loader

మైసూర్ శాండల్ సోప్… కర్ణాటకలో రచ్చ

కర్ణాటక ప్రభుత్వం మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాను మైసూర్ శాండల్ సోప్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించించింది. ఈ నియామకం కర్ణాటకలోని కన్నడ సంఘాలు, స్థానిక నటీనటులు, సోషల్ మీడియా వినియోగదారుల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. కన్నడ రక్షణ వేదిక (KRV) వంటి కన్నడ సంస్థలు ఈ నిర్ణయాన్ని “కన్నడ వ్యతిరేక” చర్యగా, “స్థానిక ప్రతిభకు అవమానం”గా అభివర్ణించాయి.

కూకట్‌పల్లిలో ఓ డాక్టర్‌కు కరోనా పాజిటివ్

ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాచింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా వేగంగా కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో సైతం కోవిడ్ కలకలం చెలరేగింది. హైదరాబాద్‌లోకి కూకట్‌పల్లిలో ఓ డాక్టర్‌కు కరోనా సోకింది. దీంతో అప్రమత్తంగా ఉండాలని.. ప్రజలు మాస్కులు ధరించాలని వైద్యారోగ్య శాఖ సూచించింది. రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌, ఎయిర్‌పోర్టుల్లో.. సోషల్‌ డిస్టెన్స్, మాస్క్ తప్పనిసరి అని హెచ్చరిస్తోంది. విదేశాల నుంచి వచ్చినవారు తప్పనిసరిగా కొవిడ్ టెస్ట్ చేయించుకోవాలని సూచిస్తోంది.

కవిత మరో షర్మిల కాబోతుందా?…రఘునందన్ రావు

కల్వకుంట్ల కవిత రాసినట్టుగా చెబుతున్న లేఖ పై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ… కల్వకుంట్ల కవిత మరో వైఎస్ షర్మిల కాబోతుందనే అనుమానం కలుగుతుందని చెప్పారు. అయితే ప్రస్తుత పరిణామాలు కల్వకుంట్ల కుటుంబ పంచాయితీనా?, రాజకీయ వారసత్వ పంచాయితీనా?, ఆస్తుల పంచాయితీనా? తెలియాల్సి ఉందన్నారు. ‘మే 2వ తేదీన కవిత రాసిన లేఖ ఆమె అమెరికాలో ఉన్నప్పుడు ప్రజలలో ఎందుకింత చర్చనీయాంశంగా మారింది?. బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీలో తన రాజకీయ వారసుడి కేటీఆర్ అని కేసీఆర్ […]

మృత్యువు ముంగిట 14 వేల మంది చిన్నారులు

ఇప్పటికే గజాను అన్ని వైపులా నిర్బంధించిన ఇజ్రాయిల్ పరిమిత స్థాయిలో మాత్రమే మానవతా సాయానికి అనుమతిస్తుంది. దీంతో ఆ ప్రాంతంలో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. ఈ పరిస్థితిపై స్పందించిన ఐక్యరాజ్య సమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మానవతా సాయం అందకుండా చేస్తే మరో 48 గంటల్లో 14 వేల మంది చిన్నారులు మరణించే ప్రమాదం ఉందంటూ హెచ్చరించింది.

పానీపూరీ అమ్ముతూ ఇస్రోలో జాబ్ కొట్టిన రాందాస్‌..

పానీ పూరీ అమ్ముతూ జీవనం సాగించే ఒక యువకుడు ఇస్రోలో ఉద్యోగం సంపాదించాడు. ఓ పేద కుటుంబంలో జన్మించిన రాందాస్ పట్టుదల, దృఢ సంకల్పం, ఆత్మవిశ్వాసంతో కష్టపడి ఇస్రోలో టెక్నీషియన్ ఉద్యోగం సాధించారు. తండ్రి డోంగర్గావ్ జిల్లా పరిషత్ పాఠశాలలో ప్యూన్ గా పనిచేసి ఇటీవలే పదవీ విరమణ చేశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా రాందాస్ పగటిపూట పానీపూరీ అమ్ముతూ.. రాత్రిపూట చదువుకుని తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు.

ప్రకాశంజిల్లా కొమరోలు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం- ఆరుగురు మృతి

ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్లమోటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. బాపట్ల జిల్లా స్టూవర్టపురం వాసులు మహానంది వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. భక్తులు ఉన్న కారు లారీని ఢీ కొట్టడంతో దుర్ఘటన జరిగింది. 8 మంది మహానంది వెళ్లి వస్తుండగా లారీని ఢీ కొట్టారు ఈ దుర్ఘటనలో స్పాట్‌లోనే ఆరుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

జాక్‌పాట్ కొట్టిన బెంగళూరు, పంజాబ్..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో లీగ్ దశ చివరి దశకు చేరుకుంది. ప్లేఆఫ్స్‌కు చేరుకునే 4 జట్లు నిర్ణయమైంది. గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు మొదటి నాలుగు స్థానాల్లో తమ స్థానాన్ని నిర్ధారించుకున్నాయి. ఇప్పుడు టాప్-2లో నిలిచే పోరాటం తీవ్రమైంది. దీనిలో ఆర్‌సీబీ, పంజాబ్ కింగ్స్ జట్లకు పెద్ద అవకాశం ఉంది.

ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడటం కామన్.. మహిళా నిర్మాత

సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం గురించి ముఖ్యంగా మలయాళ ఇండస్ట్రీలో డ్రగ్స్ గురించి ఎక్కువగా వినిపిస్తున్నాయి. మలయాళ సినీ పరిశ్రమలో డ్రగ్స్ వాడకం గురించి నిర్మాత, నటి సాండ్రా థామస్ తీవ్రమైన ఆరోపణలు చేసారు. ఆమె ఒక ఇంటర్వ్యూలో, సినీ సెట్స్‌లో డ్రగ్స్ వాడకం సర్వసాధారణమైనదని, దీని కోసం ప్రత్యేక బడ్జెట్, ప్రత్యేక గదులు కూడా కేటాయిస్తున్నారని ఆరోపించారు.

నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి ..

నేషనల్ రాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నిందితులుగా ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే ఈ కేసులో తెలంగాణ సీఎం రేవంత్ తో పాటు కొంత మంది కాంగ్రెస్ నేతల పేర్లను కోర్టుకు సమర్పించిన ఛార్జ్ షీట్ లో ఉన్నాయి. అయితే వీరిని నిందితులుగా చేర్చలేదు. ప్రస్తుత తెలంగాణ సీఎం, అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, పవన్‌ బన్సల్, అహ్మద్‌ పటేల్‌ ప్రలోభ పెట్టారని ఈడీ తన చార్జిషిట్‌లో […]

రద్దీగా ఉండే ప్రదేశాలలో మాస్క్ ధరించాలి…

భారతదేశంలో కోవిడ్ -19 కేసుల పెరుగుదల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. రద్దీగా ఉండే ప్రదేశాలలో ప్రజలు మాస్క్ ధరించడం తప్పనిసరి అని పేర్కొంది. జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి లక్షణాలను ఎవరైనా ఎదుర్కొంటే.. వారు సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించాలని తెలిపింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON