
ఢిల్లీలో జరిగిన పీవీ నరసింహారావు సంస్మరణ సభలో పాల్గొన్న ఆయన, భాషల ప్రాధాన్యతపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. “మనం హిందీ ఎందుకు నేర్చుకోవాలి అనే ప్రశ్నలు కొందరిలో వినిపిస్తున్నాయి. కానీ, పీవీ నరసింహారావు గారు 17 భాషలు నేర్చుకున్నారు. ఆయన భాషలలో చేసిన సాధన వల్లే అంత గొప్ప వ్యక్తిగా ఎదిగారు” అని చంద్రబాబు చెప్పారు. హిందీ భాషను వ్యతిరేకించాల్సిన అవసరం లేదని, అదే సమయంలో తెలుగును మరువకూడదన్న స్పష్టత ఉంది.