
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 షెడ్యూల్ విడుదల చేసింది అంతర్జాతీయ క్రికెట్ మండలి. సెప్టెంబర్ 30న మొదలయ్యే మహిళల ప్రపంచ కప్, నవంబర్ 2 వరకూ సాగుతుంది. ఇండియాతో పాటు శ్రీలంక సంయుక్తంగా ఈ వన్డే వరల్డ్ కప్ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. బెంగళూరు, గౌహతి , ఇండోర్ , విశాఖపట్నంలోని ACA-VDCA స్టేడియంలో వరల్డ్ కప్ మ్యాచులు జరుగుతాయి. అలాగే పాకిస్తాన్ ఆడే మ్యాచులకు కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.