loader

సునీల్ గ‌వాస్క‌ర్‌కు బీసీసీఐ లో ప్ర‌త్యేక‌ బోర్డ్ రూమ్

భారత క్రికెట్ చరిత్రలో ఓ గొప్ప క్షణం చోటుచేసుకుంది. దిగ్గజ బ్యాట్స్‌మన్ సునీల్ గ‌వాస్క‌ర్‌కు బీసీసీఐ అరుదైన గౌరవం అందించింది. ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో ‘10,000 గవాస్కర్’ పేరిట ఓ ప్రత్యేక బోర్డు రూమ్‌ను ప్రారంభించారు. ఈ గదిని పూర్తిగా గవాస్కర్ జీవిత ప్రయాణం ఆధారంగా రూపొందించారు.గదినంతా గవాస్కర్ ఫొటోలు, భారత జట్టు విజయాల ట్రోఫీలు అలంకరించబడ్డాయి.

టర్కీ కంపెనీలపై భారత్ కొరడా..

ముంబై విమానాశ్రయంలో సుమారు 70% గ్రౌండ్ ఆపరేషన్లను నిర్వహిస్తున్న టర్కీ కంపెనీ సంస్థ సెలెబీ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్‌కు, భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ భద్రతా అనుమతులను రద్దు చేసింది. ఈ చర్య, జాతీయ భద్రతా అంశాలను పరిగణనలోకి తీసుకుని తీసుకున్నట్లు మంత్రి మురళీధర్ మొహొల్ తెలిపారు. సంస్థలో టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ కుమార్తె సుమేయే ఎర్డోగాన్‌కు పాక్షిక వాటాలు ఉన్నట్లు సమాచారం. ఆమె భర్త సెల్కుక్ బైరక్టార్, పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఉపయోగించిన బైరక్టార్ డ్రోన్లను తయారు […]

అవేం కుదరవన్న సీబీఐ కోర్టు…

ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో ఏ2గా ఉన్న గాలి జనార్దన్ రెడ్డికి సీబీఐ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష ఖరారు చేయడంతో ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలులో ఉన్నారు. తనకు జైలులో ప్రత్యేక వసతులు కల్పించాల్సిందిగా గాలి జనార్దన్ రెడ్డి సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే దోషులుగా తేలిన వ్యక్తులు ఎటువంటి ప్రత్యేక కేటగిరీ ఉపశమనం పొందేందుకు అర్హులు కారని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. గాలి జనార్దన్ రెడ్డి పిటిషన్‌ను తోసిపుచ్చింది.

ప్రైవేటు లాడ్జిలో అనుమానాస్పదంగా ఇద్దరు మహిళలు..

టెంపుల్ సిటీకి గంజాయి చేర్చుతున్న ముఠాలపై తిరుపతి జిల్లా పోలీసు యంత్రాంగం నిఘా పెంచింది. గంజాయి స్మగ్లింగ్‌పై మరింత ఫోకస్ పెట్టింది. రేణిగుంట రైల్వే స్టేషన్ సమీపంలోని ఎస్‌బీఎస్ లాడ్జిలో రూమ్ నెంబర్ 207 లో ఉన్న ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకొని విచారించారు. వారి వద్ద నుంచి రెండు సూట్ కేసులలో దాచిన 24.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితురాళ్లు వెస్ట్ బెంగాల్‌కు చెందిన మమోని ముండాల్, సమిత ముండాల్‌ ను కోర్టులో హాజరుపరిచి […]

గాజాలో ఇప్పటివరకు వేలమంది పాలస్తీనియన్లు మృతి

గాజాలో మళ్లీ బాంబులతో దద్దరిల్లింది. గురువారం జరిగిన Israel వైమానిక దాడుల్లో దక్షిణ గాజా ఘోరంగా దెబ్బతిన్నది. పాలస్తీనా వైద్య వర్గాల సమాచారం ప్రకారం, ఈ దాడుల్లో కనీసం 80 మంది మరణించారు. మరో అనేక మంది గాయపడినట్టు పేర్కొన్నారు.దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరం లక్ష్యంగా దాడులు జరిగాయి. అక్కడే 54 మంది మరణించారు, అందులో మహిళలు, చిన్నారులూ ఉన్నారు.ఇది అధికారికంగా నాసర్ ఆసుపత్రి విడుదల చేసిన వివరాల్లో చెప్పబడింది.

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఈ మేరకు బదిలీలు, పోస్టింగ్‌లకు సంబంధించి ఉత్తర్వులు, మార్గదర్శకాలను జారీ చేశారు. ఈ నెల 16 నుంచి జూన్ 2 వరకు బదిలీలపై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. ఐదేళ్లు ఒకే చోట పనిచేసిన ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేస్తారు. కొన్ని ప్రత్యేక కారణాలు ఉంటే బదిలీల నుంచి మినహాయింపు కూడా ఉంటుంది.

IPL కోసం.. PSLకు హ్యాండిచ్చిన ఫారిన్ ప్లేయర్స్

బీసీసీఐతో విభేదించి ఐపీఎల్‌తో పాటు PSLను ప్రారంభించిన PCB భారత దాడి భయంతో పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)ను నిలిపివేసిన పీసీబీకి విదేశీ ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడం పెద్ద తలనొప్పిగా మారింది. ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ ఓవెన్ పంజాబ్ కింగ్స్ తరపున, కుశాల్ మెండిస్ గుజరాత్ టైటాన్స్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం, కుశాల్ మెండిస్ కూడా భారతదేశానికి వస్తే, అది పాకిస్తాన్ లీగ్‌కు పెద్ద దెబ్బ అవుతుంది. దీని వల్ల ఫ్రాంచైజీకి, పీసీబీకి నష్టాలు రానున్నాయి.

నడ్డా ఆదేశంతో వెనక్కి తగ్గిన కంగన

భారతదేశంలో ఆపిల్ ఉత్పత్తుల విస్తరణ వద్దని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తాను పెట్టిన పోస్ట్ ను బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ తొలగించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా వ్యక్తిగతం గా ఫోన్ చేయడంతో తాను పోస్ట్ ను తొలగించినట్లు కంగనా తెలిపారు. ఆపిల్ సంస్థ భారతదేశంలో విస్తరించడం పట్ల ట్రంప్ ఎందుకు కంగారు పడుతున్నారంటూ రనౌత్ ఆ పోస్ట్ లో వ్యాఖ్యానించారు.

టికెట్ల ధరలను అధ్యయనం చేయడానికి కమిటీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ల ధరలను అధ్యయనం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో ఈ కమిటీ పనిచేస్తుంది. ఈ కమిటీలో ఐదుగురు సభ్యులు ఉంటారు. ప్రస్తుతం థియేటర్లలో టికెట్ల ధరలు ఎలా ఉన్నాయి, న్యాయపరమైన సమస్యలు ఏమిటి అనే విషయాలను కమిటీ పరిశీలిస్తుంది. ప్రజలకు అందుబాటులో ఉండే ధరల్లో టికెట్లు ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది.

గోవింద నామాలపై ర్యాప్ పాడటం దారుణం

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి, పుత్తలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్ దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. గోవింద నామాలపై ర్యాప్ సాంగ్ పాడటాన్ని తీవ్రంగా ఖండించారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని, వెంటనే వీడియోను తొలగించి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON