loader

అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు.. జర్నలిస్ట్ కృష్ణంరాజు అరెస్ట్

అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో జర్నలిస్టు కృష్ణంరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. అమరావతిపైనా, మహిళలపైనా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కృష్ణంరాజుపై తుళ్లూరులో కేసు నమోదైంది. అయితే అప్పటి నుంచి ఆయన పరారీలో ఉన్నారు. ఆయన కోసం గాలిస్తున్న పోలీసులు.. విశాఖపట్నంలో అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి విజయవాడకు తరలిస్తున్నారు.

రెండో ర్యాంక్‌లోనే మంధాన

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం తాజాగా ప్రకటించిన ఐసిసి మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ క్రికెటర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన రెండో ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. మహిళల క్రికెట్‌లో మంధాన అత్యంత నిలకడైన బ్యాటింగ్‌ను కనబరుస్తున్న సంగతి తెలిసిందే. భారత్ విజయాల్లో మంధాన తనవంతు పాత్రను సమర్థంగా పోషిస్తోంది. ప్రత్యర్థి ఎవరైనా తన మార్క్ బ్యాటింగ్‌తో రాణించడం మంధాన అలవాటుగా మార్చుకోంది. తాజా ర్యాంకింగ్స్‌లో మంధాన 729 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది.

ఫస్ట్ క్లాస్, ఇంటర్‌లో అడ్మిషన్లు పొందిన వారికి…తల్లికి వందనం

రాష్ట్రంలో 67,27,164 మంది విద్యార్థులకు తల్లికి వందనం కింద రేపు నగదును ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. 1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో చేరే విద్యార్ధులకు పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. వీరికి సంబంధించిన వివరాలు అందగానే తల్లుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. ఈ మేరకు విధి విధానాలను ఖరారు చేస్తూ ఇవాళే జీవో విడుదల చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

తెలంగాణ కొత్త మంత్రులకు శాఖలు కేటాయింపు

ముగ్గురు తెలంగాణ కొత్త మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి శాఖలు కేటాయించారు. గడ్డం వివేక్ వెంకటస్వామికి కార్మిక, న్యాయ, క్రీడల శాఖను కేటాయించారు. వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక, కమర్షియల్ టాక్స్ శాఖలు కేటాయించారు. అడ్లూరి లక్షణ్ కు ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖను ఇచ్చారు. తన వద్ద ఉన్న పదకొండు శాఖల్లో కొన్నింటిని కొత్త మంత్రులకు కేటాయించే ప్రక్రియను పూర్తి చేశారు. సీఎం రేవంత్ వద్ద హోం, మున్సిపల్, విద్య వంటి కీలకమైన శాఖలు ఉన్నాయి.

ఇలాంటి సర్పంచ్ ప్రతీ గ్రామానికి ఉంటే అవార్డుల పంట

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముఖరా(కె) గ్రామం, ఆ గ్రామ పంచాయతీ ఆవిర్భావం నుండి అన్నింట్లో ప్రత్యేకతను చాటుకుంటూ ఆదర్శంగా నిలుస్తోంది. స్వయం సమృద్ధ గ్రామంగా అభివృద్ధి చెందుతోంది. అందుకు కారణం ఆ గ్రామ సర్పంచ్ గాడ్గే మీనాక్షి. రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలులో ఆదర్శంగా నిలిచి అనేక అవార్డులు సాధించిన ఘనత ఈ గ్రామానికే దక్కింది. జాతీయ స్థాయిలో ఖ్యాతిని పొందిన ఆ గ్రామం దేశంలోనే మొదటి డిజిటల్ ట్రీ ఆధార్ గ్రామంగా గుర్తింపును సొంతం […]

బెంగాల్‌లో కలకలం రేపుతున్న పోర్న్ టార్చర్ కేసు

పోర్న్ వీడియోల్లో నటించేందుకు అమ్మాయిని ట్రాప్ చేసి, టార్చర్ చేసిన కేసు కోల్ కతాలో సంచలనం రేపుతోంది. బాధితురాలు సోదేపూర్‌కు చెందినవారు. ఆర్యన్‌తో సోషల్ మీడియా ద్వారా పరిచయం అయింది. ఉద్యోగం ఇప్పిస్తానని ఆ యువతిని హౌరాలోని ఫ్లాట్‌కు తీసుకెళ్లారు. ఆర్యన్ ఖాన్, అతని తల్లి ష్వేతా ఖాన్ , సోదరి జోయా ఖాన్ ఆమెను 5-6 నెలల పాటు బంధించి పోర్న్ వీడియోలు చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. నిరాకరించడంతో ఇనుప రాడ్‌తో కొట్టి, సిగరెట్ లతో కాల్చి, […]

గురువారమే ఏపీలో తల్లికి వందనం

కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా గురువారం తల్లులకు కానుక గా తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సూపర్ సిక్స్ లో మరో ముఖ్యమైన హామీకి సిఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గురువారం తల్లికి వందనం నిధులు విడుదలకు కూటమి ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. 67 లక్షల మందికి తల్లికి వందనం కింద రేపు తల్లుల ఖాతాల్లో రూ. 8745 కోట్లు జమ చేస్తారు.

అబ్బాయిదే తప్పని తేల్చిన ఇండియా

హర్యానాకు చెందిన ఒక భారతీయ విద్యార్థి విమానాశ్రయంలో ఉన్న సమయంలో ఆ విద్యార్థి ప్రవర్తన సరిగా లేకపోవడంతో.. అధికారులు అతనికి సంకెళ్లు వేసి, నేలపై పడేసి నియంత్రించారు. న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ అధికారులు కూడా అమెరికా అధికారులతో సంప్రదింపులు జరిపారు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నించారు. ఈ సందర్భంగానే అబ్బాయిదే తప్పని తెలుసుకున్న MEA తాజాగా ఆ విషయాన్ని వెల్లడించింది.

వైఎస్ జగన్ పొదిలిలో ప్రభత్వానికి హెచ్చరిక

ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు బోర్డును సందర్శించిన జగన్ మోహన్ రెడ్డి పొగాకు రైతులతో మాట్లాడారు. వారు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్నారు. మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలో రైతులు పడుతున్న అవస్థలను ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. దీంతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు,రైతు పరిస్థితి ఎలా ఉండేది? అది ఏ విధంగా దిగజారింది అని చెప్పడానికి నిదర్శనం జిల్లాలో జరిగిన రైతుల ఆత్మహత్యలు. ఇకనైనా రైతుల సమస్యలపై స్పందించకపోతే కచ్చితంగా ఆందోళనలు ఇంకా ఉధృతం […]

గాలి జనార్ధన్ రెడ్డికి బెయిల్

మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు భారీ ఊరటనిచ్చింది. ఓబుళాపురం మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు తీర్పును సస్పెండ్ చేస్తూ బెయిల్ మంజూరు చేసింది. రూ.10 లక్షల పూచీకత్తుతో పాటు పాస్‌పోర్ట్ సరెండర్ చేయాలని ఆదేశించింది. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని షరతు విధించింది. గతంలో సీబీఐ కోర్టు గాలికి ఏడేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON