loader

కూటమి ప్రభుత్వం సరికొత్త కార్యక్రమం ‘తొలి అడుగు’

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 23 నుంచి నెల రోజుల పాటు ఇంటింటికీ ‘తొలి అడుగు’ విజయయాత్రకు శ్రీకారం చుట్టారు. కూటమి ప్రభుత్వం ఏడాదిలో చేసిన కార్యక్రమాలు, అమలు చేసిన పథకాలు వివరించాలి. ఈ కార్యక్రమంలో లీడర్ నుంచి కేడర్ వరకూ ప్రతి ఒక్కరూ విజయయాత్రలో పాల్గొనాలి. ప్రచారం చేసే విషయంలో పోటీ పడాలి.’అని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

DNA టెస్టుల కోసం అహ్మదాబాద్‌కు క్యూ కట్టిన బంధువులు..

అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు మొత్తంగా 265 మంది మృతి చెందగా.. ప్రమాదంలో చనిపోయిన వారందరి మృతదేహాలు గుర్తించలేని స్థితిలోకి మారిపోగా.. డీఎన్ఏ టెస్టులు చేసి మరీ వారిని గుర్తించబోతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు సివిల్ ఆస్పత్రి ఎదుట క్యూ కట్టారు. ఓవైపు శాంపిల్స్ ఇస్తూనే.. మరోవైపు మృతదేహాలను తమకు ఎప్పుడు అప్పగిస్తారంటూ అడుగుతురున్నారు.

వైసీపీకి మంత్రి నారా లోకేష్ వార్నింగ్

తనపై వైసీపీ తప్పుడు ఆరోపణలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లికి వందనంలో రూ.13 వేలు తల్లుల ఖాతాలో వేసి, రూ.2 వేలు తన జేబులో వేసుకుంటున్నానని వైసీపీ ఆరోపణలు చేస్తుందని అన్నారు. అయితే తనపై చేసిన తీవ్రమైన ఆరోపణలను నిరూపించాలని… ఇందుకు 24 గంటల సమయం ఇస్తున్నానని… లేదా వెనక్కి తీసుకోవడం గానీ చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు.

స్కూల్లో కుమారుడ్ని చేర్పించిన పవన్

ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ (ISH)లో పవన్ కల్యాణ్ తన కుమారుడ్నిచేర్పించారు. ఆ స్కూల్ అల్ట్రారిచ్, సెలబ్రిటీల పిల్లలకే ప్రత్యేకం అనుకోవచ్చు. మొదట అడ్మిషన్ తీసుకోవడానికే పదిలక్షల వరకూ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక ఏడాదికి ఫఈజులు ఇతర ఖర్చులు కలిపి పది లక్షల వరకూ ఖర్చవుతుందని అంచనా. అంటే ఏటా ఇరవై లక్షలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఈ స్కూల్ లో ఫీజుకు తగ్గ ప్రమాణాలు ఉంటాయి. ఇటీవలి కాలంలో సినీ సెలబ్రిటీలంతా ఇక్కడే చదివిస్తున్నారు.

సుప్రీం తీర్పు బాబుకు చెంపపెట్టు వంటిది: జగన్

ిరంకుశంగా, అప్రజాస్వామికంగా, అరాచకంగా వ్యవహరిస్తున్న..ఎపి సిఎం చంద్రబాబు నాయుడుకు కు సుప్రీం కోర్టు గట్టిగా బుద్ధి చెప్పిందని వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీనియర్ జర్నలిస్టు కెఎస్ఆర్ ను వెంటనే విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు చంద్రబాబుకు చెంపపెట్టు వంటిదని అన్నారు. ప్రాథమిక హక్కులకు, స్వేచ్ఛకు..తీవ్ర భంగకరమని కోర్టు చెప్పడం ముదాహం అని జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు..

తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. నిబంధనలు తుంగ లోకి తొక్కి మరీ గోదావరి నదీ గర్భంలో భారీ యంత్రాలు, డ్రెక్టర్లతో విచ్చలవిడిగా ఇసుక తవ్వేసి తరలించుకుపోతున్నారు కొందరు వ్యాపారులు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్నా అధికారులు చూసిచూడనట్టు వదిలేయడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఇసుక అక్రమరావాణపై అధికారులు దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సోమవారం పొద్దున్నే రండి- కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు

ఫార్ములా ఈ రేసు కేసు విషయంలో కల్వకుంట్ల తారక రామారావుకు తెలంగాణ ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. సోమవారం ఉదయం తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. ఇంతకు ముందుఓ సారి నోటీసులు జారీ చేసినా.. తాను విదేశీ పర్యటనకు వెళ్తున్నానని రాలేనని.. వచ్చిన తర్వాత విచారణకు హాజరవుతానని చెప్పారు. ఫార్ములా ఈ రేసు కేసు విషయంలో ఓ సారి ఈడీ ఎదుట కూడా హాజరయ్యారు.

రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు…

జూన్ నెలలోనే అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయనున్నట్టుగా సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా గురువారం రోజున సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… ఈ నెల 20న అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తామని తెలిపారు. రైతులకు ఏడాదిలో కేంద్రం (పీఎం కిసాన్ యోజన) ఇచ్చే రూ. 6 వేలకు మరో 14 వేల రూపాయలు కలిపి… రూ. 20 వేలు వారి ఖాతాల్లో వేస్తామని చెప్పారు.

నాలా సమస్య.. ఎంఐఎం ఎమ్మెల్యేపై తిరగబడ్డ స్థానికులు

హైదరాబాద్ నగరంలో వర్షాకాలం మొదలవడంతో నాలాల సమస్య తీవ్రరూపం దాల్చింది. నాంపల్లి ప్రాంతంలో నాలా సమస్య పరిష్కరించడంలో జాప్యం జరుగుతోందని ఆగ్రహించిన స్థానికులు, ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్‌ను నిలదీశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే అనుచరులపై దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమస్య పరిష్కారం కోసం స్థానికులు అనేకసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోవడంతో ఈ ఘర్షణ చోటుచేసుకుంది.

ఇరాన్ అణు స్థావరాలపై దాడులు- ఆర్మీ చీఫ్ మృతి

ఇరాన్‌లోని అణు, సైనిక స్థావరాలపై ఇజ్రాయేల్ ఇవాళ తెల్లవారుజామున విరుచుకుపడింది. ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరుతో ఇజ్రాయేల్ జరిపిన ఈ దాడిలో ఇరాన్ ఆర్మీ చీఫ్, రివల్యూషనరీ గార్డ్స్ చీఫ్ మేజర్ జనరల్ హుస్సేన్ సలామీ మరణించారు. ఇరాన్ మిలిటరీ చీఫ్ మహమ్మద్ బాఘేరీ, మరికొందరు కీలక సైనిక నేతలు, అలాగే మొహమ్మద్ మెహ్ది టెహ్రాంచి, ఫెరెడౌన్ అబ్బాసి అనే ఇద్దరు అణు శాస్త్రవేత్తలు కూడా ఈ దాడిలో మరణించినట్లు ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) తెలిపింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON