loader

కూటమి నేతలైనా ఉపేక్షించబోం.. పవన్ కల్యాణ్ మాస్ వార్నింగ్..

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ త్వరలో జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. జిల్లా కేంద్రాలకు వెళ్లి కబ్జాలు, దందాలపై అర్జీలు స్వీకరించి అధికారులతో సమీక్షించాలని పవన్ నిర్ణయించారు. పర్యటనలో భాగంగా ముందు కాకినాడ, విశాఖపట్నం వెళ్లాలని పవన్ నిర్ణయించారు. భూ సమస్యలు ఎదుర్కొంటున్న బాధితులు కూటమి నేతల కారణంగా ఇబ్బందిపడ్డా ఉపేక్షించబోము అంటూ తమ ప్రభుత్వంలో పాలన పారదర్శకంగా, నిష్పాక్షికంగా సాగుతుందని.. ఎవర్నీ వదిలిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు.

తిరుమల, టీటీడీలో అన్యమతస్తులపై చర్యలు ప్రారంభం.. బదిలీ చేస్తూ తొలి ఉత్తర్వులు జారీ

తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)లో అన్యమత ఉద్యోగులు లేకుండా చూస్తామని ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆ మాట ప్రకారం.. అన్యమత ఉద్యోగులపై టీటీడీ తొలిసారి చర్యలు ప్రారంభించింది. ఉద్యోగుల వివరాలు చెక్ చేసి బదిలీ పర్వం మొదలుపెట్టింది. టీటీడీలో ఇక అన్యమతస్తులు కనిపించరని స్పష్టమవుతోంది. పద్మావతి మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ అన్షుతాను నరసింగాపురం ఫార్మసీకి బదిలీ చేశారు. అన్షుతా అన్యమతస్తురాలు అని.. ఆమె పూజకు రాదు అని…ఆరోపణలు ఉన్నాయి.

ఆ స్కూల్ డ్రాపౌట్.. అంబిక ఐపీఎస్‌

ఉగ్రవాద కార్యకలా పాలు.. ముంబయి పోలీసులకు ఎప్పుడూ తలనొప్పే! నేరాలు- ఘోరాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటాయి. అలాంటి ముంబయిలో లా అండ్‌ ఆర్డర్‌ను కంటిచూపుతో కంట్రోల్‌లో ఉంచుతున్నది నగర డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ అంబిక. పద్నాలుగేండ్లు ఉన్నప్పుడు ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌తో ఆమెకు పెండ్లి చేశారు. సంసారమే ఆ అమ్మాయి ప్రపంచం. పద్దెనిమిదేండ్లకే ఇద్దరు పిల్లలకు తల్లయ్యింది. తన భర్త పై అధికారులకు సెల్యూట్‌ కొట్టడం చూసి ఆశ్చర్యపోయింది. అలాంటి గౌరవం అందుకోవడం కోసం […]

ఆ భూములు హెచ్‌సీయూవే.. అదంతా అడవే

కాంగ్రెస్‌ ప్రభుత్వం చెట్లను నరికేసిన 400 ఎకరాల భూములు న్యాయబద్ధంగా హెదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకే చెందుతాయని సెంట్రల్‌ ఎంపవర్డ్‌ కమిటీ నివేదికలో తేల్చిందని స్టూడెంట్‌ యూనియన్‌ వెల్లడించింది. శుక్రవారం కేంద్ర సాధికార కమిటీ నివేదికలోని ప్రధాన అంశాలను ప్రస్తావిస్తూ పోస్టర్లు విడుదల చేశారు. చారిత్రక రికార్డులు, న్యాయపరమైన ఆధారాల ప్రకారం 400 ఎకరాలతోపాటు హెచ్‌సీయూ పరిధిలో ఉన్న భూములన్నీ వర్సిటీకే చెందుతాయని సీఈసీ ఆధారాలతో సహా తేల్చిందని విద్యార్థులు పేర్కొన్నారు.

అమెరికా వెళ్తున్నారా..? మీ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు చెక్‌ చేయొచ్చు!

అమెరికాకు వెళ్లేవారి ఎలక్ట్రానిక్‌ డివైస్‌లను తనిఖీ చేసే అధికారం ఆ దేశ కస్టమ్స్‌, బోర్డర్‌ ప్రొటెక్షన్‌ (సీబీపీ)కి ఉంది. అమెరికాలో ప్రవేశించేవారి వద్ద ఉన్న స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలను తనిఖీ చేసే చట్టబద్ధ అధికారం సీబీపీ అధికారులకు ఉంది. ప్రయాణికుల పౌరసత్వం, వీసా స్టేటస్‌ వంటి వాటితో సంబంధం లేకుండా తనిఖీ చేస్తారు. బేసిక్‌ సెర్చ్‌, అడ్వాన్స్‌డ్‌ సెర్చ్‌ అనే రెండు విధాలుగా ఎలక్ట్రానిక్‌ డివైస్‌ల తనిఖీలు జరుగుతాయి. బేసిక్‌ సెర్చ్‌లో సీబీపీ ఆఫీసర్‌ […]

దారి మళ్లిన విదేశీ విద్యానిధి

విదేశీ విద్యా నిధి పథకంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో సుమారుగా 20 మంది విద్యార్థులకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసినట్టుగా సమాచారం. ఓవర్‌సీస్ స్కాలర్‌షిప్ పథకం కింద ఎంపికైన విద్యార్థులకు విదేశాల్లో ఉన్నతవిద్యను అభ్యసించడానికి సుమారుగా రూ.25 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసింది. గత ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్న వారిలో చాలామంది ఇన్‌కంట్యాక్స్ కట్టే వారు, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు కూడా ఈ పథకం కింద అప్పట్లో దరఖాస్తు చేసుకున్నారని వారిని కూడా ఎంపిక చేశారని […]

యాప్‌లకు AI ఏజెంట్లు

ప్రస్తుతం టెక్నాలజీ రంగంలో కృత్రిమ మేథస్సు ( AI) సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఏఐ ఏడాదిలోనే సాఫ్ట్‌వేర్‌ కోడ్‌లన్నింటినీ రాసేస్తుందని ఇప్పటికే పలువురు టెక్నాలజీ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మనుషులు అందిస్తున్న కొన్ని సేవలను ‘ AI ఏజెంట్లు’గా పిలిచే యంత్రాలే చేయనున్నాయి. ఇక యాప్‌లను ఏఐ ఏజెంట్లు అభివృద్ధి చేయనున్నట్టు తాజాగా ‘గ్లోబల్‌ సీఆర్‌ఎం లీడర్‌ సేల్స్‌ ఫోర్స్‌’ తెలిపింది. ఏఐతో ఉద్యోగ నియామకాల్లో సైతం భారీ మార్పులు వస్తాయని ఎక్స్‌పర్ట్స్‌ చెప్తున్న నేపథ్యంలో […]

వైశాలికి తొలి విజయం

ఫిడే (International Chess Federation) మహిళల గ్రాండ్‌ ప్రిక్స్‌ సిరీస్‌లో భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ వైశాలి రమేశ్‌బాబు తొలి విజయం నమోదు చేసింది. ఐదో రౌండ్‌లో తెల్లపావులతో బరిలోకి దిగిన వైశాలి.. బక్తుయగ్‌ (మంగోలియా)ను ఓడించింది. ఈ గెలుపుతో ఆమె టాప్‌-5లోకి దూసుకొచ్చింది. నాలుగు పాయింట్లతో చైనా క్రీడాకారిణి జైనర్‌ అగ్రస్థానంలో ఉండగా తర్వాత నాలుగు స్థానాల్లో భారత్‌కు చెందిన కోనేరు హంపి (3.5), దివ్య దేశ్‌ముఖ్‌ (3.5), వైశాలి (2.5), హారిక (2.5) ఉన్నారు.

భాగ్యనగరంలో సరికొత్త స్ట్రీట్ ఫుడ్.. షవర్మ పూరీ ఆవిష్కరణ..

షవర్మకు పుట్టినిల్లు గల్ప్ దేశాలు. అక్కడ బాగా పాపులర్ వంటకాల్లో ఒకటి. షవర్మని ఎక్కువగా అరేబియన్, ఇటలీ, ఓమన్ దేశాలలో ఇష్టంగా తింటారు. షవర్మకి హైదరాబాద్ నగరంలో సరికొత్త రూపాన్ని తీసుకొచ్చారు. తార్నాకలోని ఎక్సోటిక్ గ్రిల్ అనే ఈటరీ షావర్మా పానీ పూరిని అందిస్తుంది. ఇది మిడిల్ ఈస్టర్న్ మసాలా దినుసులను భారతీయ వీధి ఆహార శైలితో అందిస్తున్నారు. జ్యుసి షవర్మ మాంసం, క్రీమీ వెల్లుల్లి మాయో, కరకరలాడే కూరగాయలతో నింపిన క్రిస్పీ గోల్ గప్ప షెల్స్ […]

జేడీ వాన్స్‌, ఉషా చిలుకూరిల భారత పర్యటన ఖరారు…

జేడీ వాన్స్ భారత పర్యటన అధికారికంగా ఖరారైంది. అమెరికా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జేడీ వాన్స్ ఇండియాకు రావడం ఇదే తొలిసారి. జేడీ వాన్స్ సతీమణి ఉషా చిలుకూరి వాన్స్ పూర్వీకులు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారనే సంగతి తెలిసిందే. నేపథ్యంలోనే జేడీ వాన్స్ తన భార్య ఉషా చిలుకూరి, పిల్లలు ఇవాన్, వివేక్, మీరాబెల్‌లతో కలిసి భారత పర్యటనకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా 21న ప్రధాని మోదీతో సమావేశమవుతారని పేర్కొంది. భారత్‌లోని న్యూఢిల్లీ, […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON