loader

ఇరాన్ అధికారిక ఛానెల్ పై ఇజ్రాయేల్ మిసైల్ దాడి..

ఇజ్రాయేల్, ఇరాన్ ల మధ్య యుద్దం తారాస్థాయికి చేరింది. ఇరు దేశాలు సైతం మిసైల్, బాంబులు, డ్రొన్ లతో ఒకరిపై మరోకరు విరుచుకు పడుతున్నారు. ఇరాన్ లో.. టీవీ స్టూడియోలో యుద్దంపై లైవ్ లో వార్తలు నడుస్తున్నాయి. దీంతో లేడీ యాంకర్ యుద్దంపై ఆవేశంగా వార్తలు చదువుతుంది. ఇంతలో ఒక్కసారిగా ఒక మిసైల్ వచ్చి.. టీవీ స్టూడియోపై పడింది. దీంతో పైనుంచి శిథిలాలు కింద పడుతున్నాయి.లైవ్ లోనే యాంకర్ ప్రాణ భయంతో గజ గజ వణికిపోయి అక్కడి […]

అగ్నివీర్ పరీక్ష అడ్మిట్ కార్డులు రిలీజ్

భారత సైన్యం అగ్నివీర్ GD (జనరల్ డ్యూటీ) రిక్రూట్‌మెంట్ పరీక్షల కోసం అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ joinindianarmy.nic.in నుండి తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (CEE) కోసం అగ్నివీర్ GD పరీక్ష జూన్ 30 నుండి జులై 3, 2025 వరకు నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు.  ఇతర కేటగిరీల అడ్మిట్ కార్డులను జూన్ 18, 2025న […]

జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు జైలు నుంచి విడుదల..

సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు జైలు నుంచి విడుదల అయ్యారు. గుంటూరు జిల్లా జైలు నుంచి కొమ్మినేని శ్రీనివాసరావు సోమవారం సాయంత్రం విడుదల అయ్యారు. అమరావతి రాజధానిపైనా, ఆ ప్రాంత మహిళలపైనా అనుచిత వ్యాఖ్యల కేసులో కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే బెయిల్ ఇవ్వాలంటూ కొమ్మినేని శ్రీనివాసరావు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. సర్వోన్నత న్యాయస్థానం కొమ్మినేని శ్రీనివాసరావుకు బెయిల్ మంజూరు చేసింది.

రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి!

రాష్ట్రంలోని రైతులకు వర్షకాలంలో పెట్టుబడి సాయం కింద అందించే రైతు భరోసా నిధులను విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలలో రైతు భరోసా ఒకటి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకం రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి రూ.12వేలు రెండు విడతలుగా అందజేస్తుంది.  రైతు నేస్తం కార్యక్రమంలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఆన్‌లైన్‌లో బటన్‌ నొక్కి రెండు ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేశారు.

సర్కారు దవాఖానాలో సర్జరీ చేయించుకున్న కలెక్టర్…

శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్లో సర్జరీ చేయించుకున్నారు. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈఎన్టీ సర్జన్ ఎల్. రవికాంత్ ఆధ్వర్యంలో, కలెక్టర్‌కి ఎండోస్కోపీ నాజల్ సర్జరీ, సెప్టోప్లాస్టీ సర్జరీ చేసినట్లు మెడికల్ సూపరింటెండెంట్ జి. వీరారెడ్డి వెల్లడించారు. “సర్కార్ దవాఖానలో నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయన్న నమ్మకాన్ని ప్రజలకు కలిగించిన కలెక్టర్ పమేలా సత్పతికి నా అభినందనలు” అని ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు.

సోనియా గాంధీ ఆరోగ్యంపై కీలక అప్‌డేట్..

కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఉదర సంబంధిత సమస్యతో బాధపడుతూ.. ఆదివారం రోజు ఆస్పత్రిలో చేరిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆమె ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరగా.. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే మరికొన్ని గంటలు ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యు నిశితంగా పరిశీలిస్తారని కూడా ఆస్పత్రి ఛైర్మన్ అజయ్ స్వరూప్ వెల్లడించారు.

కన్నప్ప మూవీ చూసి రజినీకాంత్..!

కన్నప్ప ఫైనల్ కాపీ చూసిన సీనియర్ హీరో, సూపర్ స్టార్ రజినీకాంత్.. మంచు విష్ణు టీం మొత్తాన్ని అభినందించారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు విష్ణు. రజనీకాంత్‌ అంకుల్‌ కన్నప్ప మూవీ చూశాక నన్ను ప్రేమగా ఆలింగనం చేసుకున్నారు. తనకు ఈ సినిమా ఎంతగానో నచ్చిందని చెప్పారు. చాలా చాలా సంతోషంగా అనిపించింది. నటుడిగా ఈ క్షణం కోసం నేను 22 ఏళ్లుగా ఎదురుచూస్తున్నా అని మంచు విష్ణు […]

స్థానిక సంస్థల ఎన్నికల కోసమే డైవర్షన్- కేటీఆర్

స్థానిక సంస్థలకు వెళ్లేందుకే బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఏసీబీ ఆఫీసులో విచారణ ముగిసిన తర్వాత తెలంగాణ భవన్ కు వచ్చారు. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. నాలుగు గోడల మధ్య ఎందుకు నాలుగు కోట్ల మంది ముందు లైడిటెక్టర్ సవాల్ విసిరితే రేవంత్ పారిపోయాడని కేటీఆర్ విమర్శించారు. ఫార్ములా ఈ రేసు కేసులో ఒక్క రూపాయి కూడా పక్కకు పోలేదన్నారు. తొమ్మిది గంటల పాటు అడిగిందే అడిగారన్నారు.

టీడీపీని జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పగిస్తారా- అసదుద్దీన్ ఒవైసీ

కుమారుడు, యువనేత నారా లోకేష్‌కు తెలుగుదేశం పార్టీని అప్పగించాలని ఏపీ సీఎం చంద్రబాబుకు అసదుద్దీన్ ఒవైసీ సూచించారు. లోకేష్ జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారు, ఎలాగూ మీరు జూనియర్ ఎన్టీఆర్‌కు టీడీపీ పగ్గాలు అప్పగించే అవకాశం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మా భూములు మా ఇష్టం, మాకు నచ్చింది చేసుకుంటాం. దానిపై మీకు హక్కు ఏముంది. మీ పిల్లలనే మీరు నమ్మనప్పుడు వక్ఫ్ బోర్డు లాంటివి ఏం నమ్ముతారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రధాని మోడీకి సైప్రస్‌ అత్యున్నత పురస్కారం

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సైప్రస్‌ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. సోమవారం (జూన్ 16)న సైప్రస్‌లో అత్యున్నత పురస్కారం అయిన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్ IIIతో ప్రధాని మోడీని సత్కరించారు. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ నుండి మోడీ ఈ అవార్డును అందుకున్నారు. ఈ గౌరవాన్ని పురస్కారాన్ని స్వీకరిస్తూ.. అవార్డును ఇరు దేశాల మధ్య స్నేహానికి అంకితం చేస్తున్నట్లు ప్రదాని మోడీ ప్రకటించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON