loader

రెబల్ వైబ్ స్టార్ట్.. ‘రాజాసాబ్’ టీజర్ వచ్చేసింది

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రొమాంటిక్ హర్రర్ కామెడీ సినిమా ‘రాజాసాబ్‘. డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. కొద్దిసేపటిక్రితమే ఈ మూవీ టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మారుతి తోపాటు మేకర్స్ ప్రసాద్ ఐమాక్స్ వద్ద సందడి చేశారు. థియేటర్ వద్ద ప్రభాస్ భారీ కటౌట్ ఏర్పాటు చేశారు.

ట్రంప్ పెత్తందారితనం కుదరదు

అధికార జులుం చెల్లనేరదు. నో కింగ్స్ అంటూ అమెరికాలోని పలు ప్రాంతాలలో ట్రంప్ వ్యతిరేక ప్రదర్శనలు జోరందుకుంటున్నాయి. పలు డౌన్‌టౌన్లు, చిన్న పట్టణాలలో కూడా జనం ట్రంప్ చర్యలను నిరసిస్తున్నట్లు పేర్కొంటూ ర్యాలీలు చేపట్టారు. ఇమిగ్రేంట్ హక్కులు కల్పించాలి. అణచివేత చర్యలు నిలిపివేయాలి. ప్రజాస్వామ్యం రక్షించాలనే నినాదాలతో నిరసనకారులు ఉద్యమిస్తున్నారు.

ఇస్రోనా మజాకా.. స్పేస్‌ఎక్స్ తప్పిదం గుర్తింపు..

స్పేస్‌ఎక్స్‌కు చెందిన ఫాల్కన్-9 ప్రయోగానికి ముందు, 13 మంది సభ్యులతో కూడిన ఇస్రో బృందం కెన్నెడీ స్పేస్ సెంటర్‌లో క్షుణ్ణంగా దర్యాప్తు నిర్వహించింది. దర్యాప్తు లో, రాకెట్ మొదటి దశలో ఆక్సిడైజర్ లైన్‌లో ఒక పగులు కనుగొన్నారు. స్పేస్‌ఎక్స్ మొదట దీనిని ఒక చిన్న లీకేజీగా భావించి ప్రక్షాళన సాంకేతికతతో సరిపెట్టుకోవడానికి ప్రయత్నించింది. కానీ ఇస్రో చీఫ్ డాక్టర్ వి. నారాయణన్ దానిని పూర్తిగా తిరస్కరించారు. చివరికి స్పేస్‌ఎక్స్ ఇస్రో షరతులకు అంగీకరించి, పగిలిన భాగాన్ని భర్తీ […]

పసుపు సంపదతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన మన్యం మహిళ

పార్వతీపురం మన్యం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం సాలూరులో అన్నాడి సునీత అనే మహిళ ఇరవై సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఒక చిన్న కుటీర పరిశ్రమ సునీతను ఉత్తమ మహిళ వ్యాపారవేత్తగా నిలబెట్టింది. గిరిజనుల సహకారంతో మన్యం ఏజెన్సీలో పసుపును సేకరించి ఆ పసుపును శుద్ధి చేసి, ప్యాకింగ్ చేసి విక్రయించడం ప్రారంభించింది ఆమె స్థాపించిన పరిశ్రమ తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలతో పాటు అరబ్ దేశాలకు, యూరప్ మార్కెట్‌లకు కూడా ఎగుమతులు చేస్తోంది.

మల్టీ లెవల్ కార్ పార్కింగ్ వచ్చేసింది..

హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కు వద్ద నూతన మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ పది రోజుల ట్రయల్ రన్ ప్రారంభించింది. కొరియన్ టెక్నాలజీతో నిర్మితమైన ఈ కాంప్లెక్స్ 72 కార్లను నిలిపే సామర్థ్యం కలిగి ఉంది. తక్కువ స్థలంలో ఎక్కువ వాహనాలను నిలిపేందుకు వీలు కల్పిస్తుంది. ఆటోమేటెడ్ వ్యవస్థలు, సెన్సార్లు, లిఫ్టుల సహాయంతో వాహనాలను వేగంగా.. సమర్థవంతంగా పై అంతస్తులలోకి లేదా కింది అంతస్తులలోకి తరలించవచ్చు.

గద్దర్ అవార్డును మరో నంది అవార్డుగా మార్చేశారా- ప్రొఫెసర్ కంచ ఐలయ్య

గద్దర్ అవార్డుల ప్రెజెంటేషన్ సినిమా నటుల, రాజకీయ నాయకుల వ్యవహారంగా మారిందని ప్రొఫెసర్ కంచ ఐలయ్య అన్నారు. తెలంగాణ సంస్కృతిని భూస్వామ్య స్థితి నుంచి ప్రజాస్వామ్య రూపంలోకి మారడంలో గణనీయ పాత్ర పోషించి, ఆడి, పాడిన వందలాది మంది కళాకారులను, ప్రజా గాయకులను, పాటల రచయితలను తెలంగాణ ప్రభుత్వం మరచిపోవడం చాలా విచారకరమని ఆయనన్నారు.

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అత్యాధునిక బోధన

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో రాష్ట్ర విద్యాశాఖ ప్రముఖ NGO సంస్థలతో MOU కుదుర్చుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో అధునాతన ఎడ్​ టెక్​ సదుపాయాలను అందించనుంది ప్రభుత్వం. నందన్ నీలేకణి నేతృత్వంలోని ఎక్‌స్టెప్ ఫౌండేషన్, అలక్​ పాండే అధ్వర్యంలోని ఫిజిక్స్ వాలా, డాక్టర్ సునీతా కృష్ణన్ నేతృత్వంలోని ప్రజ్వల ఫౌండేషన్, సఫీనా హుస్సేన్​ అధ్వర్యంలోని ఎడ్యుకేట్ గర్ల్స్, ఖాన్ అకాడమీ, షోయబ్​దార్​ నిర్వహిస్తున్న పైజామ్ పౌండేషన్ లాంటి పేరొందిన సంస్థలతో రాష్ట్ర విద్యాశాఖ MOU కుదుర్చుకుంది.

ఇంద్రాయణి నదిపై కూలిన వంతెన…. ఆరుగురు మృతి

మహారాష్ట్రలోని పుణేలో ఆదివారం మధ్యాహ్నం పెద్ద ప్రమాదం జరిగింది. ఇంద్రాయని నదిపై నిర్మించిన వంతెన సగం కూలిపోయింది. వంతెన కూలిన సమయంలో చాలా మంది దాని మీద ఉన్నారు. దాంతో దాదాపు 25 నుంచి 30 మంది నదిలో పడి కొట్టుకుపోయారని స్థానికులు చెబుతున్నారు. పుణేలోని మావల్ లోని కుండ మాల్ లో ఇనుప వంతెన కూలిపోవడంతో కొంతమంది పర్యాటకులు నీటిలో పడి ప్రవాహంలో కొట్టుకుపోయారు.

సైప్రస్‌ చేరుకున్న ప్రధాని మోదీ..

సైప్రస్‌ అధికారిక పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం (జూన్ 15) లార్నాకా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు.సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ప్రధాని మోదీకి ఎయిర్‌ పోర్ట్‌లో సాదర స్వాగతం పలికారు. ప్రధాని మోదీ సైప్రియట్ నాయకత్వంతో ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు.వాణిజ్యం, సాంకేతికత, విద్య, సాంస్కృతిక మార్పిడిలో సహకారాన్ని పెంపొందించడంపై దృష్టి సారిస్తారు.

వినాయక విగ్రహం తరలిస్తుండగా కరెంట్ షాక్..

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో విషాదం నెలకొంది. వినాయకచవితి సమీపిస్తున్నందున బాలాజీ వినాయక విగ్రహాల తయారి కేంద్రంలో భారీ గణపతి విగ్రహాన్ని తయారు చేశారు. 13 అడుగుల ఎత్తున్న విగ్రహాన్ని ఒకచోటి నుంచి మరో చోటికి తరలిస్తుండగా విద్యుత్ వైర్లు తగిలి 8మంది కార్మికులకు షాక్ కొట్టింది. ఈదుర్ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఆరుగురు కరెంట్ షాక్ తగిలి అస్వస్థతకు గురయ్యారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON