అసెంబ్లీలో కీలకమైన అంశాలపై చర్చను పక్కన పెట్టేందుకే ప్రభుత్వం ఆటల పోటీలకు తెర తీస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ సర్కార్ సభను నడపలేకనే క్రీడా పోటీల ఎత్తుగడ వేసిందని ఆయన విమర్శించారు. ఇంత సీరియస్గా సభ జరుగుతున్న సమయంలో క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వడం ఏంటీ?అని ఆయన ప్రశ్నించారు. ఇదే విషయాన్ని తాను అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లగా ఆయన వద్ద ఎటువంటి సమాధానం లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

