loader

హడావుడి ఏర్పాట్లు, ప్రణాళిక లేని అధికారులు , పోలీసుల లాఠీఛార్జ్

అదుపులేని జనసమూహం, ప్రణాళిక లేని అధికారులు, లాఠీచార్జి – ఈ మూడు కారకాలు కర్ణాటకలో చారిత్రాత్మక వేడుకగా జరగాల్సిన సంబరాన్ని విషాదకరమైన తొక్కిసలాటగా మార్చాయి. బెంగళూరులో జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు మరణించిన తర్వాత IPL విజయోత్సవ వేడుక సంతాప సభగా మారిపోయింది.  ఇంత పెద్ద విజయోత్సవాన్ని నిర్వహించినప్పుడు… సరైన భద్రతా చర్యలు తీసుకోవాలి, చిన్నస్వామి స్టేడియం వెలుపల క్రౌడ్ ఎలా పెరిగింది? భారీ జనసమూహాన్ని నిర్వహించడానికి ఎటువంటి ఏర్పాట్లు చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

రైతులపై జులుం- ఆ పోలీస్ సస్పెన్షన్

తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో ఒక వృద్ధ రైతు రెవెన్యూ సదస్సులో తన భూ సమస్యను చెప్పుకునేందుకు తహశీల్దార్ కార్యాలయానికి వచ్చాడు. అక్కడ విధులు నిర్వహిస్తున్న ASI రామచందర్, ఆ రైతును మెడ పట్టుకుని నిర్దాక్షిణ్యంగా తహశీల్దార్ ఛాంబర్ నుంచి బయటకు గెంటాడు.  ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. రాష్ట్ర మంత్రి సీతక్క ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ASI రామచందర్‌ను సస్పెండ్ చేశారు. ఈ సంఘటనపై విచారణ జరపాలని […]

బెంగళూరు తొక్కిసలాట.. ప్రధాని మోడీ తీవ్ర విచారం

ఆర్సీబి విజయోత్సవ పరేడ్ తీవ్ర విషాదాన్ని నింపింది. చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఇప్పటివరకు 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రధాని ప్రార్థించారు. హృదయ విదారకమంటూ బెంగళూరు తొక్కిసలాట ఘటనపై ప్రధానమంత్రి కార్యాలయం సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చోప్పున నష్ట పరిహారం […]

ఆర్‌టిసి ఐటిఐ కాలేజీల్లో ప్రవేశాలు

హైదరాబాద్, వరంగల్‌లోని ఆర్‌టిసి ఐటిఐ కాలేజీల్లో వివిధ ట్రేడ్‌లలో ప్రవేశాలకు ఆసక్తిగల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆర్‌టిసి సంస్థ సూచించింది. మోటార్ మెకానిక్ వెహికిల్, మెకానిక్ డిజిల్, వెల్డర్, పెయింటర్ ట్రేడ్‌లలో ప్రవేశాలు జరుగుతున్నాయని వెల్లడించింది. ఈ ట్రేడ్‌లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు కోరుకున్న టిజిఎస్ ఆర్‌టిసి డిపోల్లో అప్రెంటిషిప్ సౌకర్యం కల్పించన్నుట్లు అధికారులు వెల్లడించారు.

అమెరికాను వణికిస్తున్న డ్రాగన్ కంట్రీ అగ్రో టెర్రర్!

ఆగ్రోటెర్రరిజం.. ఒక దేశపు వ్యవసాయాన్ని చంపేయ్యడం. శత్రుదేశంలో ఆహార కొరతను సృష్టించి.. తద్వారా సామాజిక అశాంతిని పెంచడం.. ఇదీ లక్ష్యం. ఇందుకోసం వ్యవసాయ రంగంలోకి తెగుళ్ళు, వ్యాధులు, వ్యాధికారకాల్ని ఉద్దేశపూర్వకంగా ప్రవేశపెడతారు. అమెరికాలో ఇద్దరు చైనీయులు అరెస్టయ్యారు. ప్రమాదకరమైన ఫంగస్‌ను స్మగ్లింగ్ చేస్తున్నారన్నది అభియోగం. డేంజరస్ బయొలాజికల్ స్మగ్లింగ్‌ చేసి.. అగ్రో టెర్రరిజానికి పాల్పడ్డారా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.

ట్రాఫిక్‌లో చిక్కుకుంటే ప్రయాణీకులకు ఛార్జీల మోత..!

Rapido వినియోగదారులకు షాక్ ఇచ్చింది. Rapido కొత్త ఛార్జింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఇది ప్రయాణీకులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇప్పుడు మీ రైడ్ సమయంలో భారీ ట్రాఫిక్ ఉండి ప్రయాణం ఆలస్యం అయితే, దాని ఖర్చును కూడా మీరే భరించాలి. 10 నిమిషాల కంటే ఎక్కువ ట్రాఫిక్ ఆలస్యం అయితే నిమిషానికి రూ.0.50 అదనపు ఛార్జీ వసూలు చేయనున్నారు. దీని గరిష్ట పరిమితి రూ.30గా నిర్ణయించింది. ఈ నిర్ణయం పట్ల మహా నగరాల్లో రాపిడోపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఎట్టకేలకు దేశంలో జనగణన.. రెండు దశల్లో కులగణన,

గత కొన్నేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న జనగణనకు ఎట్టకేలకు మోక్షం లభించింది. దేశవ్యాప్తంగా జనగణనతోపాటు కులగణనను కూడా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కులగణనను మొత్తం రెండు దశల్లో నిర్వహించాలని చూస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం.. వచ్చే ఏడాది అక్టోబర్‌ 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా తొలి దశ కులగణన చేపట్టడానికి ప్లాన్ చేస్తుండగా.. 2027 మార్చి 1వ తేదీ నుంచి రెండో దశ కుల గణన చేయాలని కేంద్ర ప్రభుత్వ వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి.

ఆర్సీబీ విజయోత్సవ సభలో తొక్కిసలాట.. పది మంది దుర్మరణం

రాయల్ ఛాలెంజ్ బెంగళూరు (ఆర్సీబీ) విజయోత్సవ వేడుక 10 మంది ప్రాణాలను బలిగొంది. 18 సంవత్సరాల నిరీక్షణ తరువాత ఈ ఐపిఎల్‌లో ఈ జట్టుకు తొలిసారి ఈ విజయం దక్కింది. దీనితో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ స్థాయిలో విజయోత్సవ సభ ఏర్పాటు చేసింది. కన్నడ భాషాభిమానం పొంగిపొర్లే కర్నాటకలో ఈ సభకు వేలాదిగా జనం తరలివచ్చారు. అయితే సరైన ఏర్పాట్లు లేకపోవడం, జనం అత్యుత్సాహంతో పరిస్థితి అదుపు తప్పి, తొక్కిసలాటకు దారితీసిందని వెల్లడైంది.

ఉస్మానియా ఆస్పత్రి కోసం 31 ఎకరాల భూమి..

అఫ్జల్‌గంజ్‌లో ఉన్న ఉస్మానియా ఆస్పత్రిని.. గోషామహల్‌లో పోలీసు స్టేడియం ప్రాంతానికి తరలించాలని.. రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. స్టేడియానికి సంబంధించిన మొత్తం 43 ఎకరాల 37 గుంటల భూమి నుంచి.. ఉస్మానియా ఆస్పత్రి కోసం 31 ఎకరాల 39 గుంటలు కేటాయించారు అధికారులు. నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్.. ఉస్మానియా ఆస్పత్రి కొత్త బిల్డింగ్‌కు కేటాయించిన స్థలాన్ని మంగళవారం నాడు వైద్యశాఖకు అప్పగించారు.

నాపై ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా: పల్లె రఘునాథ్ రెడ్డి

దొంగే దొంగ అన్నట్లుగా గొడ్డుమర్రి ఆదినారాయణ అనే వ్యక్తిమా కంపెనీ భూములు అక్రమంగా అన్ లైన్ చేసుకొని తానేదో సత్యహరిచంద్రుడిలా మాట్లాడుతున్నాడు నాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు. గత 30 సంవత్సరాలుగా క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతున్నాను. ఏ మచ్చ లేకుండా ప్రజలకు, కార్యకర్తలకు నాకు తోచిన విధంగా సేవ చేస్తున్నా.. నాపై వస్తున్న ఆరోపణలు ఎవరైనా నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని ఏపీ మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON