భారత రక్షణ వెబ్సైట్లపై పాకిస్థాన్ సైబర్ దాడి..
భారత రక్షణ రంగ సంస్థలకు చెందిన కీలక సమాచారాన్ని తస్కరించేందుకు సైబర్ నేరగాళ్లను రంగంలోకి దింపింది. పాక్ హ్యాకర్లు సైబర్ దాడుల మళ్లీ ముమ్మరం చేసినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. భారత మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్ (MES), మనోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ (MP-IDSA) సంస్థల వెబ్సైట్ను హ్యాక్ చేసినట్టు ‘పాకిస్థాన్ సైబర్ ఫోర్స్’ అనే హ్యాకర్ల గ్రూప్ ప్రకటించింది. దీంతో అప్రమత్తమైన అధికారులు భద్రతా చర్యలు చేపట్టారు.