా గ్రీవెన్స్ నమోదు చేయవచ్చు. అలాగే గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి డేటాలో పొరపాట్లు ఏమైనా ఉంటే తెలియచేస్తే… వాటిని పరిశీలించి అర్హులుగా గుర్తించి, తల్లికి వందనం డబ్బులు ఇవ్వటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది’’ అని మంత్రి నారా లోకేష్ స్పష్టం […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON