loader

భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ దాడుల్లో 100 మంది వరకు ఉగ్రవాదులు హతం!

ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా ఉగ్రవాదుల స్థావరాలను భారత బలగాలు ధ్వంసం చేశాయి. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దాడుల్లో దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతం అయ్యారని తెలుస్తోంది. మంగళవారం అర్ధరాత్రి తరువాత పాకిస్తాన్, పీఓకేలోని 9 జేషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులు చేయడం తెలిసిందే. జేషే మహ్మద్ గ్రూపునకు చెందిన కీలక ఉగ్రవాద స్థావరాలను భారత బలగాలు దాడి చేసి నాశనం చేశాయి.

ఆపరేషన్ సింధూర్: తొలి ఫొటో బయటకు వచ్చింది

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడి చేసి నాశనం చేయడంలో భారత్ విజయం సాధించింది. భారత వైమానిక దాడికి సంబంధించిన మొదటి చిత్రం ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ చిత్రంలో వైమానిక దాడి తర్వాత గాయపడిన జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు కనిపిస్తోంది.

ఉగ్రస్థావరాలపై దాడులు.. దేశంలో పలు విద్యాసంస్థలకు సెలవు..!

ఆపరేషన్‌ సింధూర్‌తో అలర్ట్‌ అయిన పాక్‌ సరిహద్దులో కాల్పుల విరమణకు పాల్పడింది భారత్‌ ,పాక్‌ పరస్పర కాల్పుల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్‌లోని అన్ని పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, బారాముల్లా, కుప్వారా, గురేజ్‌లోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు ఈ రోజు మూసివేస్తున్నట్టుగా ప్రకటించారు. జమ్మూ, సాంబా, కథువా, రాజౌరి, పూంచ్ జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలను స్వచ్ఛందంగా మూసివేశారు. పఠాన్‌కోట్‌లోని అన్ని పాఠశాలలను 72 గంటలపాటు మూసివేస్తున్నట్లు ప్రకటించారు.

ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. ఉత్తర భారతదేశంలో పలు రాష్ట్రాల్లో విమానాశ్రయాలు మూసివేత

పాకిస్తాన్, భారత్ మధ్య పెరిగిన ఉద్రిక్తతలతో బుధవారం ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాలలోని విమానాశ్రయాలు మూసివేయనున్నారు. ధర్మశాలతో పాటు లేహ్, జమ్మూ, శ్రీనగర్, అమృత్‌సర్‌తో సహా పలు విమానాశ్రయాలు తదుపరి నోటీసు వచ్చే వరకు మూసివేసి ఉంటాయని స్పైస్ జెట్ ఎయిర్‌లైన్స్ ఒక పోస్ట్‌లో తెలిపింది. శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, లేహ్, చండీగఢ్, ధర్మశాలకు వెళ్లేవారు, అక్కడి నుండి బయలుదేరే విమాన సేవలు అందుబాటులో లేవని విమానాశ్రయానికి చేరుకునే ప్రస్తుత స్థితిని తనిఖీ చేసుకోవాలని విమానయాన సంస్థలు […]

శత్రు దేశం నిద్రపోకుండా విధ్వంసం సృష్టించిన SCALP క్షిపణి

రాఫెల్ తో పాటు స్కాల్ప్‌ క్షిపణులు కూడా పాకిస్తాన్‌పై జరిగిప ఆపరేషన్ సింధూర్‌లో కీలకపాత్ర పోషించాయి. స్కాల్ప్ (SALP) అంటే ఒక డీప్ స్ట్రైక్ క్రూజ్ క్షిపణి. ఇది గాలిలో నుంచి భూమిపై దాడులు చేస్తుంది. శత్రు భూభాగంలోకి చొచ్చుకుపోయి మరి లక్ష్యాన్ని ఛేదించగల అద్భుతమైన క్షిపణి అని చెప్పొచ్చు. గగనతలంలో ఉంటూ ఉగ్రవాద స్థావరాలపై అటాక్‌ చేసే సామర్థ్యం దీనికి ఉంది. మొత్తంగా 300 కిలోమీటర్ల వరకు ఇది ప్రయాణించి శత్రువును నాశనం చేసే సమర్థత […]

భారత్ మెరుపు దాడులపై పాక్ ప్రధాని స్పందన..

భారత ఆనందాన్ని వాళ్లకు విషాదంలా మారుస్తామని పాకిస్థాన్ పేర్కొంది. భారత్ ఆర్మీ ప్రతీకార దాడులపై పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ స్పందించారు. భారత్ మా దేశంలోని ఐదు ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. భారత్ దీనికి భారీ మూల్యం చెల్లించుకుంటుందని బీరాలు పలికాడు. పాక్ ప్రధాని ప్రకటన తర్వాత సరిహద్దు వెంట పూంఛ్, రాజైరి సెక్టార్లలోని పాకిస్థాన్ సైన్యం కాల్పలు స్టార్ట్ చేసింది. మరోవైపు భారత్ కూడా కాల్పులు మొదలుపెట్టింది. భారత్ – పాకిస్థాన సరిహద్దు ఎల్ […]

పాక్‌పై మెరుపు దాడులు.. నిరంతరం పర్యవేక్షించిన ప్రధాని మోదీ

పహల్గాం ఘటనకు ప్రతీకారంగా భారత్ ఆర్మీ పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై అర్ధరాత్రి వైమానిక దాడులు చేసిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సింధూర్‌ను ప్రధాని మోదీ రాత్రంతా పర్యవేక్షించారు. వార్‌రూమ్ నుంచి ఆయన లైవ్‌లో వీక్షించారు. ప్రతీ అప్‌డేట్‌ను మినిట్ టూ మినిట్ అడిగి తెలుసుకున్నారు. మొత్తంగా 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఆర్మీ మెరుపు దాడులు చేసింది. ఆయా స్థావరాలను విజయవంతంగా కూల్చేయడంతో ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఉగ్రస్థావరాలు నేలమట్టం కాగానే ‘జైహింద్’ అంటూ […]

పాక్‌లోని మురీద్‌కేను భారత్ సైన్యం టార్గెట్ చేయడానికి కారణం

మురీద్‌కేలోనే లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థ, దాని మాతృ సంస్థ జమాత్-ఉద్-దావా కార్యాలయాలు ఉన్నాయి. అవి ఉగ్రవాద శిక్షణ శిబిరాలుగా కూడా పనిచేస్తున్నాయని నిఘా వర్గాలు చెబుతున్నాయి. దాదాపు 200 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కేంద్రం.. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించే ప్రధాన కేంద్రాల్లో ఒకటి. ఈ స్థావరంపై దాడి చేయడం ద్వారా ఉగ్రవాదానికి కేంద్రంగా ఉన్న ప్రదేశాలనే భారత్ లక్ష్యంగా చేసుకోవడాన్ని స్పష్టచేస్తోంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ప్రదేశాలు భారత సైనిక చర్యల నుంచి తప్పించుకోలేవనే […]

ఉద్యోగులు, ప్రజల మధ్య సిఎం చిచ్చు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనాలోచిత వ్యాఖ్యలతో ఉద్యోగులు, ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో చెప్పిందే ఉద్యోగులు అడుగుతున్నారని, కానీ సిఎం ఉద్యోగులను ప్రజల ముందు ఉద్యోగులను విలన్‌లుగా చిత్రీకరించే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఎన్‌జిఒల త్యాగాల స్పూర్తితో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిందని తెలిపారు. ఉద్యోగాలు పోయినా.. తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యోగులపై సిఎం రేవంత్ రెడ్డి మాటలు బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆపరేషన్ సింధూర్‌పై పాక్ తొలి రియాక్షన్

పాకిస్తాన్ ఐఎస్పీఆర్ డీజీ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి మాట్లాడుతూ, కోట్లి, మురిద్కే, బహవల్పూర్, ముజఫరాబాద్‌లోని స్థావరాలపై భారతదేశం దాడులు చేసిందని చెప్పారు.పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ భారతదేశం నిక దాడులు చేసిందని ధృవీకరించారు. “భారతదేశం చేపట్టిన ఈ యుద్ధ చర్యకు స్పందించే హక్కు పాకిస్తాన్‌కు ఉందని కూడా అన్నారు. దీనికి ఇంతకింతా బలమైన ప్రతిస్పందన ఇస్తాం” అని హెచ్చరించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON