
ములుగు జిల్లాలోని మంగపేట మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. మండలంలోని 23 గ్రామాలను గిరిజన గ్రామాలుగా పరిగణించాలని గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై గిరిజనేతరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 1950లో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఈ గ్రామాలు గిరిజన పరిధిలో లేవని పిటిషనర్లు వాదించారు. ప్రస్తుతం స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో, హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. దీంతో ఈ 23 గ్రామాల్లో ఎన్నికలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి.