loader

గూగుల్ నుంచి కీలక అప్‌డేట్‌.. వివరాలు తొలగించడం సులభం!

ఇంటర్నెట్ ఉపయోగించే దాదాపు అందరూ ఏదైనాతెలుసుకోవాలనుకుంటే దాన్ని గూగుల్‌లో వెతుకుతారు.  వ్యక్తుల వ్యక్తిగత సమాచారం కూడా సెర్చింగ్‌ రిజల్డ్‌లో ఉంటుంది. ఇప్పుడు గూగుల్ సెర్చింగ్‌ ఫలితాల నుండి వ్యక్తిగత సమాచారాన్ని తొలగించడాన్ని సులభతరం చేసింది. అయితే మీరు సెర్చ్‌ చేసింది కనిపించకూడదని మీరు భావిస్తే, సులభంగా తొలగించడానికి గూగుల్ కొత్త ఇంటర్‌ఫేస్‌ను ప్రారంభించింది. వినియోగదారులు వారి వ్యక్తిగత సమాచారాన్ని ఫోన్ నంబర్,  లాగిన్ మొదలైన వాటిని తొలగించవచ్చు.

జాతీయ సైన్స్‌ దినోత్సవం. . .

సైన్స్ మన జీవితాలపై చూపిన ప్రభావాన్ని గుర్తుచేసేందుకు ఈ నేషనల్‌ సైన్స్‌ డే జరుపుకుంటారు. భారత శాస్త్రవేత్త, వైద్యుడు సర్‌ సి.వి. రామన్ కనుగొన్న ‘రామన్ ఎఫెక్ట్’ 1928 ఫిబ్రవరి 28వ తేదీన అమల్లోకి వచ్చింది. ఈ చారిత్రాత్మక దినోత్సవాన్ని స్మరించుకునేందుకు ఏటా ఒక్కో థీమ్‌తో జాతీయ సైన్స్‌ దినోత్సవం జరుపుతుంటారు. 2025వ సంవత్సరంలో ”వికసిత్ భారత్ కోసం సైన్స్ మరియు ఇన్నోవేషన్‌లో గ్లోబల్ లీడర్‌షిప్ కోసం భారతీయ యువతకు సాధికారత” థీమ్‌తో ఈ జాతీయ సైన్స్‌ […]

ఆరో రోజు కొనసాగుతున్న టన్నెల్‌ రెస్క్యూ పనులు..

టన్నెల్‌ రెస్క్యూ పనులు కొనసాగుతున్నాయి. SLBC టన్నెల్‌లో నీటి తోడకం చాలెంజింగ్‌గా మారింది. నిమిషానికి 5వేల లీటర్ల సీపేజ్‌ నీటి తోడకంతో పాటు బురద పేరుకుపోతుండడంతో రెస్క్యూ పనులు మరింత క్లిష్టంగా మారాయి. ఆర్మీ, నేవీ, NDRF, SDRF, GSI, సింగరేణి, ర్యాట్‌హోల్‌ మైనర్స్‌, BRO, L&T రెస్క్యూ ఆపరేషన్‌‌లో పాల్గొన్నాయి. ఆపరేషన్ పనులను పర్యవేక్షిస్తున్న మంత్రి ఉత్తమ్‌.. రెస్క్యూ చివరి దశకు చేరిందన్నారు. గల్లంతయిన వారిని క్షేమంగా తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు.

సూర్యుడిపై భారీ పేలుడు.. తెలుగు రాష్ట్రాలకు హీట్ అలర్ట్

సూర్యుడిపై నిరంతరం అణుబాంబులు పేలినట్లు పేలుతూ ఉంటాయి. అత్యంత శక్తిమంతమైన వేడి రాకాసి గాలులు అంతరిక్షంలోకి బయలుదేరతాయి. అలాంటి గాలులు ఇప్పుడు భూమివైపు వస్తున్నాయి. వాటి ప్రభావం యూరప్‌పై ఎక్కువగా ఉన్నా.. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా 4 రోజులు వేడి గాలులు ఎక్కువగా వీస్తాయి. తెలంగాణలో  4 రోజులు ఎండలు దంచేస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు. ఏపీలో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఐతే.. ఫిబ్రవరి 28 నుంచి వాతావరణం మారుతుంది. మేఘాలు ఉన్నప్పుడు చల్లగా, […]

ఇంటర్‌ పరీక్షలకు సర్వం సిద్ధం.. మార్చి 1 నుంచి

2024-25 విద్యా సంత్సరానికి మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు రెగ్యులర్‌ , మార్చి 3 నుంచి 15 వరకు ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ఇంటర్‌ పరీక్షలు జరగనున్నాయి. 26 జిల్లాల్లో దాదాపు పది లక్షల మంది విద్యార్ధులు హాజరుకానున్నారు. రెగ్యులర్‌ ఇంటర్‌ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా  1535 కేంద్రాలను ఏర్పాట్లు  చేశారు. పరీక్ష కేంద్రాలను సీసీ కెమెరాలతో అనుసంధానించి అమరావతిలోని చీఫ్‌ సూపరింటెండెంట్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌లో పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు. పరీక్షల నిర్వహణలో ఫిర్యాదుల […]

తమిళగ వెట్రి కజగం (TVK) మహానాడు. . . విజయ్‌ తో వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌

తమిళగ వెట్రి కజగం (TVK) మహానాడు చెన్నైలో గ్రాండ్‌గా జరిగింది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ తో కలిసి కార్యక్రమానికి విజయ్‌ హాజరుకావడం హాట్‌టాపిక్‌గా మారింది. విజయ్.. తన స్పీచ్‌లో ఆరు ప్రధాన అంశాలను ప్రస్తావించారు.. మహిళల భద్రతతో పాటు సంక్షేమానికి పెద్దపీట వేస్తామన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు టీవీకే దూరంగా ఉంటుందని తెలిపారు. కుల,మతాల ప్రస్తావన వద్దే వద్దంటూ నేతలకు సూచించారు. 2026లో తమిళనాడులో చరిత్ర సృష్టించబోతున్నామన్న ధీమా వ్యక్తం చేశారు విజయ్‌. అన్నాదురై, MGR […]

గ్రీన్ కార్డు కావాలా.. ట్రంప్ అద్దిరిపోయే ఆఫర్..

అమెరికాలో పెట్టుబడిదారుల కోసం ట్రంప్‌ కొత్త విధానం తీసుకొచ్చారు. 5 మిలియన్‌ డాలర్లు చెల్లిస్తే “గోల్డ్‌ కార్డ్‌” ఇస్తామంటున్నారు. 5 మిలియన్‌ డాలర్లు అంటే మన కరెన్సీలో 43.5 కోట్ల రూపాయలు అన్నమాట. గోల్డ్ కార్డ్‌ కొంటే పెట్టుబడిదారులకు అమెరికా పౌరసత్వం, నివాసం కల్పిస్తామని ట్రంప్‌ భరోసా ఇస్తున్నారు. మరో రెండు వారాల్లో గోల్డ్‌ కార్డ్‌ అమల్లోకి వస్తుంది. గోల్డ్‌ కార్డ్‌ అంటే, గ్రీన్‌కార్డ్‌కు అప్‌గ్రేడెడ్‌ వెర్షన్‌ అనీ, గోల్డ్‌ కార్డ్‌ కొటే గ్రీన్‌కార్డ్‌ కన్నా ఎక్కువ […]

సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్టు

సినీ నటుడు, దర్శకుడు, ఏపీఎఫ్‌టీవీడీసీ మాజీ చైర్మన్ పోసాని కృష్ణ మురళీని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌ లోని ఆయన నివాసంలో పోసాని కృష్ణమురళిని సంబేపల్లి పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అనంతరం హైదరాబాద్ నుంచి పోసాని కృష్ణమురళిని రాజంపేట తీసుకెళ్లారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లిలో నమోదు అయిన కేసు. ఓబులావారిపల్లి పీఎస్‌లో పోసాని కృష్ణమురళి పై సెక్షన్ 196, 353(2), 111 రెడ్ విత్ 3(5) కింద కేసు నమోదు అయింది. ఈ కేసులో పోసాని కృష్ణమురళీని […]

పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

రేపు జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంగారెడ్డి జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. మెదక్‌ -కరీంనగర్‌ -నిజామాబాద్‌ -ఆదిలాబాద్‌ గ్రాడ్యుయేట్‌, టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇంకా ఒక్కరోజు మిగిలి ఉండడంతో ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరికివారే గెలుపు వ్యూహాలకు పదును పెడుతున్నారు. 27న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది.

ఘటనా స్థలానికి ర్యాట్‌ మైనర్స్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం

నాగర్‌కర్నూల్‌ జిల్లా దోమలపెంట వద్ద ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో జరిగిన ప్రమాద ఘటన స్థలానికి మంగళవారం రాత్రి ర్యాట్‌ మైనర్స్‌ ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎల్‌అండ్‌టీ బృందాలు చేరుకొని అక్కడి దృశ్యాలను చిత్రీకరించాయి. అక్కడ చుట్టూ ఉన్న లైనింగ్‌ ఏ క్షణంలోనైనా కూలడానికి సిద్ధంగా ఉన్నట్టు ఆ దృశ్యాల్లో కనిపిస్తున్నాయి.  ర్యాట్‌ మైనర్స్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, మేఘాకు చెందిన నిపుణులు కూడా లోపలికి వెళ్లి టన్నెల్‌లో బురద ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలు చేపట్టలేమని టన్నెల్‌లోని పరిస్థితిని వీడియో చేసి పోస్టుచేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON