loader

కాలమే బయటపెడుతుంది.. డైరెక్టర్ భార్య సంచలన పోస్ట్.

సమంత డైరెక్టర్ రాజ్ వీడియో వైరల్ కాగానే డైరెక్టర్  భార్య శ్యామలి కూడా ఒ పోస్ట్ పెట్టింది, కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది.. అలాగే కాలమే అన్నింటిని బయటపెడుతుంది.. కర్మ సిద్ధాంతం ఎప్పటికీ ఒక్కటే చెబుతుంది.. ఈ విశ్వం అన్నింటిని నిశితంగా గమనిస్తూ ఉంటుంది చూస్తూ ఉంటుంది. కాలమే అన్ని విషయాలను బయటపెడుతుంది.అనే  కొటేషన్ ని షేర్ చేయడంతో పాటు కర్మ నువ్వు ఏం ఇస్తావో నీకు అదే తిరిగి ఇస్తుంది అనే యాష్ ట్యాగ్ ని […]

డ్రోన్ దాడులతో విరుచుకుపడ్డ ఉక్రెయిన్..

రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకున్నాయి. రష్యాలోని వైమానిక స్థావరాలే లక్ష్యంగా ఉక్రెయిన్ పెద్దెత్తున డ్రోన్స్ దాడులకు పాల్పడింది. ఇంత భారీ మొత్తంలో ఉక్రెయిన్ దాడులకు పాల్పడటం కూడా ఇదే మొదటిసారి. 40 కి పైగా రష్యన్ విమానాలు ధ్వంసమయ్యాయని ఉక్రెయిన్ మీడియా పేర్కొంది. సైబీరియాలో తొలి డ్రోన్ దాడిని రష్యాలోని ఇర్కుట్స్క్ ప్రాంత గవర్నర్ ధృవీకరించారు. సైనిక విభాగాన్ని లక్ష్యంగా చేసుకున్నారని ఆయన అన్నారు. ఈ ముప్పును ఎదుర్కోవడానికి సైన్యం, పౌర చర్య దళాలు […]

వర్షం అడ్డంకితో మొదలుకాని మ్యాచ్..

ఐపీఎల్ 2025 క్వాలిఫైయర్ 2లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో తలపడుతోంది. టాస్ ఓడిన ముంబై ముందుగా బ్యాటింగ్ చేయనుంది. మ్యాచ్ మొదలయ్యే ముందు వర్షం అడ్డుపడింది. దీంతో మ్యాచ్ జరగడం ఆలస్యమవుతోంది.

మొదటి వారంలో ఏపీ, తెలంగాణ లాసెట్‌ పరీక్షలు..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని న్యాయ కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికిగానూ 3 ఏళ్ల LLB, 5 ఏళ్ల LLB, 2 ఏళ్ల LLM పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు జూన్‌ 5న లాసెట్‌-2025 పరీక్ష జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌ లాసెట్‌ 2025 అడ్మిట్‌ కార్డుల కోసం https://cets.apsche.ap.gov.in/ తెలంగాణ రాష్ట్రంలోని లా కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి లా కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌-2025 ప్రవేశ పరీక్ష ఈ నెల 6వ తేదీన ప్రవేశ పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష […]

ఎవరు ఆపదలో ఉన్నా 112కు ఫోన్ చేస్తే చాలు

భారత ప్రభుత్వం ప్రారంభించిన ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ అత్యవసర సేవల కోసం ఒకే నంబర్  112 అందుబాటులోకి తీసుకొచ్చారు  తెలంగాణ ప్రభుత్వం సైతం 112 వ్యవస్థ ఏర్పాటు ద్వారా మంచి ఫలితాలు అందుకుంటోంది. పోలీస్ (100), ఫైర్ డిపార్ట్‌మెంట్ (101), మెడికల్ (108), మహిళల కోసం (181), బాలల రక్షణ (1098), విపత్తుల నిర్వహణ (1077)  వంటి విభిన్న సేవలు 112కు కాల్ చేయడం ద్వారా అందుకోవచ్చు. ఏదైనా కాల్ రాగానే అన్ని వ్యవస్థలతో సమన్యయం […]

క్వాలిఫయర్-2 టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ ప్లేఆఫ్స్‌లో భాగంగా నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో (MI) జరుగుతున్న రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్(PBKS) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఫైనల్స్‌కు చేరాలని పంజాబ్ పట్టుదలతో ఉంది. పంజాబ్ జట్టులో ఈ మ్యాచ్‌లో కీలక మార్పు చోటు చేసుకుంది. స్పిన్నర్ యుజవేంద్ర చాహల్ జట్టులోకి వచ్చాడు. ముంబై కూడా జట్టులో ఒక మార్పు చేసింది. గ్లీసన్ స్థానంలో టాప్లేని జట్టులోకి తీసుకుంది.

మమతా సర్కార్ శాశ్వతంగా కూలిపోతుంది- అమిత్ షా

బెంగాల్ పర్యటనలో ఉన్న ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి అమిత్ షా మాట్లాడుతూ, 2026 లో మమతా బెనర్జీ ప్రభుత్వం శాశ్వతంగా కూలిపోతుందని అన్నారు. “సుభేందు అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడినప్పుడల్లా దీదీ భయపడుతుంది. ఎన్నికల్లో మమతా బెనర్జీ హింసకు పాల్పడుతున్నారని అమిత్ షా ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదని అన్నారు. హింస లేకుండా ఓటు వేయండి, మీరు వాస్తవాన్ని అర్థం చేసుకుంటారు” అని అమిత్ షా పిలుపునిచ్చారు.

పల్నాడు జిల్లా లో ఫిట్ ఇండియా మెగా సైక్లింగ్ ఈవెంట్

భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఫిట్ ఇండియా ఉద్యమంలో భాగంగా ఎర్త్ హీరో ఫౌండేషన్ వారి భాగస్వామ్యంతో స్థానిక స్వచ్ఛంద సేవా సంస్థ హ్యాండ్స్ ఆఫ్ కంపాషన్ మరియు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో  నరసరావుపేట మున్సిపల్ స్టేడియం నుంచి ఒక్క గంట పాటు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆనంద్, డిఎస్డివో నరసింహారెడ్డి, విద్యార్థులు పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేసినారు

రింకూ సింగ్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన ప్రియా సరోజ్..

టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. ఐపీఎల్ రాణించి టీమిండియాకు ఎంపికైన రింకూ సింగ్ సమాజ్‌వాదీ పార్టీ ఎంపీగా లోక్‌సభకు ఎన్నికైన ప్రియా సరోజ్ ల నిశ్చితార్థం జూన్ 8న లక్నోలో ఘనంగా నిర్వహించేందుకు ఇరు కుటుంబాలు ప్లాన్ చేశాయి. ఎంగేజ్‌మెంట్ అనంతరం నాలుగు నెలలకు వారణాసిలో నవంబర్ 18న రింకూ సింగ్, ప్రియా సరోజ్ వివాహ బంధంలోకి అడుగుపెడతారు. వారణాసిలోని తాజ్ హోటల్‌లో వీరి వివాహం జరగనుంది.

అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్ పార్క్..

అమరావతిలో క్వాంటం వ్యాలీ పార్క్ ఏర్పాటుకు ఏపీ ఐటీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎంఓయూలను ర్యాటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్కును అగ్రశ్రేణి ఐటీ సంస్థలు టీసీఎస్, ఎల్ అండ్ టీ , ఐబీఎం నిర్మాణం చేపట్టనున్నాయి. క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్క్ నిర్మాణానికి ఈ మూడు సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. క్వాంటం కంప్యూటింగ్ పార్కులో అధునాతన 156 క్యూబిట్ క్వాంటం సిస్టం 2 ను […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON