
భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలో భూమిపై కాలు మోపనున్నారు.అంతరిక్ష కేంద్రం (ISS)లో చిక్కుకున్న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లను తిరిగి భూమికి తీసుకురావడానికి నాసా, స్పేస్ఎక్స్ క్రూ-10 మిషన్ను చేపట్టాయి. ఫాల్కన్ 9 రాకెట్ మార్చి 14, 2025న శనివారం ఉదయం 4:33 గంటలకు అమెరికాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లి, స్టార్లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఆ వ్యోమనౌక, వారు లేకుండానే భూమికి తిరిగి వచ్చింది.