loader

బెంగళూరు తొక్కిసలాట కేసులో కమిషనర్ నుంచి స్టేషన్ ఇంచార్జ్ వరకు సస్పెండ్

RCB విజయోత్సవ పరేడ్ తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన చర్యలు తీసుకున్నారు. “కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్, స్టేషన్ హౌస్ మాస్టర్, స్టేషన్ హౌస్ ఆఫీసర్, ACP, సెంట్రల్ డివిజన్ DCP, క్రికెట్ స్టేడియం ఇన్‌ఛార్జ్, అదనపు పోలీస్ కమిషనర్, పోలీస్ కమిషనర్లను తక్షణమే సస్పెండ్ చేశాం.” అని, RCB ప్రతినిధి, KCSA ప్రతినిధిని వెంటనే అరెస్టు చేయాలని రాష్ట్ర DG, IGP లకు ఆదేశించారు.

కోటి చెట్లను నాటే కార్యక్రమానికి శ్రీకారం

‘పర్యావరణాన్ని పరిరక్షించడం అందరి బాధ్యత కావాలి. స్వచ్చాంధ్ర లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. చెట్లను పెంచని వారు స్వచ్ఛమైన గాలిని ఆశించడం సమంజసమా? పర్యావరణాన్ని కాపాడటంలో దేశానికే ఆదర్శంగా ఏపీని తీర్చిదిద్దుతాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం  సందర్భంగా తుళ్లూరు మండలం అనంతవరంలో చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు.

మావోయిస్టు పార్టీ అగ్రనేత సుధాకర్‌ మృతి!

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో గురువారం (జూన్‌ 5) మారోమారు భద్రతా దళాలు ఎన్‌కౌంటర్‌ నిర్వహించాయి. ఈ దాడిలో మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్‌ మృతి చెందారు. ఆయనపై రూ.40 లక్షల రివార్డు ఉంది. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరంకి చెందిన సుధాకర్‌ అలియాస్‌ సింహాచలం.. 40 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో కీలకంగా పని చేస్తున్నారు.

తొక్కిసలాట ఘటన.. ఆర్సీబిపై కేసు నమోదు

బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టుపై కేసు నమోదైంది. ఈ ఘటనలో పదకొండు మంది అభిమానులు ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 50 మంది గాయపడ్డారు.  ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. ఈ క్రమంలో ఆర్సిబీ జట్టుతోపాటు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్(KSCA), విక్టరీ పరేడ్.. విజయోత్సవ వేడుకను నిర్వహించిన DNA నెట్‌వర్క్స్ పై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇథనాల్ ఫ్యాక్టరీ రగడలో 57 మంది రైతులపై కేసులు

జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం, పెద్ద ధన్వాడ గ్రామ సమీపంలో 35 ఎకరాల్లో గాయత్రి ఇథనాల్ కంపెనీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళన కేసులో 57 మంది రైతులపై కేసులు నమోదు చేశారు. అందులో 12 మంది రైతులను గురువారం రిమాండ్‌కు తరలించగా 40 మంది రైతులు పరారీలో ఉన్నారని, 5 మందికి నోటీసులు ఇవ్వడం జరిగిందని పోలీసులు తెలిపారు.

రేపట్నుంచే మెగా డీఎస్సీ ఆన్‌లైన్‌ పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!

శుక్రవారం (జూన్‌ 6) నుంచి ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభంకానున్నాయి. డీఎస్సీ పరీక్షలకు మొత్తం 154 పరీక్ష కేంద్రాలను ఏర్పాట్లు చేశారు. రోజుకు రెండు షిఫ్టుల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి.  పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని డీఎస్సీ కన్వీనర్‌  ప్రకటించారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు 90 నిమిషాలు ముందే చేరుకోవాలని సూచించారు. ఎవరికైనా హాల్‌టికెట్‌లో ఫొటో లేకపోతే.. అటువంటి అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి రెండు ఫొటోలు […]

12 దేశాల పౌరులకు అమెరికాలో నో ఎంట్రీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్​ మరో సంచలనం నిర్ణయం తీసుకున్నారు. 12 దేశాల పౌరుల రాకపై అమెరికాలో నిషేధం విధించినట్లు పేర్కొన్నారు.మరో ఏడు దేశాలపై పాక్షిక నిషేధం విధించారు. పూర్తిగా నిషేధం విధించిన దేశాలు: ఆఫ్ఘనిస్థాన్, బర్మా, చాద్, రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో, ఈక్వటోరియల్ గినీ, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమెన్, ఎరిత్రియా, పాక్షిక నిషేధం విధించిన దేశాలు: బురుండి, క్యూబా, లావోస్, టోగో, తుర్కిమిస్థాన్ వెనిజలా, సియెర్రా లియోన్.

టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తున్నటీమ్.. ‘వీరమల్లు’ వాయిదా?

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ భయపడినట్లుగానే ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. జూన్ 12న రావాల్సిన ఈ చిత్రం వెనక్కి వెళ్తున్నట్లు టాలీవుడ్ కోడై కూస్తోంది.ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ రద్దుతో పాటు టికెట్ డబ్బులు తిరిగి ఇస్తున్నారన్న వార్తలతో రిలీజ్ వాయిదా ఖాయమని ప్రచారం జరుగుతోంది. రిలీస్ పోస్ట్‌పోన్ అవుతున్నట్లు ఇంత ప్రచారం జరుగుతున్నా నిర్మాత కనీసం స్పందించకపోవడాన్ని చూస్తుంటే వాయిదా కన్ఫామ్ అని తెలుస్తోంది.

తెలంగాణ టెట్ పరీక్ష తేదీలు విడుదల

టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ పరీక్షల తేదీలను విద్యాశాఖ ప్రకటించింది. ఈ నెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. టెట్ పరీక్షలను 9 రోజుల్లో 16 సెషన్స్‌ల్లో జరుగుతాయని, మెదటి సెషన్ పరీక్ష ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, రెండో సెషన్ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ తెలిపింది.

మందగించిన రుతుపవనాలు మళ్ళీ ఎండ వేడి

సాధారణంగా జూన్‌ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు ప్రబలంగా ప్రవేశించి దేశం అంతటా వర్షాలు కురవడం జరుగుతుంది. అయితే ఈ ఏడాది ఈ రుతుపవనాలు కొంత ముందుగానే దక్షిణాంధ్రను తాకినప్పటికీ, అనూహ్యంగా నెమ్మదించిపోయాయి. కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు 38 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకుంటున్నాయని వెల్లడించారు. ఈ నెల 10వ తేదీ తర్వాతే రుతుపవనాల్లో మళ్లీ కదలిక వచ్చి, అవి చురుగ్గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON