
సైప్రస్ అధికారిక పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం (జూన్ 15) లార్నాకా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు.సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ప్రధాని మోదీకి ఎయిర్ పోర్ట్లో సాదర స్వాగతం పలికారు. ప్రధాని మోదీ సైప్రియట్ నాయకత్వంతో ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు.వాణిజ్యం, సాంకేతికత, విద్య, సాంస్కృతిక మార్పిడిలో సహకారాన్ని పెంపొందించడంపై దృష్టి సారిస్తారు.