loader

పంజాబ్ ను చిత్తు చేసి దర్జాగా ఫైనల్‌లో RCB

ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్‌లో RCB పంజాబ్ కింగ్స్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి 9 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు అడుగుపెట్టింది. బెంగళూరు (RCB) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ (PBKS) పూర్తిగా విఫలమైంది. జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్ మరియు భువనేశ్వర్ కుమార్ లాంటి బౌలర్లు కట్టుదిట్టమైన లైన్లు వేసి పంజాబ్ బ్యాటింగ్‌ను కుదిపేశారు. 102 పరుగుల లక్ష్యాన్ని RCB సునాయాసంగా ఛేదించింది. ఫిల్ సాల్ట్ అర్ధశతకం […]

గద్దర్ ఫిలిం అవార్డులపై స్పందించిన అల్లు అర్జున్, ఎన్టీఆర్..

గద్దర్ అవార్డులపై స్పందించారు నటుడు అల్లు అర్జున్. ఉత్తమ నటుడిగా ఎంపిక చేయడం గౌరవంగా భావిస్తున్నాఅంటూ ట్వీట్‌ చేశారు.తెలంగాణ ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు. తనకు అవార్డు రావడం వెనుక క్రెడిట్‌ అంతా సుకుమార్, నిర్మాతలదే అన్నారు . గద్దర్ అవార్డును అభిమానులకు అంకితం చేస్తున్నా అన్న అల్లు అర్జున్‌…అభిమానులు చూపించే ప్రేమ, మద్దతు.. తనలో స్ఫూర్తిని నింపుతూనే ఉంటాయన్నారు. అలాగే గద్దర్‌ అవార్డులకు ఎంపి అయిన అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు మ్యాన్ ఆఫ్ […]

మావోయిస్టులకు మరో భారీ షాక్… కీలక నేత హిడ్మా అరెస్ట్…

మావోయిస్టు కీలక నేత కుంజం హిడ్మా పోలీసులకు చిక్కాడు. మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో ఉన్న హిడ్మాను ఒడిశా పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. పెట్‌గూడ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టు శిబిరాన్ని చుట్టుముట్టడానికి బృందం ముందుకు సాగుతుండగా…మావోయిస్టులు పోలీసు సిబ్బందిపై కాల్పులు జరిపి అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. తర్వాత జరిగిన సోదాల్లో మావోయిస్టు నేత కుంజం హిడ్మా సమీపంలోని పొదల్లో దాక్కునేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

మీరే విమర్శించి.. మీరే అవార్డులు ఇస్తారా’..బీజేపీ సంచలన పోస్ట్

తెలంగాణ బీజేపీ తన సోషల్ మీడియా ఎక్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. ఇటీవల జరిగిన సంధ్యా థియేటర్ ఘటనలో కూడా అల్లు అర్జున్ తీరుపై కాంగ్రెస్ నాయకులు విమర్శలు గుప్పించారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా సాహసం చేసిన పాత్రకు అవార్డు ఇవ్వడం, అంతేకాకుండా పోలీసుల ఊచకోతకు కారణమైన నక్సల్ నేపథ్యం ఉన్న గద్దర్ పేరుతో అవార్డులు ప్రకటించడంపై బీజేపీ పరోక్షంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

సోషల్ మీడియాలోట్రోలింగ్, అభ్యంతరకర పోస్టులు.. హైకోర్టు కీలక ఆదేశాలు

సోషల్ మీడియాలో అసభ్యకర, విద్వేషపూరిత వ్యాఖ్యలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి పదజాలం వాడకుండా ఆటో బ్లాకింగ్ విధానం తీసుకురావాలని ప్రభుత్వానికి సూచించింది. రాజకీయ నేతలు, ప్రముఖులపై ట్రోల్స్‌ను నియంత్రించాలని, పౌరుల గౌరవానికి భంగం వాటిల్లకుండా చూడాలని కోర్టు పేర్కొంది. ఈ మేరకు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు తగిన సూచనలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఆర్టీసీ బస్సులో సీటు కొట్టుకున్న స్త్రీ, పురుషులు..

ఆర్టీసీ బస్సులో సీట్ల కోసం కొట్టుకున్న మహిళలు, పురుషులు.. ఈ ఘటన వికారాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా పరిగి నుంచి వయా నస్కాల్ మీదుగా వికారాబాద్ వెళ్లే ఆర్టీసి బస్సులో సీట్ల కోసం పురుషులు, మహిళలు కొట్టుకున్నారు… పరిగి నుంచి వికారాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు ఎక్కువ ఉండడంతో దొరికిన ఒక్క సీటు కోసం ఒకరినొకరు కొట్టుకున్నారు.

అదే పనిగా పెళ్లి చేసుకుని మరీ కేస్ పెట్టించుకుంటారు..

హైదరాబాద్‌లో ఎక్కడ డ్రగ్స్ ముఠాలు పట్టుబడిన వారి మూలలు మాత్రం ఒక నైజీరియన్ వద్దనే ఉంటున్నాయి. 50 మందికి పైగా నైజీరియన్లను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసి ఉంటారు. ఇప్పటివరకు పదిమందికి పైగానే నైజీరియన్లను హైదరాబాద్ నుండి డిపోర్ట్ చేశారు. హైదరాబాద్ వదిలి ఉండకుండ ఉండేలాగా వ్యూహాలు పన్నుతున్నారు. ఇక్కడే ఒక యువతిని పెళ్లి చేసుకుని, ఆమె చేత హరాస్మెంట్ కేస్ పెట్టించి ఇక్కడి జైల్లోనే ఉండేలాగా చర్యలకు పాల్పడుతున్నారు. కేసులు ఉండటంతో వారి డిపోర్టేషన్ ప్రక్రియ […]

ఆధార్ తరహాలోనే ఇప్పుడు ప్రతి ఇంటికీ డిజిటల్ ఐడీ..?

ఆధార్‌ కార్డు భారతదేశంలోని ప్రతి పౌరుడికి ఒక అధికారిక గుర్తింపు. ఇది అందరికీ తప్పనిసరి. కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేయబోతున్నట్లు తెలుస్తోంది. దేశంలోని ప్రతి చిరునామాకు (అడ్రస్) ఒక ప్రత్యేకమైన డిజిటల్ ఐడీని (డిజిటల్ అడ్రస్) కేటాయించే కొత్త వ్యవస్థను తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇళ్లు, స్థలాలను మరింత కచ్చితత్వంతో, వేగంగా గుర్తించేందుకు ఈ ప్రత్యేక డిజిటల్ ఐడీ ఉపయోగపడుతుంది. ప్రధాన లక్ష్యం ఏంటంటే, తమ చిరునామా వివరాల వినియోగానికి సంబంధించిన అధికారం.. స్పష్టంగా […]

నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు..

వైఎస్ఆర్ కడప జిల్లాలో మహానాడు ముగిసిన అనంతరం టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు కడప నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లనున్నారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో సీఐఐ ఏజీఎం సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. అనంతరం ఈనెల 31న ఢిల్లీ నుంచి నేరుగా రాజమహేంద్రవరం వెళ్లనున్నట్లు తెలుస్తోంది. డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం గున్నేపల్లిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటారు.

అతి త్వరలో POKను స్వాధీనం చేసుకుంటాం.. రక్షణ మంత్రి

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌‌పై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కడి ప్రజలు మనవాళ్లే అని అన్నారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ప్రజలు భారత్‌లో విలీనం కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. అతి త్వరలో POKను స్వాధీనం చేసుకుంటామని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. పీఓకేలో నివసిస్తున్న మన సోదరుల పరిస్థితి ధైర్య యోధుడు మహారాణా ప్రతాప్ తమ్ముడు శక్తి సింగ్ లాంటిదని, ఆపరేషన్‌ సింధూర్‌తో పాకిస్తాన్‌ లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశామని రాజ్‌నాథ్‌సింగ్‌ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON