loader

మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయిలాండ్ బ్యూటీ..

థాయిలాండ్‌కి చెందిన సుందరీమణి ఒపల్ సుచత మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకుంది. హైటెక్స్ లో జరిగిన మిస్‌ వరల్డ్‌ 2025 ఫైనల్స్ లో మిస్‌ థాయ్‌లాండ్ ను విజేతగా ప్రకటించారు. మిస్‌వరల్డ్ ఫైనల్స్ లో ఇథియోపియా, థాయిలాండ్, పోలాండ్, మార్టినిక్ సుందరీమణులు నిలిచారు. వీరిలో థాయిలాండ్ అందగత్తె కిరీటాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు.. రూ. 8.5 కోట్ల ప్రైజ్‌మనీని కూడా అందుకుంది.

అంగన్‌వాడీ టీచర్లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

తెలంగాణ ప్రభుత్వం అంగన్ వాడీ టీచర్ల రిటైర్ మెంట్ బెనిఫిట్స్ ను రూ. లక్ష నుంచి రూ. 2 లక్షలకు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే హెల్పర్ల రిటైర్ మెంట్ బెనిఫిట్స్ రూ. 50వేల నుంచి రూ. లక్షకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 60 ఏళ్లు దాటి వీఆర్ఎస్ తీసుకునే టీచర్లు, హెల్పర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్తిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో 70వేల మందికి లబ్ధి చేకూరనుంది.

మిస్‌ వరల్డ్ పోటీల్లో ఇండోనేషియా యువతికి బ్యూటీ విత్ ఎ పర్పస్ అవార్డు

హైదరాబాద్‌లో జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ ఫైనల్‌లో బ్యూటీ విత్ ఎ పర్పస్ అవార్డును ఇండోనేషియాకు చెందిన మోనికా కెజియా సెంబిరింగ్ గెలుచుకుంది. “పైప్‌లైన్ ఫర్ లైఫ్‌లైన్” అనే ప్రాజెక్ట్ ద్వారా ఇండోనేషియాలోని పేద వర్గాలకు పరిశుభ్రమైన నీరు, మెరుగైన పారిశుద్ధ్యాన్ని అందిస్తుందీ మోనికా. అత్యంత ప్రాథమిక అవసరమైన సురక్షితమైన నీటిని అందివ్వడంలో ఆమె చొరవ చూపారు. అవసరంలో ఉన్నవారికి ఆరోగ్యం, గౌరవాన్ని ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

డీఎస్సీ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ వాట్సాప్‌లోనే ఈజీ!

ఏపీ డీఎస్సీ హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ వాట్సాప్ ద్వారా సులభంగా చేసుకోవచ్చు. 95523 00009 నెంబర్‌కు వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్‌ చేయండి. మీకు రిప్లై వస్తుంది. అందులో సేవలు ఎంచుకోండి అని ఉంటుంది. అందులో విద్యాశాఖను ఎంచుకోండి. అక్కడ హాల్‌టికెట్లు అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేస్తే మీకు ఏపీ డీఎస్సీ 2025 అని వస్తుంది. దానిపై క్లిక్ చేసి ఆధార్ కార్డు నెంబర్, పుట్టిన తేదీ, సంవత్సరం టైప్ చేసి సబ్‌మిట్‌ చేస్తే మీ […]

కల్వకుంట్ల ఆర్ట్స్ బ్యానర్ కాంగ్రెస్ దర్శకత్వంలో చార్ పత్తా

కాంగ్రెస్ దర్శకత్వంలో BRS కొత్త సినిమా మొదలైయ్యిందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కల్వకుంట్ల ఆర్ట్స్ పతాకంపై కాంగ్రెస్ పార్టీ దర్శకత్వంలో కల్వకుంట్ల కవిత ప్రధాన పాత్రధారిగా ‘చార్ పత్తా’ సినిమాను నడిపిస్తోందన్నారు. ఇదంతా కాంగ్రెస్ ఆడుతున్న డ్రామా అన్నారు సంజయ్. ఇందులో కేసీఆర్ ను జోకర్ గా మార్చారని, కవిత ఎపిసోడ్ తో ప్రజలకు ఏమైనా మేలు జరుగుతోందా? మీడియా కూడా ఆలోచించాలన్నారు.

టెన్త్ క్లాస్ వ్యాల్యుయేషన్‌లో ప్రభుత్వ వైఫల్యం: బొత్స

మూడు రోజులు కడపలో టిడిపి మహానాడు డ్రామా అని మాజీ మంత్రి, వైసిపి నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఏడాదిలో ఏం చేశారో చెప్పుకోలేక ప్రజలను టిడిపి నేతలు మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. టెన్త్ క్లాస్ వ్యాల్యుయేషన్‌లో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని, 1650 మంది రీవ్యాల్యుయేషన్‌ చేయించుకున్నారని, ప్రభుత్వ చర్యలతో విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని బొత్స చురకలంటించారు. గతంలో 500 మంది కంటే ఎక్కువ విద్యార్థులు రీవ్యాల్యుయేషన్‌ చేయించుకున్న దాఖలు లేవన్నారు.

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఫేషియల్‌ రికగ్నిషన్‌ కెమెరాలు..

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో నేరగాళ్లకు చెక్ పెట్టేందుకు రైల్వేశాఖ అత్యాధునిక ‘ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలను’ ఏర్పాటు చేయనుంది. సికింద్రాబాద్ స్టేషన్‌లో, ఈ అధునాతన నిఘా వ్యవస్థ అందుబాటులోకి రానుంది. నేరాల దర్యాప్తులో నేరగాళ్ల కదలికలు అత్యంత కీలకం. నేరం చేసినవారు లేదా నేరచరిత్ర ఉన్నవారు రైల్వేస్టేషన్ల ద్వారా పారిపోయేందుకు ప్రయత్నిస్తే, వారిని గుర్తించి పట్టుకోవడంలో ఈ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయి.

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త ఆఫీస్ ప్రారంభం..

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత వ్యవహారం సంచలనంగా మారింది. కవిత, కేసీఆర్‌కు రాసిన లేఖతో వివాదం మొదలు కాగా..కవిత వ్యాఖ్యలపై తెలంగాణ రాజకీయాల్లో వాడీవేడీ చర్చ జరుగుతుంది. ఆమె పార్టీ మారుతుందంటూ జోరుగా ప్రచారం సాగుతున్న వేళ..కల్వకుంట్ల కవిత సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్త ఆఫీసు ప్రారంభించింది. జాగృతి కార్యకలాపాలు నిర్వహించేందుకు గాను ఈ ఆఫీసును వినియోగించనున్నారు. ఆమె తన నివాసం పక్కనే కొత్త జాగృతి కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.

3 నెలల పెన్షన్ ఒకేసారి తీసుకోవచ్చు: చంద్రబాబు

ముమ్మిడివరం నియోజకవర్గం చెయ్యేరులో పేదల సేవలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. మాది పేదల కోసం పని చేసే ప్రభుత్వమని, పేదలకు ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు చేపడుతున్నామని 64 లక్షల మందికి ఒకటో తేదీనే పెన్షన్లు ఇస్తున్నామని, ఏ రాష్ట్రంలోనూ ఇంతలా పెన్షన్లు ఇవ్వడం లేదని తెలియజేశారు. ఇప్పటికే 90 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేశామని, 3 నెలల పెన్షన్ ఒకేసారి తీసుకోవచ్చని  చంద్రబాబు నాయుడు సూచించారు.

నేడే మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే

72వ మిస్ వరల్డ్ పోటీలు చివరి దశకు వచ్చేశాయి. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల్లో ఇవాళ గ్రాండ్ ఫినాలే జరగనుంది. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా ప్రారంభం కానున్న గ్రాండ్ ఫినాలే ప్రత్యక్ష ప్రసారం కానుంది. మొత్తం 108 మంది పాల్గొన్న ఈ పోటీలకు సంబంధించి ఇవాళ జరగనున్న గ్రాండ్ ఫినాలే బరిలో 16 మంది నిలిచారు. అందం-ఐక్యత లక్ష్యంగా జరుగుతున్న పోటీల తుది వేడుకలు

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON