మైసూర్ శాండల్ సోప్… కర్ణాటకలో రచ్చ
కర్ణాటక ప్రభుత్వం మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాను మైసూర్ శాండల్ సోప్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించించింది. ఈ నియామకం కర్ణాటకలోని కన్నడ సంఘాలు, స్థానిక నటీనటులు, సోషల్ మీడియా వినియోగదారుల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. కన్నడ రక్షణ వేదిక (KRV) వంటి కన్నడ సంస్థలు ఈ నిర్ణయాన్ని “కన్నడ వ్యతిరేక” చర్యగా, “స్థానిక ప్రతిభకు అవమానం”గా అభివర్ణించాయి.