తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల వ్యవస్థలో ఇప్పటివరకు అమల్లో ఉన్న “ఇద్దరు పిల్లల నిబంధన”ను ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిబంధన ప్రకారం, ఇద్దరికి మించిన పిల్లలు ఉన్నవారు పంచాయతీ రాజ్ ఎన్నికల్లో పోటీ చేయలేరు. ఈ నేపథ్యంలో, పంచాయతీరాజ్ చట్ట సవరణ ఫైల్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతకం చేశారు. ఈ ఫైల్ మంత్రివర్గ ఆమోదం పొందిన తర్వాత గవర్నర్కి పంపించనున్నారు. గవర్నర్ సంతకం చేసిన వెంటనే ఆర్డినెన్స్ రూపంలో నిబంధన ఎత్తివేత అమల్లోకి రానుంది.

