loader

కేసీఆర్‌కు కవిత సంచలన లేఖ..! ఉలిక్కిపడ్డ బీఆర్ఎస్ శ్రేణులు..!

కేసీఆర్ కు కవిత రాసిన ఆరు పేజీల లేఖ వెలుగులోకి వచ్చింది. అంతర్గత విభేదాలు, కుటుంబ రాజకీయాలు, పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత లభించడం లేదని, కేవలం కేటీఆర్‌కు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని, పార్టీలోని అంతర్గత రాజకీయాలపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నేను కూడా బీజేపీ వల్ల చాలా ఇబ్బంది పడ్డాను డాడీ.. బీజేపీని ఇంకొంచెం టార్గెట్ చేయాల్సిందేమో డాడీ అని కవిత లేఖలో పేర్కొన్నారు.

తమిళనాడు లిక్కర్ స్కాంలో ఈడీ దర్యాప్తు నిలిపివేత

తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (TASMAC) కేసులో ED పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈడీ అన్ని హద్దులు దాటిందని సుప్రీం కోర్టు, ప్రధాన న్యాయమూర్తి B.R. గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. టాస్మాక్ అనేది ప్రభుత్వ కార్పొరేషన్ అని.. ఒక కార్పొరేషన్‌పై క్రిమినల్ కేసు ఎలా నమోదు చేయవచ్చుని ED ప్రతినిధి అడిషనల్ సొలిసిటర్ జనరల్ S.V. రాజును ప్రశ్నించారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ నుంచి మరో 3 వేల మంది అవుట్ : YS షర్మిల సంచలన ఆరోపణలు

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో మరో మూడు వేల మందిని విధుల నుంచి తొలగించేందుకు రంగం సిద్ధమవుతుందని అన్నారు ఏపీపిసిసి చీఫ్ YS షర్మిల. కార్మికుల పక్షాన దీక్ష చేయడం నేరమా అన్న షర్మిల షర్మిల అసలు స్టీల్ ప్లాంట్లో ఏం జరుగుతుందో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తెలుసా అని ప్రశ్నించారు.

జనసేన ఎమ్మెల్యేకు ముప్పు….

ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజును జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. 10 రోజుల పాటు ఎలాంటి పర్యటనలు చేయొద్దని పోలీసులు కోరారు. ఎమ్మెల్యేను కలిసేందుకు ఎవరూ రావొద్దని….ఫోన్‌లోనే సంప్రదించాలని ఎమ్మెల్యే కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

కెసిఆర్‌తో ముగిసిన హరీష్ రావు భేటీ..

మాజీ సిఎం, బిఆర్ఎస్ అధినేత కెఆర్‌తో హరీష్ రావు భేటీ ముగిసింది. కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో వరుసగా రెండో రోజు హరీశ్ రావు ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కెసిఆర్ తో సమావేశమయ్యారు. గురువారం కెసిఆర్ తో హరీశ్ రావు మూడున్నర గంటల పాటు సమావేశమయ్యారు. కాళేశ్వరం కమిషన్ నోటీసులపైనే ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. నోటీసులు వచ్చాక విషయంపై ఆలోచిద్దామని హరీశ్ కు కెసిఆర్ చెప్పినట్లు సమాచారం.

రైతుల కోసం పవనన్న ప్రత్యేకంగా ఒప్పించారు.. మంత్రి నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. యువగళం పాదయాత్ర సందర్భంగా ఏనుగుల విధ్వంసంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని పలమనేరు ప్రాంత రైతన్నలు నా దృష్టికి తెచ్చారు. రైతాంగం ఇక్కట్లను తొలగించేందుకు పవనన్న ప్రత్యేకంగా చొరవచూపి కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించారు. ఏపీ అవసరాలకు మరిన్ని కుంకీ ఏనుగులు ఇస్తామని హామీ ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వానికి కూడా నా కృతజ్ఞతలు’ అంటూ ట్వీట్ చేశారు.

లిక్కర్ స్కాం కేసుపై వైఎస్ జగన్ రియాక్షన్…

తొలిసారిగా లిక్కర్‌ కేసుపై స్పందించారు. తమ ప్రభుత్వంలో లిక్కర్ స్కాం జరిగేందుకు ఆస్కారమే లేదు అని వివరణ ఇచ్చారు. ‘లిక్కర్‌ అమ్మకాలు పెరిగితే లంచాలు ఇస్తారు,వైసీపీ హయాంలో లిక్కర్‌ అమ్మకాలు తగ్గాయి, మద్యం తయారీ సంస్థలు నష్టపోయాయి. నష్టపోయినప్పుడు మద్యం సంస్థలు లంచాలు ఎందుకిస్తాయి. మద్యం విక్రయాలు ప్రైవేటుకి ఇస్తే లంచాలు ఇస్తారు. మా హయాంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపింది’అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ తెలిపారు. లిక్కర్‌ కుంభకోణాలు ఇప్పుడు టీడీపీ చేస్తోంది అని […]

ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ రాకెట్ బేస్‌లో అగ్నిప్రమాదం..

టెక్సాస్‌లోని స్పేస్‌ఎక్స్ మెక్‌గ్రెగర్ పరీక్షా కేంద్రం బుధవారం భారీ పేలుడుతో దద్దరిల్లింది. ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ ఎక్స్‌ టెక్సాస్‌ మెక్‌గ్రెగోర్ బేస్‌లో రాకెట్ ఇంజిన్ టెస్టింగ్ సమయంలో భారీ పేలుడు సంభవించింది. ఆక్సిజన్, మీథేన్ గ్యాస్ లీక్ కావడంతో మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చింది. అగ్నిప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డు కాగా, క్షణాల్లో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై చక్కర్లు కొట్టాయి.

జగన్ వార్నింగ్‌కి ఒక్క నవ్వుతో సమాధానం ఇచ్చిన పవన్

మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్‌సీపీ నేతల సమావేశంలో కూటమి ప్రభుత్వం, అధికారులకు ఇచ్చిన వార్నింగ్‌‌ అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గర మీడియా ప్రతినిధులు ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ మాత్రం ఒక్క నవ్వుతో సమాధానం ఇచ్చారు.. చివర్లో చూద్దాం అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

నాంపల్లి కోర్డుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తనపై నమోదైన ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసుల విచారణకు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు రెండోసారి వ్యక్తిగతంగా హాజరయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రిజర్వేషన్లపై ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి హైదరాబాద్, నల్గొండ, మెదక్ జిల్లాల్లో మూడు కేసులు నమోదయ్యాయి. తాను నిర్దోషినని, పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని రేవంత్ రెడ్డి తాజాగా వాంగ్మూలం ఇచ్చారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON