కూటమి ప్రభుత్వం సరికొత్త కార్యక్రమం ‘తొలి అడుగు’
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 23 నుంచి నెల రోజుల పాటు ఇంటింటికీ ‘తొలి అడుగు’ విజయయాత్రకు శ్రీకారం చుట్టారు. కూటమి ప్రభుత్వం ఏడాదిలో చేసిన కార్యక్రమాలు, అమలు చేసిన పథకాలు వివరించాలి. ఈ కార్యక్రమంలో లీడర్ నుంచి కేడర్ వరకూ ప్రతి ఒక్కరూ విజయయాత్రలో పాల్గొనాలి. ప్రచారం చేసే విషయంలో పోటీ పడాలి.’అని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.