loader

టేకాఫ్‌ నుంచి బిల్డింగ్‌పై కూలే వరకు..32 సెకన్లలోనే

విమానం టేకాఫ్‌ అయి గాల్లోకి ఎగుతున్న క్రమంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పూర్తిగా పైకి వెళ్లకుండా.. కొద్ది సెకన్లలోనే కిందికి దిగుతూ.. కాలేజ్‌ బిల్డింగ్‌పై కూలిపోయింది. ఆ వెంటనే భారీ పేలుడు సంభవించింది. దట్టమైన పొగ కమ్ముకుంది. అలా చూస్తుండగానే.. కేవలం 32 సెకన్లలోనే ఎయిర్‌ ఇండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం పూర్తిగా భస్మం అయిపోయింది.

ఆ జిల్లాలకు కొత్త కలెక్టర్లు..

హైదరాబాద్ కలెక్టర్‌గా దాసరి హరిచందన, హన్మకొండ కలెక్టర్‌గా స్నేహ శబరీష్, ఖమ్మం కలెక్టర్‌గా దురిశెట్టి అనుదీప్, నిజామాబాద్ కలెక్టర్‌గా టి. వినయ్ కృష్ణారెడ్డి, సిద్దిపేట కలెక్టర్‌గా కే. హైమావతి, సంగారెడ్డి కలెక్టర్‌గా పి. ప్రవీణ్య నియమితులయ్యారు. రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శిగా లోకేశ్ కుమార్ ఎస్సీ అభివృద్ధి కార్యదర్శిగా జ్యోతి బుద్ధ ప్రకాశ్ రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ స్పెషల్ సెక్రెటరీగా రాజీవ్‌ గాంధీ హనుమంతు నియమితులయ్యారు.

విమానయాన చరిత్రలో ఘోర విషాదం..కారణం?

బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్…గత కొన్నేళ్లుగా అనేక సవాళ్లను ఎదుర్కుంటోంది. పలుమార్లు సాంకేతిక సమస్యలతో ప్రయాణికులను ఇబ్బంది పెట్టింది. N819AN రిజిస్ట్రేషన్ కోడ్ కలిగిన డ్రీమ్‌లైనర్ 25 రోజుల వ్యవధిలో అనేక సాంకేతిక సమస్యలతో ఇబ్బంది పెట్టింది. హైడ్రాలిక్ లీక్‌లు, సాంకేతిక లోపాల కారణంగా పలుమార్లు డైవర్ట్ అయింది, ఫలితంగా అనేక విమానాలు రద్దయ్యాయి.ప్రముఖ బోయింగ్ ఇంజనీర్లు కూడా బోయింగ్ 787, 777 మోడల్స్‌లో తయారీ లోపాలు ఉన్నాయని తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేశారు.

విమాన ప్రమాదంలో మృత్యుంజయుడు..! 11A సీట్‌ ప్రయాణికుడు రమేష్‌ ఒక్కడే బతికాడు..!

అహ్మాదాబాద్‌లో ప్రమాదానికి గురైన ఎయిర్‌ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్న అందరూ మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. కానీ, ఒక్క వ్యక్తి మాత్రం ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటినట్లు సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. విమానంలోని 11ఏ సీటులో కూర్చున్న ప్రయాణికుడు 38 ఏళ్ల విశ్వస్ కుమార్ రమేష్‌ ప్రమాదం జరిగిన తర్వాత సురక్షితంగా ప్రాణాలతో బయటపడి.. శిథిలాల నుంచి బయటికి నడుచుకుంటూ వస్తున్న వీడియో కూడా ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. రమేష్ బ్రిటీష్ పౌరుడు.

అది డొక్కు విమానం- కూలిపోయిన ఫ్లైట్ వీడియోను బయట పెట్టిన వ్యక్తి

అహ్మదాబాద్‌లో కుప్పకూలిన విమానంవల్ల వందల మంది చనిపోయారు. ఇప్పుడు ఆ విమానంలో లోపాలు ఉన్నాయన్న విమర్శలు వస్తున్నాయి. లండన్ కు బయలుదేరే ముందు ఆ విమానం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు వచ్చింది. అలా వచ్చినప్పుడు ఓ ప్రయాణికుడు విమానంలో లోపాలపై ఓ వీడియో తీశాడు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

హాస్టల్‌లో భోజనం చేస్తుండగా కూలిన విమానం.. 20 మంది డాక్టర్లు మృతి?

టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే విమానం మేఘానీలో ఉన్న ఓ వైద్య కళాశాల హాస్టల్‌పై పడింది. విమానంలోని ప్రయాణికులేకాకుండా భోజనం చేస్తున్న ఎంబీబీఎస్‌ విద్యార్థులు కూడా చనిపోయడం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. విమానం ఢీకొనడంతో విద్యార్థులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. భోజనం చేస్తుండగా ఆ భోజనం ప్లేట్లు బల్లలపై అలా పడి ఉన్నాయి. ఎంతో భవిష్యత్‌ కలిగిన దాదాపు 20 మందికి పైగా వైద్య విద్యార్థులు మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది.

విమాన ప్రమాదంలో ఇప్పటి వరకూ 133 మంది మృతి

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఇప్పటి వరకూ 133 మంది మృతిచెందినట్టు అధికారులు ప్రకటించారు. ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానంలో 169 మంది భారతీయులు.. 53 మంది బ్రిటన్ పౌరులు.. ఏడుగురు పోర్చుగల్, ఒకరు కెనడా పౌరుడు ఉన్నట్టు గుర్తించారు. ప్రమాదం నేపథ్యంలో ప్రయాణికుల సమాచారం కోసం 1800 5691 444 హెల్ప్‌లైన్ నెంబరు విమానం టేకాఫ్ అయిన వెంటనే పైలట్ అహ్మదాబాద్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు మేడే కాల్ ఇచ్చారు.

విమానం అలా ఎలా కూలిపోయింది ? విద్రోహ చర్య కారణమా ?

భారతదేశ విమానయాన చరిత్రలో పెద్ద ప్రమాదాల్లో ఒకటిగా అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్, విమానం కూలిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. అయితే అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం మాత్రం ఏవియేషన్ నిపుణుల్ని సైతం ఆశ్చర్య పరుస్తోంది. గాల్గోకి గాలి పటం ఎగిరిన తర్వాత ఒక్క సారిగా దారం తెగిపోతే గాలిపటం ఎలా ఫ్లాట్ గా వెళ్లి క్రాష్ అవుతుందో.. అచ్చంగా విమానం కూడా అలాగే కూలిపోయింది. అలా జరగడానికి ఎలాంటి కారణాలు ఉన్నాయన్న దానిపై నిపుణులు రకరకాల […]

గుజరాత్ లో కూలిన విమానం…. 242 మంది మృతి?

242 మంది ప్రయాణికులతో ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 అనే విమానం అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విమానంలో ఉన్న 242 మృతి చెంది ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు గుజరాత్‌ కు బయల్దేరారు. ప్రమాదంపై గుజరాత్‌ సిఎంకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్‌ చేసి ఆరా తీశారు. విమానంలో మాజీ సిఎం విజయ్‌ రూపానీ ఉన్నట్లు సమాచారం.

అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం..

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. మేఘాని ప్రాంతంలో ఎయిర్‌ ఇండియా విమానం కూలింది. విమానంలో చాలామంది ప్రయాణికులు ఉన్నారని పేర్కొంటున్నారు. ప్రమాదం తరువాత ఆకాశంలో దట్టమైన పొగ వ్యాపించింది. టేకాఫ్‌ కాగానే విమానం కుప్పకూలింది. సంఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు.. మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలో ఈ ఘటన జరిగింది. జనావాసాలపై విమానం కూలినట్లు చెబుతున్నారు. మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పుతున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON