loader

సెల్ఫ్ డ్రైవ్‌ చేసుకుంటూ యజమానికి ఇంటికి చేరిన కారు

డ్రైవర్‌లెస్‌ కారు కల సాక్షాత్కారమైంది. ఓ కారు దానికదే పూర్తి స్థాయిలో సెల్ఫ్‌ డ్రైవింగ్‌ చేస్తూ రోడ్ల మీద పరుగులు పెట్టింది. అమెరికాకు చెందిన టెస్లా మొట్టమొదటి సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కారు రోడ్ల మీద పరుగులు పెట్టిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘టెస్లా మోడల్‌ వై’ పేరుతో డ్రైవర్‌లెస్‌ కారును తాయరు చేసింది. ఈ కారు కేవలం 30 నిమిషాల్లోనే హైవేలు, ట్రాఫిక్‌ సిగ్నళ్లు దాటుకుంటూ యజమాని ఇంటికి దానికదే డెలివరీ అయింది.

కెప్టెన్ కూల్ ట్రేడ్‌మార్క్ కోసం దరఖాస్తు చేసుకున్న ఎంఎస్ ధోని..!

మహేంద్ర సింగ్ ధోని గురించి మాట్లాడుకుంటే.. ప్రతిఒక్కరికి మరో పేరు గుర్తొస్తుంది. అదే “కెప్టెన్ కూల్”. మ్యాచ్ పరిస్థితి ఎలా ఉన్నా.. తాను కూల్‌గా, చాలా బాలెన్స్ గా కెప్టెన్సీ చేసేవాడు. అందుకే కెప్టెన్ కూల్ అని అందరూ పిలుస్తారు. తాజాగా ఈ పేరు కోసం ధోని ట్రేడ్‌మార్క్ దరఖాస్తు చేసుకున్నాడు. జూన్ 5న ఈ దరఖాస్తు ట్రేడ్ మార్క్స్ రిజిస్ట్రీ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో సమర్పించినట్లు తెలుస్తోంది. ఈ పదంపై హక్కులను అధికారికంగా పొందాలనుకుంటున్నట్లు ధోని […]

అర్థరాత్రి నుంచి అమల్లోకి కొత్త ఛార్జీలు!

కొత్త రైల్వే ఛార్జీలు, టికెట్ బుకింగ్ నిబంధనలు ఈ అర్థరాత్రి నుంచి అమలులోకి వస్తాయని ప్రకటించింది. తత్కాల్ టికెట్ల బుకింగ్‌పై ఆధార్ తప్పని సరి చేసిన రైల్వేశాఖ. సెకండ్ క్లాస్ ఆర్డినరీకి 500 కి.మీ వరకు సాధారణ ఛారీలే ఉండనున్నాయి. 501 కి.మీ నుంచి 1500 కి.మీ వరకు టికెట్‌పై రూ.5, 1501 కి.మీ నుంచి 2500 కి.మీ వరకు టికెట్‌పై రూ.10; 2501 నుంచి 3వేల కి.మీ వరకు టికెట్‌పై రూ.15 చొప్పున పెంచారు.

బనకచర్లపై ఏపీ ప్రభుత్వానికి కేంద్రం షాక్

బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కేంద్రం ఏపీ సర్కార్‌కు షాక్ ఇచ్చింది. పర్యావరణ అనుమతులు ఇచ్చేందుకు నిరాకరించింది. గోదావరి-పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టు పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిన ప్రాథమిక రిపోర్టును పరిశీలించిన కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ పలు అంశాలపై అభ్యంతరాలును వ్యక్తం చేసింది. బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేమని .. ప్రాజెక్టుపై అనేక అభ్యంతరాలు వచ్చాయని తెలిపింది. పర్యావరణ అనుమతులకు సెంట్రల్ వాటర్ కమిషన్‌ను సంప్రదించడం అత్యవసరమని ఏపీకి సమాచారం ఇచ్చింది.

అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ యూజీ, పీజీ నోటిఫికేషన్‌

హైదరాబాద్‌లో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ.. 2025-26 విద్యా సంత్సరానికి సంబంధించి యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆగస్టు 13వ తేదీలోను అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చు. కోర్సులకు సంబంధించిన అర్హతలు, ఫీజుల వివరాలు,ప్రవేశాలకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు అధికారిక వెబ్‌సైట్‌ www.braouonline.in, www.braou.ac.in లో చెక్‌ చేసుకోవచ్చు.

ట్రంప్ బిగ్ రిలీఫ్.. రెమిటెన్స్ టాక్స్ ఇక ఒక శాతమే..!

అమెరికాలో ఉంటున్న భారతీయులకు ఇది నిజంగా శుభవార్త. వారు మన దేశంలోని తమ కుటుంబాలకు పంపే డబ్బుపై పన్ను భారం తగ్గింది. మొదట 5 శాతంగా ప్రతిపాదించిన రెమిటెన్స్ ట్యాక్స్ ఇప్పుడు కేవలం 1 శాతం మాత్రమే ఉండనుంది. ఈ పన్ను తగ్గింపు అందరికీ వర్తించదు. కొన్ని ప్రత్యేక పద్ధతుల్లో డబ్బు పంపేవారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. కేవలం మనీ ఆర్డర్, క్యాషియర్ చెక్ వంటి పద్ధతుల ద్వారా పంపే డబ్బుకు మాత్రమే ఒక శాతం పన్ను […]

అమ్మ కోసం పసివాడి తపన.. కలెక్టర్ ఆఫీసుకు వచ్చిన పదేళ్ల బాలుడు..

యశ్వంత్ అనే నాలుగో తరగతి విద్యార్థి గుంటూరుజిల్లా కలెక్టర్ ఆఫీసులో జరిగిన గ్రీవెన్స్ డే వచ్చాడు. జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశాడు. వేరే వాళ్లు మా టిఫిన్ బండిని ఖాళీ చేసేశారు. కాలువలో పడేశారు. బండి పెట్టనివ్వడం లేదు. ఆఫీసులకు చాలాసార్లు తిరిగాం. అందుకోసమే మా అమ్మ కోసం నేను వచ్చా. అమ్మ చచ్చిపోదాం అంటోంది.. మా నాన్న పట్టించుకోవడం లేదు. అందుకోసమే నేను వచ్చా. టిఫిన్ బండి పెట్టుకోవడానికి మాకు స్థలం ఇప్పించండి […]

అమరావతిని దక్షిణాసియాలోనే తొలి క్యాంటమ్ వ్యాలీగా మారుస్తాం..

సీఎం చంద్రబాబు సాంకేతిక విప్లవం రెండో చాప్టర్ క్యాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ అని, ప్రజారాజధాని అమరావతిని దక్షిణాసియాలోనే మొట్టమొదటి క్యాంటమ్ వ్యాలీగా మారుస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ ద్వారా వచ్చే ఐదేళ్లలో లక్ష ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. ఈ సమావేశం దేశంలో అత్యుత్తమ క్వాంటమ్ మేధావుల సమావేశం మాత్రమే కాదు. దేశంలో ఓ కీలక మలుపు కానుందిని లోకేష్‌ అన్నారు.

ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం.. బీజేపీకి రాజీనామా!

గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచల నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ఆయన ప్రకటించారు. రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి ఎమ్మెల్యే రాజాసింగ్ అందజేశారు. బీజేపీ అధ్యక్ష పదవికి తన సిఫార్సు చేసిన అభ్యర్థిని పార్టీ నాయకత్వం పరిగణనలోకి తీసుకోకపోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో ఆయన, పార్టీని వీడేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

కారులో ఇద్దరు యువకుల మృతదేహాల కలకలం..

తిరుపతి సమీపంలోని తిరుచానూరు లో కారు అనుమానాస్పదంగా కనిపించడంతో దగ్గరకు వెళ్లి చూశారు.. లోపల ఇద్దరు యువకుల మృతదేహాలు ఉన్నట్లు గుర్తించారు. కారులో ప్రాణాలు కోల్పోయిన యువకుల్ని తిరుచానూరుకు చెందిన వినయ్, దీలీప్‌గా గుర్తించారు.. వారిద్దరు అన్నదమ్ములని సమాచారం. పోలీసులు ఇద్దరి మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ కోసం ఆస్పత్రికి తరలించారు కారులోపల యువకుల మృతదేహాలు ఉంటే.. కారు బయట నుంచి పూర్తిగా కవర్ కప్పి ఉండటం అనుమానాలకు తావిస్తోంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON