loader

ఎవ్వరూ రిటైర్ కావట్లేదు!.. 2027 వన్డే వరల్డ్ కప్‌పైనే టార్గెట్..

2025 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటాడని ప్రచారం జరిగింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు రవీంద్ర జడేజాకి కూడా ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ అంటూ ప్రచారం జరిగింది.  వీరిలో ఎవరు రిటైర్మెంట్ ఇస్తారోననే భయమే ఫ్యాన్స్‌ని ఎక్కువగా వెంటాడింది.  రిటైర్మెంట్ ఆలోచనే లేదంటూ క్లారిటీ ఇచ్చేశారు భారత స్టార్ క్రికెటర్లు.. విక్టరీ సెలబ్రేషన్స్‌లో విరాట్ కోహ్లీతో కలిసి వికెట్ ఫైట్ చేసిన రోహిత్ శర్మ, ‘వీళ్లు మనం […]

శంషాబాద్ లో విమానానికి తప్పిన పెను ప్రమాదం

ఇండిగో ఎయిర్ లైన్స్ కు చెందిన 6ఇ6973 విమానం 150 మంది ప్రయాణికులతో గోవా నుంచి విశాఖపట్నం వెళ్తోంది. శంషాబాద్ నుంచి వెళ్తుండగా ఎటిసి అధికారులు ల్యాండింగ్ కు అవకాశం ఇచ్చారు. ల్యాండింగ్ చేస్తున్న క్రమంలో ఎటిసి అధికారులు హైడ్రాలిక్ గేర్ ను సిద్ధం చేశారు. ల్యాండింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్న సమయంలో మరో విమానం టేకాఫ్ అవుతుండడం గమనించి వెంటనే రివర్స్ టేకాఫ్ తీసుకున్నాడు. విమానం గాల్లోకి లేవడంతో పెను ప్రమాదం తప్పింది.

రోదసిలో తొలిసారి వాణిజ్య నిఘా.. దక్షిణ అమెరికాను చిత్రీకరించిన భారత శాటిలైట్‌

ప్రపంచంలోనే మొట్టమొదటి వాణిజ్య అంతరిక్ష నిఘా ఉపగ్రహం కార్యకలాపాలు శనివారం ప్రారంభమయ్యాయి. దీనిని స్పేస్‌ కెమెరా ఫర్‌ ఆబ్జెక్ట్‌ ట్రాకింగ్‌ (ఎస్‌సీఓటీ) అంటారు. ఈ నిఘా ఉపగ్రహం భూ కక్ష్యలో తిరుగుతూ భూమిపై గల 5 సెంటీమీటర్ల వస్తువును సైతం చిత్రీకరించగలదు. భారత స్టార్టప్‌ ‘దిగంతర’ జనవరి 14న ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ ట్రాన్స్‌పోర్టర్‌-12 రాకెట్‌ ద్వారా ప్రయోగించింది. ఈ ఉపగ్రహం తన పనిలో భాగంగా మొదట దక్షిణ అమెరికాలోని బ్యూనస్‌ ఎయిర్స్‌ నగరాన్ని చిత్రీకరించింది.

తోలుబొమ్మల కళ అద్భుతం. . . కళాకారుడికి రాష్ట్రపతి ప్రశంస

ధర్మవరం మండలంలోని నిమ్మలకుంట గ్రామానికి చెందిన దళవాయి కుళ్లాయప్ప రూపొందించిన తోలుబొమ్మలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవనలో ఏర్పాటు చేసిన వివిధత కా అమృత మహోత్సవంలో దళవాయి కుళ్లాయప్ప తోలుబొమ్మలతో ప్రత్యేక స్టాల్‌ ఏర్పాటు చేశారు. స్టాల్‌ను సందర్శించిన రాష్ట్రపతి తోలుపై గీసిన రామయాణ, భారత ఘట్టాలను పరిశీలించారు. అద్భుతం అంటూ ప్రశంసించారు. ప్రాచీన కళను కాపాడుకోవాలని రాష్ట్రపతి సూచించినట్లు దళవాయి కుళ్లాయప్ప తెలిపారు.

ఛాంపియన్స్ పై ప్రముఖల ప్రశంసలు..

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము టీమ్ ఇండియా గెలుపును చరిత్రలో నిలిచిపోయేలా చేసిందని అన్నారు.భారత క్రికెట్ భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను. అంటూ పోస్ట్ చేశారు. టీమ్ ఇండియా గెలుపుపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ..అద్భుతమైన ఆట, అద్భుతమైన ఫలితం. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ఇంటికి తెచ్చినందుకు మన క్రికెట్ జట్టు పట్ల గర్వంగా ఉంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ టీమ్ ఇండియా గెలుపుపై ట్వీట్ చేశారు.అదరగొట్టారు అబ్బాయిలూ! మీరంతా ఒక బిలియన్ గుండెల్ని గర్వపడేలా […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON