loader

మానవాళికే ముప్పుగా పాక్‌

ఉగ్రవాదాన్ని పెంచి పోషించే సుదీర్ఘ చరిత్ర కలిగిన పాకిస్థాన్‌ మానవాళికే ముప్పుగా మారిందని ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ప్రకటించారు. ప్రపంచ దేశాలకు కేంద్ర ప్రభుత్వం పంపుతున్న అఖిల పక్ష ప్రతినిధి బృందాల సభ్యుడిగా అంతర్జాతీయ సమాజానికి తాను ఇచ్చే సందేశ సారాంశం ఇదేనని శనివారం పీటీఐ వీడియోస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒవైసీ వెల్లడించారు.

సూపర్‌బెట్‌ చాంప్‌ ప్రజ్ఞానంద

భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ ఆర్‌ ప్రజ్ఞానంద..సూపర్‌బెట్‌ క్లాసిక్‌ టోర్నీలో విజేతగా నిలిచాడు. గ్రాండ్‌ చెస్‌ టూర్‌లో భాగంగా జరిగిన టోర్నీలో ప్రజ్ఞానంద తొలిసారి టైటిల్‌ దక్కించుకున్నాడు. ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన టోర్నీలో ఈ చెన్నై చిన్నోడు టైబ్రేక్‌ ద్వారా టైటిల్‌ను ఒడిసిపట్టుకున్నాడు. విజేతను నిర్ణయించేందుకు జరిగిన టైబ్రేక్‌లో ప్రజ్ఞానంద..ఫిరౌజాతో గేమ్‌ను డ్రా చేసుకోగా, వాచిర్‌ లాగ్రేవ్‌తో ఫిరౌజా డ్రా చేసుకున్నాడు. ఆఖరి గేమ్‌లో వాచిర్‌ను ఓడించడం ద్వారా ప్రజ్ఞానంద విజేతగా నిలిచి 66 లక్షల ప్రైజ్‌మనీని సొంతం […]

ఆపరేషన్ సిందూర్‌పై రాహుల్ ట్వీట్ దుమారం..

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేయడానికి ముందు.. కేంద్రం పాకిస్తాన్‌కు సమాచారం ఇచ్చినట్లు ఆరోపిస్తూ రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలకు తెరతీశారు. ఆపరేషన్‌కు ముందు పాకిస్తాన్‌కు సమాచారం ఇచ్చిందని జైశంకర్ బహిరంగంగా చెప్పారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

తెలంగాణలో భారీగా మావోయిస్టులు అరెస్ట్… ఆయుధాలు స్వాధీనం

తెలంగాణలోని ములుగు జిల్లాలో పోలీసులు నిషేధించబడిన CPI (మావోయిస్ట్) సంస్థకు చెందిన 20 మంది సభ్యులను అరెస్టు చేసారు. వీరివద్ద పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారని అధికారులు శనివారం తెలిపారు. కర్రెగుట్ట కొండల్లో తలదాచుకున్న మావోయిస్టు కేడర్లు ‘సిఆర్ఫిఎఫ్, ఛత్తీస్‌గఢ్ పోలీసుల సంయుక్త కార్యకలాపాల కారణంగా చిన్న చిన్న గుంపులుగా చెల్లాచెదురుగా పారిపోతున్నారనే నిఘా సమాచారం మేరకు ఈ అరెస్టులు జరిగాయి.

భారత్ క్షిపణి దెబ్బలు తిన్నాం

పాక్ ప్రధాని షెహబాజ్ ఒప్పుకోలు: ఇటీవలి ఆపరేషన్ సిందూర లో భాగంగా తమ దేశం భారతదేశపు క్షిపణుల దాడిలో తమ కీలక వైమానిక స్థావరాలు ధ్వంసమైనట్లు పాకిస్థాన్ అంగీకరించింది. దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తొలిసారిగా శనివారం ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్ క్షిపణుల దెబ్బ భరించాల్సి వచ్చిందని, తమ దేశ కీలక వైమానిక స్థావరాలు ధ్వంసం అయ్యాయని ఆయన తెలిపారు. .

సత్యం చెప్పలేని సమాజం: సుప్రీం కోర్టు

సామాజిక వ్యవహారశైలిలో కొట్టోచ్చే మార్పు చోటు చేసుకుంది. ఈ క్రమంలో పౌరులు అత్యధిక సంఖ్యలో ఎక్కడా సత్యం వైపు నిలబడటం లేదని సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ఇది ఇప్పటి సత్యం అయితే ఇది ఆవేదనాయుతం అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 2017 లో జరిగిన భివాండి కార్పొరేటర్ (కాంగ్రెస్) మనోజ్ మహత్రే హత్యోదంతంలో కేసువిచారణ క్రమంలో ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి.

ప్రధాని మోడీతో మంత్రి లోకేశ్ భేటీ..

ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యారు. భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌తో కలిసి శనివారం న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ‘యువగళం’కాఫీ టేబుల్ బుక్‌‌ని ఆవిష్కరించి, మొదటి ప్రతిని అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాని ఆశీస్సులు, మార్గదర్శకత్వం కావాలని, రాష్ట్ర పురోగతికి ప్రధానమంత్రి అందించిన నిరంతర మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON