
సోషల్ మీడియాలో ఓ కొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్.. ఇప్పుడు ఏ సోషల్మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా ఫీడ్ మొత్తం జీబ్లీ ఫొటోలతో నిండిపోతోంది. ఈ క్రమంలోనే చాట్జీపీటీకికేవలం ఒక గంటలో 10 లక్షలు యూజర్లు యాడ్ అయ్యారని ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్మన్ వెల్లడించారు. ఈ ఫీచర్ను అత్యధికంగా వినియోగించడం వల్ల తమ జీపీయూ (GPU) వ్యవస్థపై అధిక భారం పడుతోందని, అందుకే దీనికి లిమిట్ పెడుతున్నామని ఆల్ట్మన్ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే.