హడావుడి ఏర్పాట్లు, ప్రణాళిక లేని అధికారులు , పోలీసుల లాఠీఛార్జ్
అదుపులేని జనసమూహం, ప్రణాళిక లేని అధికారులు, లాఠీచార్జి – ఈ మూడు కారకాలు కర్ణాటకలో చారిత్రాత్మక వేడుకగా జరగాల్సిన సంబరాన్ని విషాదకరమైన తొక్కిసలాటగా మార్చాయి. బెంగళూరులో జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు మరణించిన తర్వాత IPL విజయోత్సవ వేడుక సంతాప సభగా మారిపోయింది. ఇంత పెద్ద విజయోత్సవాన్ని నిర్వహించినప్పుడు… సరైన భద్రతా చర్యలు తీసుకోవాలి, చిన్నస్వామి స్టేడియం వెలుపల క్రౌడ్ ఎలా పెరిగింది? భారీ జనసమూహాన్ని నిర్వహించడానికి ఎటువంటి ఏర్పాట్లు చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.