ఐపీఎల్ 2025 విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
ఐపీఎల్ టోర్నమెంట్ ప్రారంభం నుంచి ఆడుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు తొలి ట్రోఫీ దక్కింది. ఉత్కంఠ రేకెత్తించిన ట్రోఫీ పోరులో పంజాబ్ కింగ్స్ పోరాడినా కూడా ట్రోఫీని ముద్దాడలేకపోయింది. ఆఖరి యుద్ధంలో హోరాహోరీగా తలపడినా పంజాబ్పై బెంగళూరు పైచేయి సాధించి ఐపీఎల్ 2025 ట్రోఫీని కైవసం చేసుకుంది. 18 ఏళ్లుగా తీరని కలగా ఉన్న ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుంది.

