భారత గూఢచారి డ్రోన్ ను కూల్చిన పాక్
జమ్మూకశ్మీర్ లోని పహల్గామ్ లో టెర్రరిస్ట్ దాడి తర్వాత ఉద్రిక్తతల నడుమ భారత గూఢచారి డ్రోన్ ను కూల్చివేసినట్లు పాకిస్తాన్ ప్రకటించింది. మంగళవారం భారత్ కు చెందిన మానవరహిత డ్రోన్ సరిహద్దురేఖను దాడి తమ గగన తలంలో ప్రవేశించగా దానిని పాక్ సైనికులు కూల్చివేశారని పాక్ టీవీ చానల్ ప్రకటించింది. సరిహద్దులలో నిఘాకోసం ఉభయ దేశాలు చిన్నచిన్న డ్రోన్ లను ఉపయోగించడం సాధారణమే.