loader

సామాన్యుడికి పాదరక్షలు తొడిగిన ప్రధాని మోడీ

మోడీ ప్రధాని అయ్యేవరకు , అలాగే స్వయంగా మోడీని కలుసుకునేంతవరకు పాదరక్షలు తొడగనని 2009లో ప్రతిజ్ఞ చేసిన హర్యానా లోని కైతాల్ నివాసి అయిన రామ్‌పాల్ కశ్యప్‌కు ప్రధాని మోడీ పాదరక్షలు తొడిగించారు. సోమవారం నాడు ప్రధాని మోడీ హర్యానా పర్యటన సమయంలో ఈ సంఘటన జరిగింది. తన కోసం 14 ఏళ్లుగా పాదరక్షలు లేకుండా నడుస్తున్న వీరాభిమాని కశ్యప్ శపథాన్ని మోడీ నెరవేర్చారు.

ఇకపై సహించేది లేదు.. కలెక్టర్లకు సీఎం రేవంత్ మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్

తెలంగాణలోని కలెక్టర్ల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. మరోసారి కలెక్టర్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. రెగ్యులర్ వర్క్ షీట్లు పంపని, క్షేత్రస్థాయి పర్యటనలు చేయని కలెక్టర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భూ భారతి చట్టం, ఇందిరమ్మ ఇళ్ల పథకం, వేసవి తాగునీటి సమస్యలపై కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.

కారులో బాంబు పెడతాం.. సల్మాన్ ఖాన్‌ను లేపేస్తాం..

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. వాట్సాప్ ద్వారా బాంబ్ బెదిరింపు కాల్ వచ్చింది. కారులో బాంబు పెట్టి పేల్చాస్తామని ఆగంతకుడు బెదిరించాడు. దీనిపై ముంబైలోని వర్లిలోని ట్రాన్స్ పోర్ట్ విభాగానికి మెసేజ్ వచ్చింది. దీంతో వర్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. సల్మాన్ ఖాన్‌కు సెక్యూరిటీని మరింత టైట్ చేశారు అధికారులు. సల్మాన్ ఖాన్‌కు ప్రాణాలకు ఎలాంటి హాని కలగకుండా భద్రతను మరింత కట్టు దిట్టం చేశారు పోలీసులు.

ముదురుతోన్న భాషా వివాదం.. ఎయిర్‌పోర్టులో హిందీ బోర్డులు తొలగింపు

బెంగళూరులోని కేంపెగౌడ ఎయిర్‌పోర్టులో సైన్‌బోర్డులన్నింటి నుంచీ హిందీని తీసేశారు. అక్కడ ఇప్పుడు కన్నడ, ఇంగ్లీషులో మాత్రమే సమాచారం అందిస్తున్నారు. ఈ మార్పునకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా Xలో తెగ వైరల్ అవుతోంది. కొందరు ఈ పనిని మెచ్చుకున్నారు. కానీ చాలామంది ఒక అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తప్పని విమర్శిస్తున్నారు. ఒక యూజర్ ఈ మార్పును ప్రశ్నిస్తూ, “ఇంగ్లీషు, కన్నడ తెలిసిన వాళ్ళు మాత్రమే బెంగళూరు వస్తారని అనుకుంటున్నారా? ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లలో […]

సర్కారు బడుల్లోనూ నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ క్లాసులు..

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఇకపై ప్రీ ప్రైమరీ తరగతులు కూడా ప్రారంభించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ప్రస్తుతం సర్కారు బడుల్లో ఒకటో తరగతి నుంచి మాత్రమే చదువుకునే అవకాశం ఉంది. అంగన్‌వాడీ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ నిర్వహించేవారు. ప్రభుత్వ పాఠశాలల్లో శిశు విద్యను ప్రారంభించాలని నిర్ణయించింది. త్వరలో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించి, పిల్లలకు ఉచిత రవాణా సౌకర్యం కూడా కల్పిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల ప్రకటించారు.

అంబేడ్కర్కు ప్రముఖుల ఘన నివాళి..

భారత రాజ్యాంగ రూపకర్త బాబాసాహెబ్ అంబేడ్కర్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. పార్లమెంట్ ఆవరణలో ఘనంగా అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్కి పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు ఘన నివాళి అర్పించారు.

చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం.. మరో 44 వేల ఎకరాల భూ సేకరణకు సన్నద్ధం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి మరింత వేగం పుంజుకుంటోంది. అమరావతిని రాజధానిగా తీర్చిదిద్దే క్రమంలో చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం మరో భారీ అడుగు వేసింది. రాజధానిలో పెరుగుతున్న అవసరాలు, కీలక పౌర సదుపాయాలకు స్థలాభావం కారణంగా మరో 44,676 ఎకరాల భూమి సమీకరణకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. దీని కోసం సంబంధిత అధికారులు ఇప్పటికే రంగంలోకి దిగారు. గతంలో 29 గ్రామాల్లో 34,689 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించిన సీఆర్డీఏ, ఇప్పుడు ఫేజ్-2 భూ […]

ప్రపంచంలో ఎల్పీజీ రేటు భారత్‌లోనే ఎక్కువ !

పెరిగిన నిత్యావసరాల ధరలతో ఇప్పటికే సతమతమవుతున్న పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలను పెరిగిన గ్యాస్‌, పెట్రోల్‌ ధరలు మరింత కుదేలు చేస్తున్నాయి. ఎల్పీజీ ధర ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్‌ తొలి స్థానంలో నిలిచింది. అలాగే పెట్రోల్‌ రేటులో మూడు, డీజిల్‌ రేటులో ఎనిమిదో స్థానాన్ని సాధించింది. ఈ మేరకు నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ప్రజల కొనుగోలు శక్తితుల్యత (పర్చేజింగ్‌ పవర్‌ పారిటీ-పీపీపీ) విధానాన్ని బట్టి ఏఐ చాట్‌బాట్‌ ‘గ్రోక్‌’ సమాధానాలు ఇచ్చింది.

వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీ అరెస్టు !

ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీని బెల్జియం పోలీసులు అరెస్ట్‌ చేశారు. భారత సీబీఐ అధికారులు కోరిక మేరకు మెహుల్‌ ఛోక్సీ బెల్జియం పోలీసులు శనివారం అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు. రూ.13,500 కోట్ల పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ మోసం కేసులో మెహుల్‌పై అభియోగాలు ఉన్న నేపథ్యంలో అతడిని అప్పగించాలని భారత్‌ కోరింది. ఈ నేపథ్యంలోనే అతడిని అరెస్ట్‌ చేసినట్టు తెలిసింది.  పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం బయటపడటానికి కొద్ది వారాల ముందే మెహుల్ చోక్సీ, అతడి మేనల్లుడు […]

తిరుమల ఘాట్ రోడ్ల రూపురేఖలు మారబోతున్నాయి.. సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

తిరుమల ఘాట్ రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.12 కోట్లతో రెండు ఘాట్ రోడ్ల మరమ్మతులకు ఆమోదం తెలిపారు. గత ప్రభుత్వంలో రోడ్లు గుంతలమయంగా మారాయని, వాటిని బాగు చేయాలని టీటీడీ ఛైర్మన్ కోరారు. అలాగే, 2025లో తిరుమలలో జరిగే గరుడ సేవల తేదీలను, రద్దు చేసిన తేదీలను కూడా ప్రకటించారు. ఇటీవల ఒంటిమిట్ట రామాలయ కళ్యాణోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఆ సమయంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON