
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మాజీ మంత్రి హరీశ్ రావు మరియు మాజీ ఎంపీ సంతోష్ తమపై రాజకీయ కుట్రలు పన్నారని ఆమె ఆరోపించారు. ఆ కుట్రల వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని ఆరోపిస్తూ, వారంతా కలిసి లోపాయికారి ఒప్పందంతో పనిచేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.