loader

భారత గూఢచారి డ్రోన్ ను కూల్చిన పాక్

జమ్మూకశ్మీర్ లోని పహల్గామ్ లో టెర్రరిస్ట్ దాడి తర్వాత ఉద్రిక్తతల నడుమ భారత గూఢచారి డ్రోన్ ను కూల్చివేసినట్లు పాకిస్తాన్ ప్రకటించింది. మంగళవారం భారత్ కు చెందిన మానవరహిత డ్రోన్ సరిహద్దురేఖను దాడి తమ గగన తలంలో ప్రవేశించగా దానిని పాక్ సైనికులు కూల్చివేశారని పాక్ టీవీ చానల్ ప్రకటించింది. సరిహద్దులలో నిఘాకోసం ఉభయ దేశాలు చిన్నచిన్న డ్రోన్ లను ఉపయోగించడం సాధారణమే.

మహాకవి శ్రీశ్రీ జయంతి

శ్రీశ్రీ అని పిలవబడే శ్రీరంగం శ్రీనివాసరావు (1910 ఏప్రిల్ 30 – 1983 జూన్ 15) ప్రముఖ తెలుగు కవి, హేతువాది, నాస్తికుడు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా ప్రసిద్ధి చెందాడు. మహాప్రస్థానం అతని అత్యంత ప్రజాదరణ పొందిన రచనలలో ఒకటి.

ట్రంప్ దెబ్బకు దిగొచ్చిన చైనా..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన.. అధిక టారిఫ్‌ల కారణంగా చైనా కంపెనీలు భారతదేశంలో భాగస్వామ్యం కోసం ఆసక్తి చూపుతున్నాయి. రిలయన్స్.. హయర్ ఇండియాలో వాటా కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తోంది. షాంఘై హైలీ.. ఓల్టాస్‌తో చర్చలు జరుపుతోంది. చాలా చైనా కంపెనీలు మైనారిటీ వాటాకు కూడా అంగీకరిస్తున్నాయి. భారతీయ సంస్థలతో జట్టుకట్టి, ఇక్కడి నుంచే తమ ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్‌కు తరలించేందుకు చైనా దిగ్గజాలు..భారతీయ కంపెనీలలో భాగస్వామ్యం కోసం పోటీ పడుతున్నాయి.

తిరుమల శ్రీవారి సీనియర్ సేవకులకు కొత్త డిజిగ్నేషన్

భక్తులకు మరింత మెరుగైన సేవలను అందించడానికి టీటీడీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీవారి సేవలో కొన్ని ముఖ్యమైన మార్పులను టీటీడీ తీసుకొచ్చింది. జూన్ నెలకు సంబంధించిన శ్రీవారి సేవకుల కోటాను కొత్త అప్లికేషన్ ద్వారా విడుదల చేస్తారు. 45 ఏళ్ల నుంచి 70 ఏళ్ల మధ్య ఉన్న వారు నమోదు చేసుకోవచ్చు. ఇప్పుడు వీరిని “గ్రూప్ లీడర్స్” అని పిలుస్తారు. వీరు 15 రోజుల, ఒక నెల లేదా మూడు నెలల వ్యవధిలో సేవ చేయడానికి […]

డొనాల్డ్ ట్రంప్‌ వ్యతిరేకత భారీ మెజారిటీతో గెలిపించింది..!!

కెనడా సాధారణ ఎన్నికల్లో అధికార లిబరల్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఆ పార్టీ హవా వీచింది. తన అధికారాన్ని నిలబెట్టుకుంది. ఆ దేశ ప్రధానమంత్రిగా మార్క్ కార్నీ కొనసాగనున్నారు. వరుసగా రెండోసారి ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కెనడా ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రంగా మారారు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆ దేశం విధించిన టారిఫ్, అమెరికాలో 51వ రాష్ట్రంగా పరిగణిస్తామంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను తనకు అనుకూలంగా మలచుకుంది లిబరల్ పార్టీ.

కశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత

కాశ్మీర్ లోయలో ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 87 పర్యాటక ప్రాంతాల్లో 48 ప్రాంతాలను తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారికంగా ప్రకటించింది. మూసివేసిన 48 ప్రాంతాల్లో ప్రస్తుతం టూరిస్టులను అనుమతించడం లేదు. సంబంధిత ప్రాంతాలలో భద్రతా బలగాలు మోహరింపజేసి పూర్తి స్థాయి భద్రత కల్పించిన తరువాత మాత్రమే వాటిని తిరిగి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. టూరిస్టుల కోసం ఇప్పటికీ ఓపెన్ ఉన్న ఇతర ప్రాంతాలలో […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON