టీటీడీలో కీలక నియామకాలు
టీటీడీ ప్రస్తుత వైఖానస ఆగమ సలహా కమిటీని రద్దుచేసి, కొత్త కమిటీని నియమించింది. ఐదుగు రు సభ్యులతో కూడిన కొత్త వైఖానస ఆగమ సలహా కమిటీని ఏర్పాటు చేసారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు ఎ.ఎస్.శ్రీ కృష్ణ శేషాచలం దీక్షితులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.పరాశరం భవనారాయణాచార్యులు, చెన్నైకు చెందిన పీ.కే.వరదన్ భట్టాచార్యార్, అర్చకులు ఏ.అనంత శయన దీక్షితులు, మాజీ అర్చకులు ఏ.ఖద్రీ నరసింహాచార్యులను నూతన ఆగమ సలహా కమిటీలో సభ్యులుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.