ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలన సృష్టించిన సుగాలి ప్రీతి కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుగాలి ప్రీతి కేసును సీబీఐకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీబీఐకు లేఖ రాయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎల్లుండి జరిగే కేబినెట్ సమావేశంలో కూడా ఈ అంశంపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

